దొంగల హల్చల్..
పట్టణాలు, గ్రామాల్లో దొంగలు కొత్త పంతాకు తెరదీసి చోరీలకు పాల్పడుతూ హల్చల్ చేస్తున్నారు. గతంలో రాత్రిళ్లు మాత్రమే దొంగతనాలకు పాల్పడేవారు. ఇప్పుడు పట్టపగలు సైతం చేస్తూ ఆందోళనకు గురిచేస్తున్నారు.
తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
నారాయణపేట, న్యూస్టుడే : పట్టణాలు, గ్రామాల్లో దొంగలు కొత్త పంతాకు తెరదీసి చోరీలకు పాల్పడుతూ హల్చల్ చేస్తున్నారు. గతంలో రాత్రిళ్లు మాత్రమే దొంగతనాలకు పాల్పడేవారు. ఇప్పుడు పట్టపగలు సైతం చేస్తూ ఆందోళనకు గురిచేస్తున్నారు. ఇతర రాష్ట్రాల ముఠాలతో చేతులు కలిపి చోరీలు చేస్తూ అందినకాడికి దోచుకెళ్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి సులువుగా తమ పనికానిచ్చేస్తున్నారు. ఎక్కువగా తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని నగలు, నగదు దోచుకెళ్తున్నారు. జిల్లాలో వరుస దొంగతనాలపై న్యూస్టుడే కథనం..
జిల్లాలో మచ్చుకు కొన్ని : నెల కిందట కోస్గి పట్టణంలో ఓ కుటుంబం ఇంటికి తాళంవేసి మరో గ్రామానికి వెళ్లగా దొంగలు తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో భద్రపర్చిన మూడు తులాల బంగారం, రూ.లక్షకు పైగా నగదు ఎత్తుకెళ్లారు. మరో ఉద్యోగి ఇంట్లోనూ తాళం పగులగొట్టి పట్టపగలే ఎవరూలేని సమయంలో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడి రూ.లక్ష నగదుతోపాటు విలువైన వస్తువులు దోచుకెళ్లారు. చోరీ చేస్తూ గ్రామస్థులకు పట్టుబడిన దొంగను విచారించి పోలీసులు కొంత వరకు బంగారం, నగదును రికవరీ చేశారు.
- మక్తల్ పట్టణంలోని ఓ ఉద్యోగి ఇంట్లో నెల కిందట చోరీ జరిగింది. వేసవికాలం కావడంతో ఓ కుటుంబం ఇంటి తలుపులు మూయకుండా ఆరుబయట నిద్రించారు. దొంగలు అదనుచూసి ఇంట్లో చొరబడి దాదాపు 12 తులాల బంగారం దోచుకెళ్లారు. మక్తల్ మండలంలోని కాట్రేవుపల్లి గ్రామంలో పక్క పక్కనే ఉన్న రెండు ఇళ్లలో రూ.5లక్షల వరకు దొంగలు దోచుకెళ్లారు.
- నర్వ మండలంలో ఇళ్లలో దొంగతనాలకు బదులుగా కోయిల్సాగర్ కాలువలో పంటపొలాలకు నీరుపెట్టేందుకు రైతులు ఏర్పాటుచేసుకున్న బోరుమోటార్లు, స్టార్టర్లు, కేబుల్వైర్లు దొంగిలించుకెళ్తున్నారు. రైతులు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదుచేసినా నేటికీ దొంగల ఆచూకీ మాత్రం లభించలేదు. రైతులకు రూ.వేలల్లో నష్టం జరుగుతుండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- దామరగిద్ద మండలం వత్తుగుండ్లలో ఇంటికి తాళంవేసి కిటికీలకు గ్రిల్స్ ఏర్పాటుచేయకపోవడంతో పట్టపగలు దొంగలు చోరీకీ పాల్పడ్డారు. పెద్దఎత్తున ఆభరణాలతోపాటు నగదును దొంగిలించారు.
- మరికల్ పట్టణంలోని రాములు ఇంట్లో మూడు రోజుల కిందట గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో చొరబడి 40 తులాల బంగారం, రూ.10లక్షలు నగదు దోచుకెళ్లారు. పోలీసు అధికారులు చోరీ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
- నాలుగు రోజుల కిందట పేటలో ఓ మద్యం దుకాణం, సూపర్మార్కెట్లో దొంగలు పడ్డారు. సూపర్ మార్కెట్లో విలువైన సామగ్రి, నగదును అందినకాడికి దండుకుని ఎత్తుకెళ్లారు. మద్యం దుకాణంలో దాదాపు రూ.50వేల నగదును దోచుకెళ్లారు.
గస్తీ చేస్తున్నా.. : జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి, మరికల్ పట్టణాల్లో ఆయా ప్రాంతాల్లో పోలీసులు వారి వాహనాలపై గస్తీ చేపడుతున్నా దొంగతనాలు మాత్రం ఆగడంలేదు. పట్టణాల్లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగలు పట్టుబడటం లేదు. పోలీసులు పకడ్బందీగా చర్యలు తీసుకొని చోరీలకు గురి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అప్రమత్తత అవసరం : దొంగతనాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనుమానితులు కనిపిస్తే తక్షణమే సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఇంటికి తాళంవేసి కిటికీ తలుపులు తీసి ఉంచరాదు. ఊరు వదిలివెళ్లిన వారు తాళాలువేసి పోలీసులకు సమచారం ఇవ్వాలి. పోలీసుల గస్తీ పెంచి చోరీలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. నగలు, పెద్ద మొత్తంలో నగదు ఇంట్లో ఉంచకుండా బ్యాంకుల్లో భద్రతపర్చుకోవడం మంచిదని కోస్గి, మక్తల్ సీఐలు సోమునర్సయ్య, చంద్రశేఖర్ చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతర్ రాష్ట్ర బండ లాగుడు పోటీలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
[ 19-05-2024]
మండలంలోని మహ్మదాపూర్ గ్రామంలో రెండు రోజులుగా వీరభద్రస్వామి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. -
చినుకు పడాలి.. చింత తీరాలి!
[ 19-05-2024]
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వరుణుడు ముఖం చాటేస్తున్నాడు. గత వానాకాలం నుంచి ఇప్పటి వరకు పరిస్థితిని గమనిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. సగటున 608.88 మి.మీటర్ల సాధారణ వర్షపాతానికిగాను 520.7 మి.మీ వర్షపాతమే నమోదయ్యింది. -
లక్ష్య సాధకులు
[ 19-05-2024]
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. నిత్య సాధనతో అత్యుత్తమ ర్యాంకులు సాధించి తమ కలలు సాకారం చేసుకునే దిశగా ముందడుగు వేశారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. -
రూ.8.40 కోట్ల నగదు.. 33వేల లీటర్ల మద్యం
[ 19-05-2024]
లోక్సభ ఎన్నికల వేళ పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు, మద్యం పట్టుబడ్డాయి. మార్చి 13న కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల ప్రకటన విడుదల చేసింది. వెంటనే మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 34 సరిహద్దు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
యువకుడి హత్య కేసులో 8 మందికి రిమాండ్
[ 19-05-2024]
మహబూబ్నగర్ పట్టణం బండమీదిపల్లిలోని మద్యం దుకాణం వద్ద గత నెలలో దాడి చేయగా యువకుడు మరణించిన కేసులో నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు. మహబూబ్నగర్ గ్రామీణ ఠాణా సీఐ గాంధీనాయక్ కథనం ప్రకారం. -
గ్రూప్-1 ప్రిలిమినరీకి పకడ్బందీ ఏర్పాట్లు
[ 19-05-2024]
జూన్ 9న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు జిల్లాల్లో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీసీలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించారు. -
లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి
[ 19-05-2024]
వచ్చే నెల 8వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి తెలిపారు. శనివారం మహబూబ్నగర్లోని కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ను పురస్కరించుకొని కలెక్టర్ రవినాయక్, -
రోడ్లకు మహర్దశ ఎప్పుడో..?
[ 19-05-2024]
గ్రామీణ ప్రాంతాలకు రహదారులు నిర్మించి రవాణా సౌకర్యం మెరుగుపర్చాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. మట్టి, కంకర తేలిన రోడ్లపై ప్రయాణాలు చేయలేక ప్రజలు నరకయాతన పడుతున్నారు. -
పారిశుద్ధ్య చర్యలేవీ?
[ 19-05-2024]
జిల్లాలోని నాలుగు పట్టణాల్లో రెండు రోజులుగా చిన్నపాటి ముసురు వర్షాలు పడుతున్నాయి. జూన్ మొదటి వారంలో వర్షాలు అధికంగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. -
గుట్టుగా మట్టి తరలింపు
[ 19-05-2024]
జిల్లాలో అనుమతులు లేకుండానే పుట్టుకొస్తున్న ఇటుక బట్టీలలో అక్రమాలు మాత్రం దండిగా కనిపిస్తున్నాయి. బట్టీల ఏర్పాటు నుంచి ఇటుక తరలింపు వరకు వివిధ స్థాయిల్లో సంబంధిత అధికారుల అనుమతులు తీసుకోకుండానే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. -
రూ.కోట్లు ఖర్చు.. వైద్యం దైవాధీనం
[ 19-05-2024]
సామాజిక ఆరోగ్య కేంద్రాలలో సరిపడా సిబ్బంది లేక రోగులకు వైద్యం అందటం లేదు. కోట్లాది రూపాయల వ్యయంతో అసుపత్రి భవనాలను నిర్మించినా ఉపయోగం లేకుండా పోతోంది. అత్యవసర పరిస్థితుల్లో రోగులను జిల్లా కేంద్రాలకు తరలిస్తున్నారు. -
తెగ తాగారు
[ 19-05-2024]
వేసవితాపం నుంచి ఉపశమనం పొందేందుకు జిల్లాలో మందుబాబులు తెగ తాగేశారు. వేసవితో పాటు ఎన్నికల సందర్భంగా మార్చి, ఏప్రిల్, మే నెలలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. -
40 ఎకరాలకు పాకిన మంటలు
[ 19-05-2024]
యాసంగిలో వరి పంటను యంత్రాలతో కోయించిన కొందరు రైతులు కొయ్యలకు నిప్పంటించడం వల్ల మంటలు గాలివాటానికి సమీప పొలాలకు వ్యాపించి నష్టాన్ని కలిగిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ