పాలమూరు ఎత్తిపోతల పూర్తికి కృషి : వంశీచంద్రెడ్డి
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని ఆ పార్టీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు ప్రజలు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు.
హన్వాడలో మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి
మహబూబ్నగర్ వ్యవసాయం, న్యూస్టుడే : కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని ఆ పార్టీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు ప్రజలు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు. బుధవారం రాత్రి హన్వాడ, మహబూబ్నగర్లోని తెలంగాణ చౌరస్తాలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే మరింత అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. లోక్సభ ఎన్నికలను ప్రజలు సీరియస్గా తీసుకోవాలన్నారు. మహబూబ్నగర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీటిని అందించే బాధ్యత తాను తీసుకుంటానని వంశీచంద్రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కల్పిస్తామన్నారు. ప్రతి తండాకు రోడ్లు నిర్మిస్తామని, అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని చెప్పారు. భారాస, భాజపా నాయకులు మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి జిల్లాను అభివృద్ధి చేసుకుందామని, ఇందుకు ఆయనకు అండగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నాయకులు వంశీచంద్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీకాంత్గౌడ్, నాయకులు ఎన్పీ వెంకటేశ్, ఏపీ మిథున్కుమార్రెడ్డి, సీరాజ్ ఖాద్రి, సుధాకర్రెడ్డి, మహేందర్, కృష్ణయ్య, నవనీత పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
[ 19-05-2024]
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జాతర సందర్భంగా వడ్డేపల్లి పురపాలిక పరిధిలోని పైపాడ్ గ్రామంలో ఆదివారం కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. -
సుందరయ్యకు ఘన నివాళి
[ 19-05-2024]
కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా సీపీఎమ్ పార్టీ నాయకులు, కేవీపీఎస్, సీఐటీయూ నాయకులు ఆదివారం ఘనంగా నివాళులు అర్పించారు. -
అంతర్ రాష్ట్ర బండ లాగుడు పోటీలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
[ 19-05-2024]
మండలంలోని మహ్మదాపూర్ గ్రామంలో రెండు రోజులుగా వీరభద్రస్వామి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. -
చినుకు పడాలి.. చింత తీరాలి!
[ 19-05-2024]
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వరుణుడు ముఖం చాటేస్తున్నాడు. గత వానాకాలం నుంచి ఇప్పటి వరకు పరిస్థితిని గమనిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. సగటున 608.88 మి.మీటర్ల సాధారణ వర్షపాతానికిగాను 520.7 మి.మీ వర్షపాతమే నమోదయ్యింది. -
లక్ష్య సాధకులు
[ 19-05-2024]
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. నిత్య సాధనతో అత్యుత్తమ ర్యాంకులు సాధించి తమ కలలు సాకారం చేసుకునే దిశగా ముందడుగు వేశారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి. -
రూ.8.40 కోట్ల నగదు.. 33వేల లీటర్ల మద్యం
[ 19-05-2024]
లోక్సభ ఎన్నికల వేళ పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు, మద్యం పట్టుబడ్డాయి. మార్చి 13న కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల ప్రకటన విడుదల చేసింది. వెంటనే మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 34 సరిహద్దు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
యువకుడి హత్య కేసులో 8 మందికి రిమాండ్
[ 19-05-2024]
మహబూబ్నగర్ పట్టణం బండమీదిపల్లిలోని మద్యం దుకాణం వద్ద గత నెలలో దాడి చేయగా యువకుడు మరణించిన కేసులో నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు. మహబూబ్నగర్ గ్రామీణ ఠాణా సీఐ గాంధీనాయక్ కథనం ప్రకారం. -
గ్రూప్-1 ప్రిలిమినరీకి పకడ్బందీ ఏర్పాట్లు
[ 19-05-2024]
జూన్ 9న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు జిల్లాల్లో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీసీలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించారు. -
లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి
[ 19-05-2024]
వచ్చే నెల 8వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి తెలిపారు. శనివారం మహబూబ్నగర్లోని కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ను పురస్కరించుకొని కలెక్టర్ రవినాయక్, -
రోడ్లకు మహర్దశ ఎప్పుడో..?
[ 19-05-2024]
గ్రామీణ ప్రాంతాలకు రహదారులు నిర్మించి రవాణా సౌకర్యం మెరుగుపర్చాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. మట్టి, కంకర తేలిన రోడ్లపై ప్రయాణాలు చేయలేక ప్రజలు నరకయాతన పడుతున్నారు. -
పారిశుద్ధ్య చర్యలేవీ?
[ 19-05-2024]
జిల్లాలోని నాలుగు పట్టణాల్లో రెండు రోజులుగా చిన్నపాటి ముసురు వర్షాలు పడుతున్నాయి. జూన్ మొదటి వారంలో వర్షాలు అధికంగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. -
గుట్టుగా మట్టి తరలింపు
[ 19-05-2024]
జిల్లాలో అనుమతులు లేకుండానే పుట్టుకొస్తున్న ఇటుక బట్టీలలో అక్రమాలు మాత్రం దండిగా కనిపిస్తున్నాయి. బట్టీల ఏర్పాటు నుంచి ఇటుక తరలింపు వరకు వివిధ స్థాయిల్లో సంబంధిత అధికారుల అనుమతులు తీసుకోకుండానే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. -
రూ.కోట్లు ఖర్చు.. వైద్యం దైవాధీనం
[ 19-05-2024]
సామాజిక ఆరోగ్య కేంద్రాలలో సరిపడా సిబ్బంది లేక రోగులకు వైద్యం అందటం లేదు. కోట్లాది రూపాయల వ్యయంతో అసుపత్రి భవనాలను నిర్మించినా ఉపయోగం లేకుండా పోతోంది. అత్యవసర పరిస్థితుల్లో రోగులను జిల్లా కేంద్రాలకు తరలిస్తున్నారు. -
తెగ తాగారు
[ 19-05-2024]
వేసవితాపం నుంచి ఉపశమనం పొందేందుకు జిల్లాలో మందుబాబులు తెగ తాగేశారు. వేసవితో పాటు ఎన్నికల సందర్భంగా మార్చి, ఏప్రిల్, మే నెలలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. -
40 ఎకరాలకు పాకిన మంటలు
[ 19-05-2024]
యాసంగిలో వరి పంటను యంత్రాలతో కోయించిన కొందరు రైతులు కొయ్యలకు నిప్పంటించడం వల్ల మంటలు గాలివాటానికి సమీప పొలాలకు వ్యాపించి నష్టాన్ని కలిగిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు