వేతనాలు రాక వెతలు
పల్లెలను పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం కష్టపడి పని చేస్తున్న కార్మికులకు సకాలంలో వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు.
చెత్త సేకరిస్తున్న పంచాయతీ కార్మికులు
న్యూస్టుడే, సిద్దిపేట అర్బన్: పల్లెలను పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం కష్టపడి పని చేస్తున్న కార్మికులకు సకాలంలో వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు గ్రామాల్లో పేరుకున్న చెత్తాచెదారం తొలగిస్తున్నారు. ప్రతి నెల కార్మికులకు వేతనాలు రావడంల లేదు. కుటుంబాలను పోషించుకోవడానికి అవస్థలు పడుతున్నామని గ్రామ పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 499 పంచాయతీలు ఉండగా దాదాపు 2500 మంది కార్మికులు పనులు చేస్తున్నారు. వీరికి ప్రభుత్వం ఒక్కొక్క కార్మికుడికి ప్రతి నెల రూ.8500 అందిస్తోంది. కొద్ది నెలలుగా పంచాయతీలకు రావాల్సిన నిధులు విడుదల కాకపోవడంతో వేతనాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని అధికారులు చెబుతున్నారు. కొన్ని మేజర్ పంచాయతీలకు ఇతరత్రా ఆదాయం వస్తోంది. మిగతాచోట్ల ఇబ్బందిగా మారిందని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు.
అధిక పనిభారం
పంచాయతీలకు ప్రభుత్వం ప్రతి నెల జమ చేస్తున్న నిధుల్లో నుంచి ముందుగా వేతనాలను చెల్లించేవారు. ప్రతి నెల 5వ తేదీలోగా కార్మికుల ఖాతాల్లో జమ చేసేవారు. ప్రస్తుతం కార్యదర్శులు బిల్లులు చేసి చెక్కులు వేస్తున్నా నగదు కార్మికుల ఖాతాల్లో జమ కావడం లేదు. నిధులున్నా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం మల్టీపర్పస్ విధానాన్ని అమల్లోకి తీసుకురావడంతో కార్మికులు అన్ని రకాల పనులు చేయాల్సి వస్తోంది. సిబ్బందిపై పని భారం పెరిగింది. పెద్ద పంచాయతీల్లో నలుగురు, ఐదుగురు, చిన్నవాటిల్లో ఇద్దరు, ముగ్గురు ఉన్నారు. ట్రాక్టరుపై ఉదయం వేళ ఇంటింటికీ తిరుగుతూ చెత్త సేకరిస్తారు. డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. మురుగు కాల్వలు శుభ్రం చేస్తున్నారు.
అప్పులు చేయాల్సి వస్తోంది
- మహేశ్, పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు రావడం లేదు. ఈ నెల 13న కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టాం. ఇంకా అందలేదు. కుటుంబ పోషణ భారమై అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం తక్షణం స్పందించి ఖాతాల్లో జమ చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధికి భరోసా.. గెలుపునకు దిశానిర్దేశం
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్షెట్కార్ను లక్ష మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించారు. -
‘రాజీనామాలతో కొత్త నాటకం’
[ 27-04-2024]
రాజీనామాల పేరుతో మాజీ మంత్రి హరీశ్రావు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఇద్దరూ రాజీనామాలు చేసేవారు కాదు, పనిచేసే వారు కాదని విమర్శించారు. -
సగం కట్టి.. వదిలిపెట్టి
[ 27-04-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పురపాలికలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ఏడాదిగా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పురపాలికల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం పూనుకుంది. -
విధుల్లో నిర్లక్ష్యం తగదు
[ 27-04-2024]
విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం తగదని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దశంకరంపేట పీహెచ్సీని సందర్శించారు. ఆస్పత్రి నిర్వహణ తీరు, ప్రసూతి వివరాలను పరిశీలించారు. -
విద్యార్థి అధ్యయనం.. విజ్ఞాన కౌశలం
[ 27-04-2024]
విద్యార్థిలో దాగిన విజ్ఞాన తృష్ణను వెలికితీసి.. నూతన ఆవిష్కరణలకు కళాశాల విద్యా శాఖ కృషి చేస్తోంది. వారి కృషి ఫలితంగా ఏటా నిర్వహిస్తున్న ‘జిజ్ఞాస’ పోటీల్లో పలువురు ప్రతిభ చాటుతున్నారు. -
పరిశీలిస్తారు.. నివేదిస్తారు..
[ 27-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యం మనందరికీ తెలిసిందే. ఎవరికీ ఎక్కువ ఓట్లు పడితే వారే పాలకపక్షాలుగా గద్దెనెక్కవచ్చు. నిర్ణీత వ్యవధిలో నిర్వహించే ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగాలి. -
ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. స్వేచ్ఛాయుతంగా ఓటు వేసేందుకు సకల సౌకర్యాలు కల్పించిన ఎన్నికల సంఘం.. ఓటర్లకు పోల్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఉల్లంఘనులకు ముకుతాడు
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ గడువు ముగిసింది. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. -
భారాస అక్రమాలు బయటపడుతున్నాయి
[ 27-04-2024]
బీసీ బిడ్డ నీలం మధుకు సీఎం రేవంత్రెడ్డి టిక్కెట్ ఇచ్చారని.. ఇక గెలిపించుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. సిద్దిపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, పార్టీ కార్యాలయంలో సమావేశం శుక్రవారం జరిగాయి. -
రాజీనామా పత్రం రాసి పెట్టుకో హరీశ్రావు: పొన్నం
[ 27-04-2024]
వచ్చే ఆగస్టు 15 నాటికి తమ పార్టీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతుందని, మాజీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ముందుగానే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రం రాసి పెట్టుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
53 ఆమోదం.. ఒకటి తిరస్కరణ
[ 27-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లలో ఒక అభ్యర్థి నామపత్రాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.