logo

ప్రజలకు భరోసా కల్పించేందుకు బలగాల కవాతు

లోక్‌సభ ఎన్నికల్లో ప్రశాంతంగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవచ్చనే భరోసా కల్పించేందుకు కేంద్ర బలగాల కవాతు నిర్వహిస్తున్నట్లుగా ఎస్ఐ జగదీశ్వర్ తెలిపారు

Updated : 07 May 2024 20:31 IST

రాజోలి: లోక్‌సభ ఎన్నికల్లో ప్రశాంతంగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవచ్చనే భరోసా కల్పించేందుకు కేంద్ర బలగాల కవాతు నిర్వహిస్తున్నట్లుగా ఎస్ఐ జగదీశ్వర్ తెలిపారు. మంగళవారం ఆయన మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో 40 మంది సాయుధ బలగాలతో కలిసి గాంధీ చౌక్ నుంచి ప్రధాన వీధుల గుండా పోలీస్ ఠాణా వరకు కవాతు నిర్వహించారు. ఎవరూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించరాదని ప్రజలకు ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ భాస్కర్, పోలీసు సిబ్బంది తదితరులున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు