logo

పట్టణంలోని పలు వార్డుల్లో భారాస ఎన్నికల ప్రచారం

నాగర్‌కర్నూలు  భారాస ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మన అలంపూర్‌ బిడ్డ అని, ఆయనను గెలిపించుకుందామని వడ్డేపల్లి మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌ కరుణ అన్నారు.

Published : 09 May 2024 12:06 IST

రాజోలి: నాగర్‌కర్నూలు  భారాస ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మన అలంపూర్‌ బిడ్డ అని, ఆయనను గెలిపించుకుందామని వడ్డేపల్లి మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌ కరుణ అన్నారు. మ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఆదేశాల మేరకు గురువారం ఆమె వడ్డేపల్లి పట్టణంలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉన్నత చదువులు చదివి, గుర్తింపు పొందిన ఐపీఎస్‌ అధికారిగా, గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి .. ఎంపీగా గెలిస్తే మన బతుకులు బాగుపడతాయని ఆమె ఓటర్లకు సూచించారు. మోసపూరిత హామీలతో ఓట్లు అడుగుతున్న కాంగ్రెస్‌, భాజపాలకు ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలన్నారు. ప్రచారంలో ఆమెతోపాటు  నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని