ఓటరు చైతన్యంపై ఆడియో ఆవిష్కరణ
లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్శాతం పెంచేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ మనుచౌదరి పిలుపునిచ్చారు.
సీడీలు ఆవిష్కరిస్తున్న మనుచౌదరి, జయదేవ్ ఆర్య, రచయిత విశ్వేశ్వర్రావు
సిద్దిపేట టౌన్, దుబ్బాక, న్యూస్టుడే: లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్శాతం పెంచేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ మనుచౌదరి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే ఓటు వేయటం ఎలా... ఎన్నికల సమయంలో అవినీతి పద్ధతులను నిరోధించడానికి ఎన్నికల యంత్రాంగానికి ఎలా సహాయం చేయాలి లాంటి కార్యకలాపాలు స్వీప్ చేస్తుందన్నారు. అందులో భాగంగానే గురువారం ఓ గీతాన్ని ఆవిష్కరించారు. ఓటరు చైతన్యంపై గజ్వేల్ పట్టణానికి చెందిన రాయరావు విశ్వేశ్వర్రావు స్వయంగా రచించి స్వరపరిచిన ‘ఓటు వేయ్’ అనే గీతాన్ని సమీకృత కలెక్టరేట్లో కలెక్టర్ మనుచౌదరి ఆవిష్కరించారు. ఓటింగ్ శాతం పెంచేందుకు సామాజిక మాధ్యమాల్లో ఈ గీతాన్ని విస్తృతం చేయాలన్నారు.
ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన 2,498 అదనపు ఈవీఎంలను రాజకీయపార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ యాదృచ్ఛికీకరణ నిర్వహించి కేటాయించారు. దుబ్బాక లచ్చపేట ఆదర్శ పాఠశాలలో పీవో, ఏపీవోలకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి గరిమ అగ్రవాల్ పరిశీలించి మాట్లాడారు.
నిష్పక్షపాతంగా..: సమీర్ మాధవ్ కుర్కోటి
మెదక్: పోలింగ్ రోజున స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటింగ్ జరగడంలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని ఎన్నికల సాధారణ పరిశీలకుడు సమీర్ మాధవ్ కుర్కోటి అన్నారు. గురువారం కలెక్టరేట్లో సూక్ష్మ పరిశీలకులు, సెక్షన్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్, ఇంటి నుంచి ఓటు వేయడం, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాలన్నారు.
గట్టి భద్రత: జిల్లాలోని రెండు సెగ్మెంట్ల నిర్వహణకు కంట్రోల్, బ్యాలెట్ యూనిట్లను 25శాతం, వీవీప్యాట్లను 40శాతం అదనంగా ఏర్పాటు చేస్తున్నామని ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి పేర్కొన్నారు. కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.అనంతరం కేంద్రం సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్వ్యాస్ నిర్వహించిన దూరదృశ్య సమీక్షలో ఎన్నికల సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులు సునీల్కుమార్ పాల్గొన్నారు.
గజ్వేల్: మెదక్ లోకసభ నియోజకవర్గ సాధారణ పర్యవేక్షకుడు సమీర్ మాధవ్ కుర్కోటి గజ్వేల్లో పర్యటించి సమీక్షించారు. ఏఆర్వో బన్సీలాల్ ఉన్నారు. 3 నుంచి సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్లో ఏర్పాటు చేసిన ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రంలో ఓటు వేయవచ్చని కలెక్టర్ మనుచౌదరి వెల్లడించారు. ఇతర నియోజకవర్గాల ఉద్యోగ ఓటర్లు 4 నుంచి వినియోగించుకోవచ్చన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అకాల వర్షం.. అపారనష్టం
[ 17-05-2024]
జిల్లాలో పాపన్నపేట, టేక్మాల్, హవేలిఘనపూర్ మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం కురిసింది. పాపన్నపేట కొనుగోలు కేంద్రంలోని వడ్ల కుప్పల వద్ద వర్షపు నీరు చేరింది. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే : ఎమ్మెల్యే సునీతారెడ్డి
[ 17-05-2024]
వరి పండించిన రైతులకు మద్దతు ధరలతో పాటు, రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి మాట తప్పిందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. -
బడులకు భద్రతేదీ!
[ 17-05-2024]
పెద్దశంకరంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరునెలల క్రితం వంటశాలలో పాత్రలను అపహరించుకుపోయారు. అనంతరం తరగతి గదుల కిటికీలు, తలుపులు పగులగొట్టారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఉక్కుపాదం
[ 17-05-2024]
దిగుబడుల ఆశచూపి అన్నదాతలకు నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకునే దళారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం యంత్రాంగం నడుం బిగించింది. -
మూగబోనున్న తెర
[ 17-05-2024]
ప్రజలకు వినోదాన్ని పంచే సినిమా థియేటర్లు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కరోనా కంటే ముందు ప్రేక్షకుల ఆదరణతో నడిచిన సినిమా హాళ్లు ప్రస్తుతం ఆదరణకు నోచుకోవడం లేదు. -
ప్రాథమిక విద్యకు సాంకేతిక ఊతం
[ 17-05-2024]
ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. తొలిమెట్టు పేరుతో రెండేళ్ల నుంచి ప్రత్యేక బోధన చేయిస్తోంది. -
మహిళాభ్యున్నతికి బాటలు
[ 17-05-2024]
మహిళలు రాణిస్తే ప్రగతి సాధ్యం. ఇదే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు ఇప్పించడం ఇందులో భాగమే. -
A .. యాపిల్ Z .. జహీరాబాద్
[ 17-05-2024]
శీతల ప్రాంతాల్లో ఎక్కువగా పండే పంట యాపిల్. కశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి చల్లటి వాతావరణంలో మాత్రమే ఆ చెట్లు పెరిగి కాస్తాయి. అలాంటి పంటను తెలుగు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా ఉండే ఏపీలోని లంబసింగి, -
వినూత్న తీర్పు
[ 17-05-2024]
మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన నిందితులు నలుగురికి తాండూరు స్పెషల్ క్లాస్ జ్యుడీషియల్ న్యాయమూర్తి నామాల అశోక్ వినూత్న తీర్పు ఇచ్చారు. -
ఇంటిపైన వనం.. ఖాళీ స్థలం సద్వినియోగం
[ 17-05-2024]
కూరగాయల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పైగా రసాయనాలు, పురుగుల మందుల వాడకంతో అవి కలుషితమవుతున్నాయి. వాటిని కొనుగోలు చేసి తిన్నవారి ఖర్చులు పెరగడంతో పాటు అనారోగ్యానికి గురవుతున్నారు. -
అర్హులకు దక్కని ఓటు
[ 17-05-2024]
ఓటరు జాబితాలో తప్పులు సర్వ సాధారణమైంది. వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటరు జాబితాలో తప్పులున్నాయి. -
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలి
[ 17-05-2024]
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలైన ఘటన మండలంలోని అప్పాజీపల్లిలో గురువారం జరిగింది. ఎస్సై మహ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. -
హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ కౌన్సిలర్గా సంగారెడ్డి వాసి విజయం
[ 17-05-2024]
బ్రిటన్లోని హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ వార్డు కౌన్సిలర్గా సంగారెడ్డికి చెందిన బొంకూర్ కార్తిక్ కుమార్ అధికార లేబర్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 1,763 ఓట్లు పోలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
అందరి కళ్లూ అటువైపే.. నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు వారిదేనంటున్న లారా
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస