logo

పథకాల అమలుపై మంత్రిని నిలదీసిన మహిళలు

ప్రభుత్వ పథకాలు ఇంతవరకు అమలు కావడం లేదని, ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కొల్లాపూర్‌లోని 11వ వార్డులో మహిళలు మంత్రి జూపల్లి కృష్ణారావును నిలదీశారు. బుధవారం పట్టణంలోని 11, 10వ వార్డుల్లో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 09 May 2024 06:05 IST

కొల్లాపూర్‌ 11వ వార్డులో ప్రచారం నిర్వహిస్తుండగా మంత్రి జూపల్లి కృష్ణారావును నిలదీసిన మహిళలు

కొల్లాపూర్‌ పట్టణం, న్యూస్‌టుడే : ప్రభుత్వ పథకాలు ఇంతవరకు అమలు కావడం లేదని, ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కొల్లాపూర్‌లోని 11వ వార్డులో మహిళలు మంత్రి జూపల్లి కృష్ణారావును నిలదీశారు. బుధవారం పట్టణంలోని 11, 10వ వార్డుల్లో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తుండగా మహిళలు అడ్డుతగిలారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. మీరు చెప్పిన పథకాలేవీ ఇప్పటివరకు అందలేదని మళ్లీ మీకు ఓటు వేసి మేము మోసపోదలుచుకోలేదని మహిళలందరు మూకుమ్మడిగా అన్నారు. వార్డు కౌన్సిలర్‌ కరుణ భర్త, కాంగ్రెస్‌ నాయకుడు మహేశ్‌ మహిళలను సమాదాయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఎన్నికల అనంతరం పక్కాగా అమలు చేస్తామన్నారు. భాజపా, భారాస రెండు పార్టీలు దొందుదొందే అన్నారు. రాష్ట్రంలో అధికారంలో లేని పార్టీలకు ఓటు వేస్తే వ్యర్థమన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు