logo

భాజపాతోనే దేశాభివృద్ధి

భాజపాతోనే దేశాభివృద్ధి సాధ్యమని మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు.

Published : 03 May 2024 01:33 IST

కుకునూరుపల్లిలో మాట్లాడుతున్న రఘునందన్‌రావు

కుకునూరుపల్లి(కొండపాక గ్రామీణం), న్యూస్‌టుడే: భాజపాతోనే దేశాభివృద్ధి సాధ్యమని మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. గురువారం కుకునూరుపల్లి మండల కేంద్రం, చిన్నకిష్టాపూర్‌, బొబ్బాయిపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారం రోడ్‌షో నిర్వహించి మాట్లాడారు. సిద్దిపేటకు రైలు కేసీఆర్‌తో కాదని ప్రధాని మోదీ వల్ల వచ్చిందన్నారు. గజ్వేల్‌ ప్రజలకు అందుబాటులోని కేసీఆర్‌ను శాశ్వతంగా ఫామ్‌హౌజ్‌కే పరిమితం చేయాలన్నారు. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి ఓటువేస్తే రైతుల భూములు పోతాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శశిధర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు సంతప్‌రెడ్డి, నాయకులు దారం గురువారెడ్డి, దాసరి స్వామి, నవీన్‌, సంపత్‌, సత్యం, అనిల్‌ పాల్గొన్నారు.

అబద్దాలను నిజం చేయాలని చూస్తున్న సీఎం: రఘునందన్‌రావు

గజ్వేల్‌, న్యూస్‌టుడే: ఒక అబద్దాన్ని రోజూ చెప్పడం ద్వారా నిజం చేసి నమ్మించాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని మెదక్‌ పార్లమెంటు భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు ఆరోపించారు. గురువారం మండలంలోని రిమ్మనగూడలో ఇంటింటి ప్రచారం నిర్వహించాక విలేకరులతో మాట్లాడారు. భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తారని అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ హయాంలోనే ఎక్కువ రాజ్యాంగ సవరణలు చేశారన్నారు. ముఖ్యమంత్రి మాటతీరు మార్చుకోవాలన్నారు.

జగదేవపూర్‌లో ప్రచారం

జగదేవపూర్‌, న్యూస్‌టుడే: భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రైతు వ్యతిరేకి అని రఘునందన్‌రావు అన్నారు. మండలంలోని చాట్లపల్లి, మునిగడప, జగదేవపూర్‌లో రోడ్‌ షోలో ఆయన మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని