నాటారు.. నరికారు
హరితహారం కార్యక్రమంలో భాగంగా రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలు చెట్లుగా పెరిగి పచ్చదనంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. కొన్ని చోట్ల ముందుచూపు లేకుండా విద్యుత్తు లైన్ల కింద నాటినవి నరికివేతకు గురవుతున్నాయి.
వనపర్తి మండలం అంకూరు గ్రామ శివారులో నరికివేతకు గురైన చెట్లు
వనపర్తి న్యూటౌన్, అమరచింత, న్యూస్టుడే : హరితహారం కార్యక్రమంలో భాగంగా రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలు చెట్లుగా పెరిగి పచ్చదనంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. కొన్ని చోట్ల ముందుచూపు లేకుండా విద్యుత్తు లైన్ల కింద నాటినవి నరికివేతకు గురవుతున్నాయి. కొమ్మలకు తీగలు తగిలి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని 15 అడుగుల ఎత్తులో పెరిగిన చెట్లను నరికివేస్తున్నారు.
- వనపర్తి మండలంలోని కడుకుంట్ల, అంకూరు, పెద్దమందడి మండలం బలిజపల్లి, జంగమాయపల్లి, శ్రీరంగపూర్, అమరచింత మండలాల్లోని పలు గ్రామాల్లో హరితహారం చెట్లను నరికివేశారు.
- అమరచింత పురపాలక సంఘం వారు విద్యుత్తు ఉపకేంద్రం నుంచి పీజేపీ మస్తీపూర్ రహదారి మలుపు వరకు, అమరచింత - మరికల్ ప్రధాన రహదారి వెంట నాలుగు కి.మీ. మొక్కలు నాటించారు. వీటిపైన విద్యుత్తు లైన్ ఉండటంతో పెరిగిన చెట్ల కొమ్మలు తీగలకు తగులుతుండటంతో వాటిని నరికివేశారు.కొట్టిన కొమ్మలను తొలగించకపోవడంతో ఈదురు గాలులకు అవి రహదారి పైకి వచ్చి పడుతుండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. చొన్ని చోట్ల నిప్పుపెడుతున్నారు.
- హరితహారంలో భాగంగా చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన్ను ఆయా గ్రామపంచాయతీలు, పురపాలికలు నిర్వహిస్తున్నాయి. ఏటా జిల్లా వ్యాప్తంగా సుమారు 300 కి.మీ. మేర పొడవైన రహదారుల పక్కన మొక్కలు నాటుతున్నారు. ఉపాధి హామీ నిధులతో కంచె వేసి, నీళ్లు పోసి సంరక్షిస్తున్నారు. సరైన ప్రణాళిక లేకుండా నాటడంతో మొక్కలు చెట్లుగా పెరిగాక నరికివేతకు గురవుతున్నాయి.
- రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది మధ్య సమన్వయలోపంతో ప్రభుత్వ నిధులు వృథా కావడంతో పాటు పథకం లక్ష్యం నీరుగారుతోంది. రహదారి పక్కన ఎంత దూరంలో నాటాలి.. విద్యుత్తు లైన్లు ఉన్నాయా? లేవా? అవి గమనించకుండా కనీస అవగాహన లేకుండా మొక్కలు నాటారు.
- నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసి మొక్కల సంఖ్యను కాగితాల్లో చూపడానికి మాత్రమే సంబంధిత అధికారులు పనులు చేసున్నారన్న విషయం స్పష్టమవుతుంది. ముందు చూపు లేకుండా అధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. పదో విడత హరితహారంలోనైనా సంబంధితశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అవసరమైన మొక్కలు నాటి పర్యావరణ హితానికి దోహదపడాలని ప్రజలు కోరుతున్నారు.
అవసరమైనవి నాటుతాం: రహదారుల వెంట నాటిన మొక్కలను విద్యుత్తు అధికారులు వైర్లకు తాకుతున్నాయని తొలగిస్తున్నారు. చెట్లను తొలగిస్తున్నట్లు సమాచారం ఉంది. ఏపుగా పెరిగే మొక్కలు కాకుండా అనుకూలమైన రెయిన్ట్రీ, సీమతంగేడు, కానుగ వంటి మొక్కలను నాటుతాం.
నాగేంద్రం, ఇన్ఛార్జి పీడీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికారుల చోద్యం.. అటకెక్కిన వైద్యం
[ 20-05-2024]
వివిధ పరిశ్రమలు, సంస్థల్లో పనిచేసే కార్మికులు, చిరుద్యోగులు ప్రతి నెలా తమ జీతం నుంచి కొంత మొత్తం ఈఎస్ఐ(ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్) వైద్యసేవల కోసం రుసుంగా చెల్లిస్తుంటారు. -
కళ్లు మూసుకుంటే మోసమే
[ 20-05-2024]
వానాకాలం సాగుకు సమయం అసన్నమవుతోంది. -
నేటి నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష
[ 20-05-2024]
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) - 2024 సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జూన్ 6వ తేదీ వరకు రోజూ పరీక్ష నిర్వహిస్తారు. -
స్ట్రాంగ్రూంల వద్ద పకడ్బందీ భద్రత
[ 20-05-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్రూంల వద్ద నిరంతరం భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షించాలని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవి నాయక్ సూచించారు. -
పంచాయతీల్లో పైసల్లేవ్..!
[ 20-05-2024]
గ్రామపంచాయతీ పాలక మండలి గడువుకు ముందే అధికారుల ఒత్తిడితో పలు అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు ఇప్పటికీ వాటి బిల్లులు దక్కలేదు. -
డిజిటల్ విద్యకే అధిక ప్రాధాన్యం
[ 20-05-2024]
ఏటా సర్కారు బడులకు రూ.కోట్ల నిధులు మంజూరవుతున్నా.. వాటిని పూర్తి స్థాయిలో వినియోగించకపోవడంతో వెనక్కి వెళ్తున్న పరిస్థితులున్నాయి. -
సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
జిల్లాలో ఖరీఫ్ సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు 2024-25 సంవత్సరానికి సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేశారు. -
స్థానిక సమరానికి సమాయత్తం
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించింది. -
నాటే సమయం వచ్చింది.. మొక్కలేవీ?
[ 20-05-2024]
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. -
మళ్లీ చౌకగా నిత్యావసరాలు!
[ 20-05-2024]
రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు తక్కువ ధరకు ఇతర నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
విద్యార్థులను ప్రోత్సహించాలి: చిన్నారెడ్డి
[ 20-05-2024]
చదువుపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. -
నిర్వాసితులను మోసంచేసిన వారిపై చర్యలు తీసుకోండి
[ 20-05-2024]
అధిక వడ్డీల ఆశచూపి పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసం చేసిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 20-05-2024]
ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ బక్కన్న తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం.. కూలిన ప్రాంతం గుర్తింపు!
-
ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని.. తాతను కొట్టి చంపిన మనవళ్లు
-
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
-
వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
-
ఒట్టేశారు.. ఓటేశారు!.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు