logo

మంత్రాలు చేస్తున్నారని.. చెట్టుకు కట్టేసి..

మంత్రాలు చేస్తున్నారన్న నెపంతో ఇద్దరిని చెట్టుకు కట్టేసిన ఘటన నర్సాపూర్‌ మండలం పెద్దచింతకుంట పరిధి పాప్య తండాలో చోటుచేసుకుంది.

Updated : 16 Sep 2023 09:37 IST

చెట్టుకు కట్టేసిన నరేష్‌, భాస్కర్‌

నర్సాపూర్‌ రూరల్‌, న్యూస్‌టుడే: మంత్రాలు చేస్తున్నారన్న నెపంతో ఇద్దరిని చెట్టుకు కట్టేసిన ఘటన నర్సాపూర్‌ మండలం పెద్దచింతకుంట పరిధి పాప్య తండాలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ శివకుమార్‌ తెలిపిన వివరాలు.. తండాకు చెందిన నరేష్‌, ముడావత్‌ భాస్కర్‌, నేనావత్‌ భాస్కర్‌లు గురువారం అమావాస్య ఉండగా, అర్ధరాత్రి కొంతమంది ఇళ్ల వద్ద నిమ్మకాయలు, పసుపు కుంకుమ, పచ్చిమిర్చి వేస్తున్నారు. దీన్ని గమనించిన తండావాసులు వారిని పట్టుకుని నిలదీశారు. అనంతరం ఓ చెట్టుకు కట్టేసి కొట్టారు. ఏం చేశారని నిలదీశారు. నిమ్మకాయలను వారితోనే తీయించారు. శుక్రవారం పంచాయితీ పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి ఆరా తీశారు. కట్టేసి ఉన్న ముగ్గురిని నర్సాపూర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు వారిని కొట్టిన రమావత్‌ ధర్మ, రవి, గన్యాలపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌ఐ శివకుమార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని