logo

విద్వేషాలు రెచ్చగొడుతున్న భాజపా

ప్రజా సంక్షేమాన్ని విస్మరించి విద్వేషాలను రెచ్చగొడుతూ అప్రజాస్వామిక రాజకీయాలు సాగిస్తున్న భాజపాను ఓడించాలని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి పిలుపునిచ్చారు.

Published : 03 May 2024 01:25 IST

విశ్రాంత ఐఏఎస్‌ మురళి

జహీరాబాద్‌లో మాట్లాడుతున్న ఆకునూరి మురళి

జహీరాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రజా సంక్షేమాన్ని విస్మరించి విద్వేషాలను రెచ్చగొడుతూ అప్రజాస్వామిక రాజకీయాలు సాగిస్తున్న భాజపాను ఓడించాలని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో గురువారం తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో రెండో రోజు జాగో తెలంగాణ పేరుతో ఓటరు చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లలో యువతకు ఉద్యోగ నియామకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పేదలకు ఏమీ చేయని ప్రధాని మోదీ తన మిత్రులైన అదానీ, అంబానీలకు లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు మాఫీ చేశారని ఆరోపించారు. దేశంలోని పేదలు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారని.. మోదీ మళ్లీ అధికారం చేపడితే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు పూర్తిగా మార్చేస్తారని ఆరోపించారు. ప్రజలు తమ భవిష్యత్తును గుర్తించుకొని విలువైన ఓటును సంక్షేమ పాలన అందించే పార్టీలకు వేయాలని సూచించారు. యాత్రలో ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ, డీబీఎఫ్‌ శంకర్‌రావు, చలపతిరావు, గోవర్ధన్‌రాయ్‌, జనార్దన్‌, పులి కల్పన, నిర్మల, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని