పాలమూరులో ప్రచార హోరు
షెడ్యూల్ వచ్చిన తర్వాత భాజపా అగ్రనేతలు ఎవరూ కూడా ఉమ్మడి మహబూబ్నగర్లో పర్యటించలేదు. మహబూబ్నగర్కు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ, నాగర్కర్నూల్కు గుజరాత్ సీఎం భూపేంద్రపటేల్ వచ్చారు
షెడ్యూల్ వచ్చిన తర్వాత భాజపా అగ్రనేతలు ఎవరూ కూడా ఉమ్మడి మహబూబ్నగర్లో పర్యటించలేదు. మహబూబ్నగర్కు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ, నాగర్కర్నూల్కు గుజరాత్ సీఎం భూపేంద్రపటేల్ వచ్చారు. షెడ్యూల్ రాకముందు నాగర్కర్నూల్కు ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొన్నారు. తర్వాత అగ్రనేతలు ఎవరూ బహిరంగ సభలో పాల్గొని ప్రచారం నిర్వహించలేదు. మహబూబ్నగర్లో ఈసారి కమలం జెండా ఎగరేయాలని ఆ పార్టీ భావిస్తోంది. మోదీ ప్రభంజనంలో మహబూబ్నగర్ స్థానంలో గెలిచి తీరుతామన్న ధీమాను పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. నేడు మోదీ ఎన్నికల ప్రచారానికి వస్తుండటంతో ఆ ప్రభావం కచ్చితంగా ఓటర్లపై ఉంటుందని పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా కావడంతో మోదీ చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.
నేడు పేటకు ప్రధాని, మక్తల్కు సీఎం
ఈనాడు, మహబూబ్నగర్: సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు జోరు పెంచారు. ప్రత్యర్థులపై విమర్శలతో ప్రసంగాల హోరు వినిపించనున్నారు. పాలమూరులో అగ్రనేతల పర్యటన అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ నేపథ్యంలో శుక్రవారం ప్రధాని మోదీ, సీఎం రేవంత్రెడ్డి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. నారాయణపేటలో ప్రధాని, అదే జిల్లా మక్తల్లో సీఎం ఎన్నికల ప్రచారం ఉంది. అది కూడా మధ్యాహ్నం 3 గంటలకు ఇద్దరిదీ ఒకే సమయంలో సభలు ఉండటంతో అందరి చూపు నారాయణపేటపై పడింది. ఓవైపు భాజపా మహబూబ్నగర్ను కంచుకోటగా భావించి ఈసారి ఎలాగైనా ఈ స్థానాన్ని గెలుచుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా కావడంతో ఈ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకుని మరోసారి పాలమూరులో సత్తా చాటాలని భావిస్తున్నారు.
పోటాపోటీగా ఏర్పాట్లు..: అటు ప్రధాని మోదీ సభ.. ఇటు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సభను విజయవంతం చేయడానికి భాజపా, కాంగ్రెస్ పోటాపోటీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. నారాయణపేటలోని మినీ స్టేడియంలో ప్రధాని సభ నిర్వహిస్తున్నారు. మక్తల్లోని కొత్తగార్లపల్లి రోడ్డులోని మైదానంలో సీఎం సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రెండు సభలకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి తమ బలాలను చాటుకోవాలని రెండు పార్టీలూ భావిస్తున్నాయి. కనీసం 25వేల మందికి తక్కువగా కాకుండా ప్రజల్ని తరలించేలా ఏర్పాటు చేస్తున్నారు. రెండు పార్టీలు పోటాపోటీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు కడుతున్నాయి. ఒకే జిల్లాలో అదీ కూడా కూతవేటు దూరంలోనే పీఎం, సీఎం పర్యటన ఉండటంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
మక్తల్లో నేడు సీఎం రేవంత్రెడ్డి ప్రచార సభ ఉండటంతో ఆసక్తి నెలకొంది. మహబూబ్నగర్ లోక్సభ స్థానాన్ని ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి విజయం కోసం సీఎం విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే కొడంగల్, మద్దూరు, నారాయణపేట, మహబూబ్నగర్, కొత్తకోటలో సీఎం పర్యటించారు. శుక్రవారం మక్తల్తోపాటు షాద్నగర్లో జరిగే ఎన్నికల ప్రచారంలో సీఎం పాల్గొననున్నారు. షెడ్యూల్ వెలువడిన తర్వాత మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని జడ్చర్ల మినహా మిగతా ఆరు నియోజకవర్గాల్లో రేవంత్రెడ్డి ప్రచారం చేపట్టడంతో ఈ ఎన్నికపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తేటతెల్లమవుతోంది. మోదీ పర్యటన నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి చేసే ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. భాజపాను లక్ష్యంగా చేసుకునే మక్తల్, షాద్నగర్లో రేవంత్ ప్రసంగం ఉంటుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశ నుంచే జీవిత లక్ష్యాలను ఎంచుకోవాలి: ఎస్పీ
[ 20-05-2024]
విద్యార్థి దశ నుంచే జీవిత లక్ష్యాలను ఎంచుకొని ప్రణాళికతో చదువుతూ ముందుకు వెళ్లాలని జిల్లా ఎస్పీ రితిరాజ్ అన్నారు. -
పంచాయతీల అభివృద్ధి వివరాలు నమోదు చేయాలి
[ 20-05-2024]
అన్ని గ్రామ పంచాయతీలలో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు, సమగ్ర సమాచారాన్ని పీడీఐ (పంచాయతీ డెవలప్ మెంట్ ఇండెక్స్) లాగిన్లో నమోదు చేయాలని ఎంపీడీవో రమేశ్కుమార్ అన్నారు. -
‘నేతన్నకు చేయూత’ నిధులు అందించాలని వినతి
[ 20-05-2024]
చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న త్రిఫ్టుఫండ్ (నేతన్నకు చేయూత) పథకం నిధులు అందించేలా చర్యలు తీసుకోవాలని రాజోలి చేనేత కార్మికులు ఆ శాఖ ఏడీ గోవిందయ్యకు సోమవారం విన్నవించారు. -
అధికారుల చోద్యం.. అటకెక్కిన వైద్యం
[ 20-05-2024]
వివిధ పరిశ్రమలు, సంస్థల్లో పనిచేసే కార్మికులు, చిరుద్యోగులు ప్రతి నెలా తమ జీతం నుంచి కొంత మొత్తం ఈఎస్ఐ(ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్) వైద్యసేవల కోసం రుసుంగా చెల్లిస్తుంటారు. -
కళ్లు మూసుకుంటే మోసమే
[ 20-05-2024]
వానాకాలం సాగుకు సమయం అసన్నమవుతోంది. -
నేటి నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష
[ 20-05-2024]
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) - 2024 సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జూన్ 6వ తేదీ వరకు రోజూ పరీక్ష నిర్వహిస్తారు. -
స్ట్రాంగ్రూంల వద్ద పకడ్బందీ భద్రత
[ 20-05-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్రూంల వద్ద నిరంతరం భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షించాలని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవి నాయక్ సూచించారు. -
పంచాయతీల్లో పైసల్లేవ్..!
[ 20-05-2024]
గ్రామపంచాయతీ పాలక మండలి గడువుకు ముందే అధికారుల ఒత్తిడితో పలు అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు ఇప్పటికీ వాటి బిల్లులు దక్కలేదు. -
డిజిటల్ విద్యకే అధిక ప్రాధాన్యం
[ 20-05-2024]
ఏటా సర్కారు బడులకు రూ.కోట్ల నిధులు మంజూరవుతున్నా.. వాటిని పూర్తి స్థాయిలో వినియోగించకపోవడంతో వెనక్కి వెళ్తున్న పరిస్థితులున్నాయి. -
సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
జిల్లాలో ఖరీఫ్ సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు 2024-25 సంవత్సరానికి సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేశారు. -
స్థానిక సమరానికి సమాయత్తం
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించింది. -
నాటే సమయం వచ్చింది.. మొక్కలేవీ?
[ 20-05-2024]
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. -
మళ్లీ చౌకగా నిత్యావసరాలు!
[ 20-05-2024]
రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు తక్కువ ధరకు ఇతర నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
విద్యార్థులను ప్రోత్సహించాలి: చిన్నారెడ్డి
[ 20-05-2024]
చదువుపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. -
నిర్వాసితులను మోసంచేసిన వారిపై చర్యలు తీసుకోండి
[ 20-05-2024]
అధిక వడ్డీల ఆశచూపి పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసం చేసిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 20-05-2024]
ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ బక్కన్న తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ