లోక్సభ పోరు.. మరింత హోరు
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
నాలుగు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి
ఈనాడు, కామారెడ్డి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న నాలుగింటిపై భారాస, కాంగ్రెస్, భాజపా అభ్యర్థులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ప్రచారం చేపడుతున్నారు. నియోజకవర్గంలో ప్రభావం చూపే సామాజిక వర్గాల మద్దతు కూడగట్టేందుకు అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు. వీటితో పాటు ఇప్పటి వరకు ప్రచారంలో వెనుకబడి ఉన్న నియోజకవర్గాల్లో అగ్రనేతలను రప్పించి సమావేశాలు, ర్యాలీలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
మెజారిటీ సాధించేలా..
జహీరాబాద్, అందోలు, కామారెడ్డి, నారాయణఖేడ్లలో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆయా నియోజకవర్గాల్లో మెజారిటీ సాధించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మొదటి విడతలో అందోలు నియోజకవర్గంలోని అల్లాదుర్గం సమీపంలోని ఐబీ చౌరస్తా వద్ద భాజపా ప్రధాని మోదీ బహిరంగ సభ నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ నారాయణఖేడ్లోని పెద్దశంకరంపేట మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జనజాతర సభను నిర్వహించిన విషయం తెలిసిందే. భారాస జహీరాబాద్లో మాజీ మంత్రి హరీశ్రావు రోడ్షోను నిర్వహించింది. రెండో విడతలో భారాస ఈ నెల 7న కామారెడ్డిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్షో నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు రేవంత్రెడ్డిని ఆహ్వానించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇలా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో మెజారిటీ సాధించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ముందుకెళ్తున్నారు.
సామాజికవర్గాల మద్దతుకు సమ్మేళనాలు
లోక్సభ నియోజకవర్గంలో ప్రభావితం చూపనున్న లింగాయత్, మైనార్టీలతో పాటు ముదిరాజ్, మున్నూరు కాపు సామాజిక వర్గాల మద్దతు కూడగట్టేందుకు అభ్యర్థులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వీరితో పాటు ఎస్సీ, ఎస్టీ ఓటర్లు అధికంగా ఉన్నారు. దీంతో ఆయా వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. సామాజిక వర్గాలకు చెందిన పెద్దలతో మంతనాలు జరుపుతూ సహకరించాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అకాల వర్షం.. అపారనష్టం
[ 17-05-2024]
జిల్లాలో పాపన్నపేట, టేక్మాల్, హవేలిఘనపూర్ మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం కురిసింది. పాపన్నపేట కొనుగోలు కేంద్రంలోని వడ్ల కుప్పల వద్ద వర్షపు నీరు చేరింది. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే : ఎమ్మెల్యే సునీతారెడ్డి
[ 17-05-2024]
వరి పండించిన రైతులకు మద్దతు ధరలతో పాటు, రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి మాట తప్పిందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. -
బడులకు భద్రతేదీ!
[ 17-05-2024]
పెద్దశంకరంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరునెలల క్రితం వంటశాలలో పాత్రలను అపహరించుకుపోయారు. అనంతరం తరగతి గదుల కిటికీలు, తలుపులు పగులగొట్టారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఉక్కుపాదం
[ 17-05-2024]
దిగుబడుల ఆశచూపి అన్నదాతలకు నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకునే దళారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం యంత్రాంగం నడుం బిగించింది. -
మూగబోనున్న తెర
[ 17-05-2024]
ప్రజలకు వినోదాన్ని పంచే సినిమా థియేటర్లు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కరోనా కంటే ముందు ప్రేక్షకుల ఆదరణతో నడిచిన సినిమా హాళ్లు ప్రస్తుతం ఆదరణకు నోచుకోవడం లేదు. -
ప్రాథమిక విద్యకు సాంకేతిక ఊతం
[ 17-05-2024]
ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. తొలిమెట్టు పేరుతో రెండేళ్ల నుంచి ప్రత్యేక బోధన చేయిస్తోంది. -
మహిళాభ్యున్నతికి బాటలు
[ 17-05-2024]
మహిళలు రాణిస్తే ప్రగతి సాధ్యం. ఇదే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు ఇప్పించడం ఇందులో భాగమే. -
A .. యాపిల్ Z .. జహీరాబాద్
[ 17-05-2024]
శీతల ప్రాంతాల్లో ఎక్కువగా పండే పంట యాపిల్. కశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి చల్లటి వాతావరణంలో మాత్రమే ఆ చెట్లు పెరిగి కాస్తాయి. అలాంటి పంటను తెలుగు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా ఉండే ఏపీలోని లంబసింగి, -
వినూత్న తీర్పు
[ 17-05-2024]
మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన నిందితులు నలుగురికి తాండూరు స్పెషల్ క్లాస్ జ్యుడీషియల్ న్యాయమూర్తి నామాల అశోక్ వినూత్న తీర్పు ఇచ్చారు. -
ఇంటిపైన వనం.. ఖాళీ స్థలం సద్వినియోగం
[ 17-05-2024]
కూరగాయల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పైగా రసాయనాలు, పురుగుల మందుల వాడకంతో అవి కలుషితమవుతున్నాయి. వాటిని కొనుగోలు చేసి తిన్నవారి ఖర్చులు పెరగడంతో పాటు అనారోగ్యానికి గురవుతున్నారు. -
అర్హులకు దక్కని ఓటు
[ 17-05-2024]
ఓటరు జాబితాలో తప్పులు సర్వ సాధారణమైంది. వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటరు జాబితాలో తప్పులున్నాయి. -
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలి
[ 17-05-2024]
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలైన ఘటన మండలంలోని అప్పాజీపల్లిలో గురువారం జరిగింది. ఎస్సై మహ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. -
హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ కౌన్సిలర్గా సంగారెడ్డి వాసి విజయం
[ 17-05-2024]
బ్రిటన్లోని హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ వార్డు కౌన్సిలర్గా సంగారెడ్డికి చెందిన బొంకూర్ కార్తిక్ కుమార్ అధికార లేబర్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 1,763 ఓట్లు పోలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
రంజాన్ నెలలో బాంబింగ్ ఆపాలని ఇజ్రాయెల్కు చెప్పాను: మోదీ
-
స్థిరాస్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు
-
బౌలర్ల భవిష్యత్తు కాపాడండి.. అందుకు ఇలా చేయండి: అనిల్ కుంబ్లే
-
వరల్డ్ ‘సూపర్-రిచ్’లో 15 మంది.. జాబితాలో అదానీ
-
యూఏఈ నుంచి ఇక ‘బ్లూ రెసిడెన్సీ వీసా’.. ఎవరికంటే..?
-
టెండర్లలో 1.5 శాతం ఆయనకు ఇవ్వాల్సిందే: ఈడీ