అధిక స్థానాల్లో గెలిస్తే రాష్ట్ర రాజకీయాలనే మారుస్తాం
లోకసభ ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ స్థానాల్లో భారాస అభ్యర్థులు గెలిస్తే, ఆరు నెలల్లో కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను మారుస్తారని, మన జీవితాలను బాగుచేస్తారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న గద్వాల జిల్లాను నడిగడ్డ పౌరుషం యువత నిలబెట్టుకుంటుందని తనకు నమ్మకం ఉందన్నారు.
గద్వాల రోడ్షోలో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
రోడ్షోలో మాట్లాడుతున్న కేటీఆర్, చిత్రంలో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, బండ్ల కృష్ణమోహన్రెడ్డి తదితరులు
గద్వాల కలెక్టరేట్, న్యూస్టుడే: లోకసభ ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ స్థానాల్లో భారాస అభ్యర్థులు గెలిస్తే, ఆరు నెలల్లో కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను మారుస్తారని, మన జీవితాలను బాగుచేస్తారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న గద్వాల జిల్లాను నడిగడ్డ పౌరుషం యువత నిలబెట్టుకుంటుందని తనకు నమ్మకం ఉందన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు నుంచి 1.40 లక్షల ఎకరాలకు సాగునీరు మేము అందిస్తే, కాంగ్రెస్ నాయకులు కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంటు బోర్డుకు అప్పగిస్తూ లేఖలు రాశారని ఎద్దేవా చేశారు. జూరాల నుంచి జిల్లా ప్రజలకు తాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి జలదీక్ష చేస్తే తప్ప స్పందించలేదన్నారు. ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి ఒక పక్క కేసీఆర్ను తిడుతారు, మరో పక్క ఆరు గ్యారంటీల అమలు కోసం తేదీలను మారుస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో లక్షన్నర పెళ్లిళ్లు జరిగాయని, ఆ లెక్కన మా ఆడపడుచులకు లక్షన్నర తులాల బంగారం సీఎం బకాయి పడ్డారని దాని గురించి అడిగితే దేవుళ్ల మీద ఓట్లు వేస్తూ తప్పించుకుని తిరుగుతున్నారని ఆరోపించారు.
అమరుల ఆశయాల సాధనకు..: భారాస ఎంపీ అభ్యర్థి ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ ఈ ఎన్నికలు తెలంగాణ అమరుల త్యాగానికి, పచ్చి అబద్దాలకు మధ్య జరుగుతున్న యుద్ధం లాంటివని ప్రజలు అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను గెలిపించాలన్నారు. భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేయడంతో పాటు, రిజర్వేషన్లు రద్దు చేయడానికి వెనుకంజ వేయదని ఆరోపించారు. కేటీఆర్ ధరూర్మెట్టు నుంచి పాత బస్టాండ్ వరకు నిర్వహించిన రోడ్డుషోలో ప్రజలకు అభివాదాలు చేసుకుంటూ ముందుకు కదిలారు. గాంధీచౌక్, పాత బస్టాండ్ల వద్ద ఆయనకు గజమాలతో భారాస శ్రేణులు సత్కరించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికారుల చోద్యం.. అటకెక్కిన వైద్యం
[ 20-05-2024]
వివిధ పరిశ్రమలు, సంస్థల్లో పనిచేసే కార్మికులు, చిరుద్యోగులు ప్రతి నెలా తమ జీతం నుంచి కొంత మొత్తం ఈఎస్ఐ(ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్) వైద్యసేవల కోసం రుసుంగా చెల్లిస్తుంటారు. -
కళ్లు మూసుకుంటే మోసమే
[ 20-05-2024]
వానాకాలం సాగుకు సమయం అసన్నమవుతోంది. -
నేటి నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష
[ 20-05-2024]
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) - 2024 సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జూన్ 6వ తేదీ వరకు రోజూ పరీక్ష నిర్వహిస్తారు. -
స్ట్రాంగ్రూంల వద్ద పకడ్బందీ భద్రత
[ 20-05-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్రూంల వద్ద నిరంతరం భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షించాలని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవి నాయక్ సూచించారు. -
పంచాయతీల్లో పైసల్లేవ్..!
[ 20-05-2024]
గ్రామపంచాయతీ పాలక మండలి గడువుకు ముందే అధికారుల ఒత్తిడితో పలు అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు ఇప్పటికీ వాటి బిల్లులు దక్కలేదు. -
డిజిటల్ విద్యకే అధిక ప్రాధాన్యం
[ 20-05-2024]
ఏటా సర్కారు బడులకు రూ.కోట్ల నిధులు మంజూరవుతున్నా.. వాటిని పూర్తి స్థాయిలో వినియోగించకపోవడంతో వెనక్కి వెళ్తున్న పరిస్థితులున్నాయి. -
సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
జిల్లాలో ఖరీఫ్ సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు 2024-25 సంవత్సరానికి సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేశారు. -
స్థానిక సమరానికి సమాయత్తం
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించింది. -
నాటే సమయం వచ్చింది.. మొక్కలేవీ?
[ 20-05-2024]
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. -
మళ్లీ చౌకగా నిత్యావసరాలు!
[ 20-05-2024]
రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు తక్కువ ధరకు ఇతర నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
విద్యార్థులను ప్రోత్సహించాలి: చిన్నారెడ్డి
[ 20-05-2024]
చదువుపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. -
నిర్వాసితులను మోసంచేసిన వారిపై చర్యలు తీసుకోండి
[ 20-05-2024]
అధిక వడ్డీల ఆశచూపి పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసం చేసిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 20-05-2024]
ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ బక్కన్న తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
-
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
-
ప్రారంభమైన ‘టెట్’ ఎగ్జామ్.. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM