భాజపాతోనే దేశాభివృద్ధి
భాజపాతోనే దేశాభివృద్ధి సాధ్యమని మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు.
కుకునూరుపల్లిలో మాట్లాడుతున్న రఘునందన్రావు
కుకునూరుపల్లి(కొండపాక గ్రామీణం), న్యూస్టుడే: భాజపాతోనే దేశాభివృద్ధి సాధ్యమని మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. గురువారం కుకునూరుపల్లి మండల కేంద్రం, చిన్నకిష్టాపూర్, బొబ్బాయిపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారం రోడ్షో నిర్వహించి మాట్లాడారు. సిద్దిపేటకు రైలు కేసీఆర్తో కాదని ప్రధాని మోదీ వల్ల వచ్చిందన్నారు. గజ్వేల్ ప్రజలకు అందుబాటులోని కేసీఆర్ను శాశ్వతంగా ఫామ్హౌజ్కే పరిమితం చేయాలన్నారు. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి ఓటువేస్తే రైతుల భూములు పోతాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శశిధర్రెడ్డి, మండల అధ్యక్షుడు సంతప్రెడ్డి, నాయకులు దారం గురువారెడ్డి, దాసరి స్వామి, నవీన్, సంపత్, సత్యం, అనిల్ పాల్గొన్నారు.
అబద్దాలను నిజం చేయాలని చూస్తున్న సీఎం: రఘునందన్రావు
గజ్వేల్, న్యూస్టుడే: ఒక అబద్దాన్ని రోజూ చెప్పడం ద్వారా నిజం చేసి నమ్మించాలని సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని మెదక్ పార్లమెంటు భాజపా అభ్యర్థి రఘునందన్రావు ఆరోపించారు. గురువారం మండలంలోని రిమ్మనగూడలో ఇంటింటి ప్రచారం నిర్వహించాక విలేకరులతో మాట్లాడారు. భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తారని అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే ఎక్కువ రాజ్యాంగ సవరణలు చేశారన్నారు. ముఖ్యమంత్రి మాటతీరు మార్చుకోవాలన్నారు.
జగదేవపూర్లో ప్రచారం
జగదేవపూర్, న్యూస్టుడే: భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రైతు వ్యతిరేకి అని రఘునందన్రావు అన్నారు. మండలంలోని చాట్లపల్లి, మునిగడప, జగదేవపూర్లో రోడ్ షోలో ఆయన మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అకాల వర్షం.. అపారనష్టం
[ 17-05-2024]
జిల్లాలో పాపన్నపేట, టేక్మాల్, హవేలిఘనపూర్ మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం కురిసింది. పాపన్నపేట కొనుగోలు కేంద్రంలోని వడ్ల కుప్పల వద్ద వర్షపు నీరు చేరింది. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే : ఎమ్మెల్యే సునీతారెడ్డి
[ 17-05-2024]
వరి పండించిన రైతులకు మద్దతు ధరలతో పాటు, రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి మాట తప్పిందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. -
బడులకు భద్రతేదీ!
[ 17-05-2024]
పెద్దశంకరంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరునెలల క్రితం వంటశాలలో పాత్రలను అపహరించుకుపోయారు. అనంతరం తరగతి గదుల కిటికీలు, తలుపులు పగులగొట్టారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఉక్కుపాదం
[ 17-05-2024]
దిగుబడుల ఆశచూపి అన్నదాతలకు నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకునే దళారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం యంత్రాంగం నడుం బిగించింది. -
మూగబోనున్న తెర
[ 17-05-2024]
ప్రజలకు వినోదాన్ని పంచే సినిమా థియేటర్లు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కరోనా కంటే ముందు ప్రేక్షకుల ఆదరణతో నడిచిన సినిమా హాళ్లు ప్రస్తుతం ఆదరణకు నోచుకోవడం లేదు. -
ప్రాథమిక విద్యకు సాంకేతిక ఊతం
[ 17-05-2024]
ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. తొలిమెట్టు పేరుతో రెండేళ్ల నుంచి ప్రత్యేక బోధన చేయిస్తోంది. -
మహిళాభ్యున్నతికి బాటలు
[ 17-05-2024]
మహిళలు రాణిస్తే ప్రగతి సాధ్యం. ఇదే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు ఇప్పించడం ఇందులో భాగమే. -
A .. యాపిల్ Z .. జహీరాబాద్
[ 17-05-2024]
శీతల ప్రాంతాల్లో ఎక్కువగా పండే పంట యాపిల్. కశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి చల్లటి వాతావరణంలో మాత్రమే ఆ చెట్లు పెరిగి కాస్తాయి. అలాంటి పంటను తెలుగు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా ఉండే ఏపీలోని లంబసింగి, -
వినూత్న తీర్పు
[ 17-05-2024]
మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన నిందితులు నలుగురికి తాండూరు స్పెషల్ క్లాస్ జ్యుడీషియల్ న్యాయమూర్తి నామాల అశోక్ వినూత్న తీర్పు ఇచ్చారు. -
ఇంటిపైన వనం.. ఖాళీ స్థలం సద్వినియోగం
[ 17-05-2024]
కూరగాయల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పైగా రసాయనాలు, పురుగుల మందుల వాడకంతో అవి కలుషితమవుతున్నాయి. వాటిని కొనుగోలు చేసి తిన్నవారి ఖర్చులు పెరగడంతో పాటు అనారోగ్యానికి గురవుతున్నారు. -
అర్హులకు దక్కని ఓటు
[ 17-05-2024]
ఓటరు జాబితాలో తప్పులు సర్వ సాధారణమైంది. వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటరు జాబితాలో తప్పులున్నాయి. -
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలి
[ 17-05-2024]
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలైన ఘటన మండలంలోని అప్పాజీపల్లిలో గురువారం జరిగింది. ఎస్సై మహ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. -
హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ కౌన్సిలర్గా సంగారెడ్డి వాసి విజయం
[ 17-05-2024]
బ్రిటన్లోని హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ వార్డు కౌన్సిలర్గా సంగారెడ్డికి చెందిన బొంకూర్ కార్తిక్ కుమార్ అధికార లేబర్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 1,763 ఓట్లు పోలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
అందరి కళ్లూ అటువైపే.. నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు వారిదేనంటున్న లారా
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస