రెండు కళ్లూ చాలవులే..
కల్యాణ వేదికపై ఆసీనులైన శ్రీరామచంద్రమూర్తిని సీతమ్మవారు ఓరకంట చూసి చిరుమందహాసం చేస్తోంది.. పక్కనే మరో వేదికపై వరుడి అలంకరణలో ఉన్న పరమేశ్వరుడిని చూసిన పార్వతిదేవి సిగ్గులొలికిస్తోంది.
అంగరంగ వైభవంగా ఒకే వేదికపై సీతారాములు, పార్వతిపరమేశ్వరుల కల్యాణోత్సవాలు
కల్యాణ తంతు నిర్వహిస్తున్న అర్చకులు
గజ్వేల్ గ్రామీణ, గజ్వేల్, న్యూస్టుడే: కల్యాణ వేదికపై ఆసీనులైన శ్రీరామచంద్రమూర్తిని సీతమ్మవారు ఓరకంట చూసి చిరుమందహాసం చేస్తోంది.. పక్కనే మరో వేదికపై వరుడి అలంకరణలో ఉన్న పరమేశ్వరుడిని చూసిన పార్వతిదేవి సిగ్గులొలికిస్తోంది. భువనైక మోహనాకారులైన ఆ పెళ్లి జంటలను ఒకే వేదికపై కనులారా తిలకించిన పెళ్లి పెద్దలైన భక్తజనులు పులకించిపోయారు. గజ్వేల్లోని సీతారాములు, ఉమామహేశ్వరుల కల్యాణోత్సవాలు గురువారం రాత్రి ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా జరిగాయి. దేవతాముర్తులను స్థానిక అంగడిపేట హనుమాన్ ఆలయం నుంచి వేదిక వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ తోట శ్రీకాంత్రావు పట్టువస్తాల్రు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. వేదపండితులు శాస్తోక్త్రంగా కల్యాణతంతు నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ ఎన్సీ రాజమౌళి, గాడిపల్లి భాస్కర్, ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీధర్రావు, దర్మకర్తలు దేశపతి రాజశేఖరశర్మ, విఠాల నర్సింహరామశర్మ, సాయికృష్ణశర్మ, మరం నవీన్కుమార్, శివకుమార్ పాల్గొన్నారు.
దివ్యమైన తలంబ్రాలు.. ప్రాచుర్యానికి ఆనవాళ్లు
భద్రాచలంలో సీతారాముల కల్యాణానికి కలిపిన తలంబ్రాలను కొన్ని గజ్వేల్కు తీసుకొచ్చి శివకేశవుల వివాహ వేడుకలో ఉపయోగించే తలంబ్రాల్లో కలపడం ఆనవాయితీ. గోటి తలంబ్రాలతో పూర్వం నిర్వహించిన ఈ వేడుక ఇన్నేళ్ల తర్వాత గజ్వేల్ రామకోటి భక్త సమాజం కృషితో మళ్లీ ఆవిష్కృతమైంది. గజ్వేల్లోని సీతారామ, ఉమామహేశ్వరాలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉంది. శ్రీరామనవమి రోజున ఇక్కడి నుంచి కాలినడకన భద్రాచలం వెళ్లి ఉత్సవం తిలకించి అక్కడి తలంబ్రాలు తెచ్చి కలిపేవారు. ఈ కార్యక్రమం కొన్నేళ్ల పాటు నిలిచిపోయింది. మళ్లీ రామకోటి భక్త సమాజం సేవా సమితి చొరవతో పునరుద్ధరణకు నోచుకుంది. ఈ విషయమై రామకోటి రామరాజు మాట్లాడుతూ.. భద్రాచలం ఆలయ నిర్వాహకులు వడ్లు పంపించగా గోటితో తలంబ్రాలు ఒలిచి పంపించామని చెప్పారు. మళ్లీ అక్కడి నుంచి తలంబ్రాలు గజ్వేల్లో సీతారాముల కల్యాణోత్సవానికి వినియోగిండచం రామయ్య కృపగా భావిస్తున్నామన్నారు. ఏటా ఈ బాధ్యతను భక్తితో కొనసాగిస్తామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అకాల వర్షం.. అపారనష్టం
[ 17-05-2024]
జిల్లాలో పాపన్నపేట, టేక్మాల్, హవేలిఘనపూర్ మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం కురిసింది. పాపన్నపేట కొనుగోలు కేంద్రంలోని వడ్ల కుప్పల వద్ద వర్షపు నీరు చేరింది. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే : ఎమ్మెల్యే సునీతారెడ్డి
[ 17-05-2024]
వరి పండించిన రైతులకు మద్దతు ధరలతో పాటు, రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి మాట తప్పిందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. -
బడులకు భద్రతేదీ!
[ 17-05-2024]
పెద్దశంకరంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరునెలల క్రితం వంటశాలలో పాత్రలను అపహరించుకుపోయారు. అనంతరం తరగతి గదుల కిటికీలు, తలుపులు పగులగొట్టారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఉక్కుపాదం
[ 17-05-2024]
దిగుబడుల ఆశచూపి అన్నదాతలకు నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకునే దళారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం యంత్రాంగం నడుం బిగించింది. -
మూగబోనున్న తెర
[ 17-05-2024]
ప్రజలకు వినోదాన్ని పంచే సినిమా థియేటర్లు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కరోనా కంటే ముందు ప్రేక్షకుల ఆదరణతో నడిచిన సినిమా హాళ్లు ప్రస్తుతం ఆదరణకు నోచుకోవడం లేదు. -
ప్రాథమిక విద్యకు సాంకేతిక ఊతం
[ 17-05-2024]
ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. తొలిమెట్టు పేరుతో రెండేళ్ల నుంచి ప్రత్యేక బోధన చేయిస్తోంది. -
మహిళాభ్యున్నతికి బాటలు
[ 17-05-2024]
మహిళలు రాణిస్తే ప్రగతి సాధ్యం. ఇదే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు ఇప్పించడం ఇందులో భాగమే. -
A .. యాపిల్ Z .. జహీరాబాద్
[ 17-05-2024]
శీతల ప్రాంతాల్లో ఎక్కువగా పండే పంట యాపిల్. కశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి చల్లటి వాతావరణంలో మాత్రమే ఆ చెట్లు పెరిగి కాస్తాయి. అలాంటి పంటను తెలుగు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా ఉండే ఏపీలోని లంబసింగి, -
వినూత్న తీర్పు
[ 17-05-2024]
మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన నిందితులు నలుగురికి తాండూరు స్పెషల్ క్లాస్ జ్యుడీషియల్ న్యాయమూర్తి నామాల అశోక్ వినూత్న తీర్పు ఇచ్చారు. -
ఇంటిపైన వనం.. ఖాళీ స్థలం సద్వినియోగం
[ 17-05-2024]
కూరగాయల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పైగా రసాయనాలు, పురుగుల మందుల వాడకంతో అవి కలుషితమవుతున్నాయి. వాటిని కొనుగోలు చేసి తిన్నవారి ఖర్చులు పెరగడంతో పాటు అనారోగ్యానికి గురవుతున్నారు. -
అర్హులకు దక్కని ఓటు
[ 17-05-2024]
ఓటరు జాబితాలో తప్పులు సర్వ సాధారణమైంది. వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటరు జాబితాలో తప్పులున్నాయి. -
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలి
[ 17-05-2024]
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలైన ఘటన మండలంలోని అప్పాజీపల్లిలో గురువారం జరిగింది. ఎస్సై మహ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. -
హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ కౌన్సిలర్గా సంగారెడ్డి వాసి విజయం
[ 17-05-2024]
బ్రిటన్లోని హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ వార్డు కౌన్సిలర్గా సంగారెడ్డికి చెందిన బొంకూర్ కార్తిక్ కుమార్ అధికార లేబర్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 1,763 ఓట్లు పోలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
సాయంత్రం హైదరాబాద్తో పాటు పలు జిల్లాలో భారీ వర్షం: ఐఎండీ
-
స్వాతీమాలీవాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్
-
రంజాన్ నెలలో బాంబింగ్ ఆపాలని ఇజ్రాయెల్కు చెప్పాను: మోదీ
-
స్థిరాస్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు
-
బౌలర్ల భవిష్యత్తు కాపాడండి.. అందుకు ఇలా చేయండి: అనిల్ కుంబ్లే
-
వరల్డ్ ‘సూపర్-రిచ్’లో 15 మంది.. జాబితాలో అదానీ