ఒకే నియోజకవర్గం.. మూడుసార్లు మార్పు
రెండు జిల్లాల పరిధిలో ఉన్న దుబ్బాక నియోజకవర్గం.. మూడు సార్లు రూపాంతరం చెందింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖËర్రావు దుబ్బాకలోనే చదువుకున్నారు. పట్టణంలోని రామసముద్రం చెరువుకట్టపై కూర్చొని కేసీఆర్ పద్యాలు రాశారు.
దుబ్బాక ప్రత్యేకం
న్యూస్టుడే, చేగుంట
రెండు జిల్లాల పరిధిలో ఉన్న దుబ్బాక నియోజకవర్గం.. మూడు సార్లు రూపాంతరం చెందింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు దుబ్బాకలోనే చదువుకున్నారు. పట్టణంలోని రామసముద్రం చెరువుకట్టపై కూర్చొని కేసీఆర్ పద్యాలు రాశారు. నియోజకవర్గం ప్రధానంగా సిద్దిపేట జిల్లాలో ఉన్నా మెదక్ జిల్లాలోనూ విస్తరించి ఉంది.
ముందుగా రాజగోపాల్పేట
మొదట ఈ నియోజకవర్గం 1952లో ప్రస్తుతమున్న నంగునూరు మండలంలోని రాజగోపాల్పేటగా ఉండేది. ఒకసారి మాత్రమే ఇక్కడి నుంచి శాసనసభ ఎన్నికలు జరిగాయి. 1957లో దొమ్మాటగా మార్పు చేశారు. దౌల్తాబాద్ మండలంలో ఉండే గ్రామం దొమ్మాట. నియోజకవర్గ కార్యకలాపాలు దుబ్బాకలోనే జరిగేవి. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో దొమ్మాట పేరును దుబ్బాకగా చేశారు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, మిరుదొడ్డి, దౌల్తాబాద్, తొగుట, రాయపోల్, అగ్బర్పేట-భూంపల్లి మండలాలతో పాటు మెదక్ జిల్లాలోని చేగుంట, నార్సింగి, మాసాయిపేట మండలాలు దుబ్బాక నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నాయి.
కాంగ్రెస్ 5, తెదేపా 4, భారాస 4
ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఐదు సార్లు విజయం సాధించింది. తెదేపా నాలుగు, భారాస నాలుగు సార్లు విజయం సాధించాయి. రెండు సార్లు స్వతంత్రులు, ఒక్కొక్కసారి పీడీఎఫ్, భాజపా విజయం పొందాయి. దాదాపుగా ప్రధాన పార్టీలకు ఓటర్లు పట్టం కట్టడం విశేషం. ఉమ్మడి మెదక్ జిల్లాలో తక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గం దుబ్బాకయే. ఇక్కడ రెండు సార్లు ఉప ఎన్నిక జరిగింది. ఒకసారి భారాస(తెరాస), మరోసారి భాజపా గెలుపొందాయి.
విశేషాలు
- చంద్రబాబునాయుడు హయాంలో ఎమ్మెల్యే ముత్యంరెడ్డి మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ హయాంలో తితిదే బోర్డు సభ్యుడిగా, శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్గా చేశారు.
- భారాస హయాంలో సోలిపేట రామలింగారెడ్డి సైతం శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్గా పనిచేశారు.
- సీఎం కేసీఆర్ చదువుకున్న పాఠశాలను అన్ని హంగులతో పునర్నిర్మించారు.
- దేశంలో అతిపొడవైన 44వ జాతీయ రహదారి, సికింద్రాబాద్-ముథ్కేడ్ రైలు మార్గం ఈ నియోజకవర్గం గుండా వెళ్తోంది.
- చేగుంటలో పరిశ్రమలు ఉండటంతో 12 రాష్ట్రాలకు చెందినవారు నివసిస్తున్నారు.
శాసనసభ్యులు
- కె.వి.నారాయణరెడ్డి (1952, స్వతంత్ర, రాజగోపాల్పేట)
- అనంతరెడ్డి (1957, పీడీఎఫ్)
- ఖాజామొహినొద్దీన్ (1962, కాంగ్రెస్)
- భీంరెడ్డి (1967, స్వతంత్ర)
- రాంచంద్రారెడ్డి (1972, కాంగ్రెస్)
- ఐరేని లింగయ్య (1978, 1983, కాంగ్రెస్)
- డి.రాంచంద్రారెడ్డి (1985, తెదేపా)
- చెరుకు ముత్యంరెడ్డి (1989, 1994, 1999, 2009, తెదేపా, కాంగ్రెస్)
- సోలిపేట రామలింగారెడ్డి (2004, 2008, 2014, 2018, భారాస)
మాధవనేని రఘునందన్రావు (2020, భాజపా)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే రేవంత్కు సన్మానం చేస్తా: హరీశ్రావు
[ 03-05-2024]
సీఎం రేవంత్రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్లు మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు మరోసారి తెలిపారు. -
తొలి ఓటు వేశారోచ్
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తొలి సారిగా చేపట్టిన ఇంటి నుంచి ఓటు ప్రక్రియ సాఫీగా కొనసాగింది. -
ఈ రోజు ఇలా.. రేపు అలా..
[ 03-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఓటూ ప్రాధాన్యమే. బూత్ స్థాయి నుంచి అన్ని పార్టీలు శ్రేణులను సిద్ధం చేస్తున్నాయి. -
ఆరు నూరైనా మెతుకు సీమలో గెలవాలి
[ 03-05-2024]
సిద్దిపేటలో నిర్వహించిన కాంగ్రెస్ రోడ్షో శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. -
ఒకేలా కన్పిస్తూ.. గెలుపోటములు శాసిస్తూ..
[ 03-05-2024]
ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులెవరనేది తేలిపోయింది. పోలింగ్కు తక్కువ రోజులే ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. -
కాంగ్రెస్కు ఓటేస్తే.. సీఎం అబద్ధాల్ని ఆమోదించినట్లే
[ 03-05-2024]
‘అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. గద్దెనెక్కాక ప్రజల్ని మోసం చేసింది. -
లోక్సభ పోరు.. మరింత హోరు
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
భాజపాతోనే దేశాభివృద్ధి
[ 03-05-2024]
భాజపాతోనే దేశాభివృద్ధి సాధ్యమని మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. -
ఓటరు చైతన్యంపై ఆడియో ఆవిష్కరణ
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్శాతం పెంచేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ మనుచౌదరి పిలుపునిచ్చారు. -
కల నెరవేరిస్తేనే.. విద్యాప్రగతి
[ 03-05-2024]
విద్యతోనే ప్రగతి సాధ్యం.. పేదరిక నిర్మూలనకు ఎంతో దోహదపడుతుంది.. డిగ్రీ వరకు విద్యాభ్యాసానికి ప్రభుత్వపరంగా వసతులు ఉన్నా ఆపై చదువులకు ఇబ్బందులు తప్పడం లేదు.. ఎన్నికల సమయంలో విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పే నేతలు ఆ తర్వాత వదిలేస్తున్నారు. -
రెండు కళ్లూ చాలవులే..
[ 03-05-2024]
కల్యాణ వేదికపై ఆసీనులైన శ్రీరామచంద్రమూర్తిని సీతమ్మవారు ఓరకంట చూసి చిరుమందహాసం చేస్తోంది.. పక్కనే మరో వేదికపై వరుడి అలంకరణలో ఉన్న పరమేశ్వరుడిని చూసిన పార్వతిదేవి సిగ్గులొలికిస్తోంది. -
విద్వేషాలు రెచ్చగొడుతున్న భాజపా
[ 03-05-2024]
ప్రజా సంక్షేమాన్ని విస్మరించి విద్వేషాలను రెచ్చగొడుతూ అప్రజాస్వామిక రాజకీయాలు సాగిస్తున్న భాజపాను ఓడించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. -
లక్ష్యం.. సాకారం చేసుకొని..
[ 03-05-2024]
సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఎంతోమంది ఈ కలల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని కలలు కంటుంటారు. -
కాంగ్రెస్ సర్కారుతోనే సంక్షేమం: మంత్రి పొన్నం
[ 03-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ప్రజల సంక్షేమం, అభివృద్ధి జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు
-
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్