ఒకేలా కన్పిస్తూ.. గెలుపోటములు శాసిస్తూ..
ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులెవరనేది తేలిపోయింది. పోలింగ్కు తక్కువ రోజులే ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
స్వతంత్రుల గుర్తులతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన
న్యూస్టుడే-మెదక్: ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులెవరనేది తేలిపోయింది. పోలింగ్కు తక్కువ రోజులే ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పార్టీ గుర్తును చూపుతూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అత్యధిక మంది ఎన్నికల బరిలో ఉండడంతో ప్రధాన పార్టీలకు గుర్తుల గుబులు పుడుతోంది. మూడు బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేయనుండటంతో ఓటరు వేలి చూపు ఎటువైపు వెళ్తుందోననే ఆందోళన వారిలో నెలకొంది. అంతేకాకుండా ప్రధాన పార్టీలకు చెందిన గుర్తులను పోలినవి కొందరికి కేటాయించడంతో ఓట్లు చీలే అవకాశం ఉందని భావిస్తున్నారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుంచి 44 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గుర్తింపు, రిజిస్టర్ పార్టీలకు చెందిన వారు 15 మంది ఉండగా, మిగిలిన 29 మంది స్వతంత్ర అభ్యర్థులున్నారు. వీరికి నామినేషన్ల ఉపసంహరణ రోజున గుర్తులు కేటాయించారు. ఓటు వేసేందుకు మూడు బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో... 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గంలో సమాజ్వాది ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి రెవెల్లి వినయ్సాగర్కు 6,947 ఓట్లు రాగా, భాజపా అభ్యర్థి ఆకుల రాజయ్యకు 6,321 ఓట్లు వచ్చాయి. వినయ్ సాగర్కు రోడ్డు రోలర్ గుర్తు కేటాయించడంతో ఆ స్థాయిలో ఓట్లు పడ్డాయి. కారును పోలిన ట్రక్కు గుర్తుపై అప్పట్లో భారాస నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో దాన్ని తొలగించారు. అయితే ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో అదే గుర్తుకు దగ్గరగా ఉన్న చపాతి రోలర్ గుర్తును అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అభ్యర్థి నంద కిషోర్కు, రోడ్ రోలర్ గుర్తును స్వతంత్ర అభ్యర్థి శ్రీశైలంకు కేటాయించారు.
29 మంది: మెదక్ లోక్సభ స్థానంలో ప్రస్తుతం 44 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీల నుంచి పోటీచేస్తున్న వారు కేవలం ముగ్గురే. మిగిలిన 41 మంది అభ్యర్థులు రిజిస్టర్డ్, చిన్న పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులే కావడం గమనార్హం. 2009 ఎంపీ ఎన్నికల్లో ఓ స్వతంత్ర అభ్యర్థికి 34,476, మరో అభ్యర్థికి 18,457, మరో స్వతంత్ర అభ్యర్థికి 12,099 ఓట్లు రాగా, 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థికి 33,057 ఓట్లు రావడం గమనార్హం. 2019 ఎన్నికల్లో ఓ స్వతంత్ర అభ్యర్థి 18,183 ఓట్లు సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో 29 మంది స్వతంత్రులు ఉండడంతో ఓట్లు చీలుతాయని ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు ఉండడంతో తలా కొన్ని ఓట్లు పడే అవకాశం ఉంది.
చిహ్నాలపై ఫోకస్..
ఈ ఎన్నికల్లో మూడు బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఓటు వేయాలనుకునే అభ్యర్థి గుర్తు ఎక్కడుందో తెలియక ఆందోళన చెంది, కొంత మంది వృద్ధులు, నిరక్షరాస్యులు ఇతర గుర్తులకు ఓటు వేసే ప్రమాదం ఉందని ప్రధాన పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారు. దీంతో నమూనా ఈవీఎంలతో ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో బరిలో ఉండడంతో ఆయా పార్టీలకు చెందిన శ్రేణులు ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా గుర్తు గురించి వివరిస్తున్నారు. ఇతర చిన్న పార్టీలు, స్వతంత్రులు సైతం గుర్తులను వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అకాల వర్షం.. అపారనష్టం
[ 17-05-2024]
జిల్లాలో పాపన్నపేట, టేక్మాల్, హవేలిఘనపూర్ మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం కురిసింది. పాపన్నపేట కొనుగోలు కేంద్రంలోని వడ్ల కుప్పల వద్ద వర్షపు నీరు చేరింది. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే : ఎమ్మెల్యే సునీతారెడ్డి
[ 17-05-2024]
వరి పండించిన రైతులకు మద్దతు ధరలతో పాటు, రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి మాట తప్పిందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. -
బడులకు భద్రతేదీ!
[ 17-05-2024]
పెద్దశంకరంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరునెలల క్రితం వంటశాలలో పాత్రలను అపహరించుకుపోయారు. అనంతరం తరగతి గదుల కిటికీలు, తలుపులు పగులగొట్టారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఉక్కుపాదం
[ 17-05-2024]
దిగుబడుల ఆశచూపి అన్నదాతలకు నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకునే దళారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం యంత్రాంగం నడుం బిగించింది. -
మూగబోనున్న తెర
[ 17-05-2024]
ప్రజలకు వినోదాన్ని పంచే సినిమా థియేటర్లు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కరోనా కంటే ముందు ప్రేక్షకుల ఆదరణతో నడిచిన సినిమా హాళ్లు ప్రస్తుతం ఆదరణకు నోచుకోవడం లేదు. -
ప్రాథమిక విద్యకు సాంకేతిక ఊతం
[ 17-05-2024]
ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. తొలిమెట్టు పేరుతో రెండేళ్ల నుంచి ప్రత్యేక బోధన చేయిస్తోంది. -
మహిళాభ్యున్నతికి బాటలు
[ 17-05-2024]
మహిళలు రాణిస్తే ప్రగతి సాధ్యం. ఇదే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు ఇప్పించడం ఇందులో భాగమే. -
A .. యాపిల్ Z .. జహీరాబాద్
[ 17-05-2024]
శీతల ప్రాంతాల్లో ఎక్కువగా పండే పంట యాపిల్. కశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి చల్లటి వాతావరణంలో మాత్రమే ఆ చెట్లు పెరిగి కాస్తాయి. అలాంటి పంటను తెలుగు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా ఉండే ఏపీలోని లంబసింగి, -
వినూత్న తీర్పు
[ 17-05-2024]
మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన నిందితులు నలుగురికి తాండూరు స్పెషల్ క్లాస్ జ్యుడీషియల్ న్యాయమూర్తి నామాల అశోక్ వినూత్న తీర్పు ఇచ్చారు. -
ఇంటిపైన వనం.. ఖాళీ స్థలం సద్వినియోగం
[ 17-05-2024]
కూరగాయల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పైగా రసాయనాలు, పురుగుల మందుల వాడకంతో అవి కలుషితమవుతున్నాయి. వాటిని కొనుగోలు చేసి తిన్నవారి ఖర్చులు పెరగడంతో పాటు అనారోగ్యానికి గురవుతున్నారు. -
అర్హులకు దక్కని ఓటు
[ 17-05-2024]
ఓటరు జాబితాలో తప్పులు సర్వ సాధారణమైంది. వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటరు జాబితాలో తప్పులున్నాయి. -
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలి
[ 17-05-2024]
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలైన ఘటన మండలంలోని అప్పాజీపల్లిలో గురువారం జరిగింది. ఎస్సై మహ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. -
హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ కౌన్సిలర్గా సంగారెడ్డి వాసి విజయం
[ 17-05-2024]
బ్రిటన్లోని హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ వార్డు కౌన్సిలర్గా సంగారెడ్డికి చెందిన బొంకూర్ కార్తిక్ కుమార్ అధికార లేబర్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 1,763 ఓట్లు పోలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
రంజాన్ నెలలో బాంబింగ్ ఆపాలని ఇజ్రాయెల్కు చెప్పాను: మోదీ
-
స్థిరాస్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు
-
బౌలర్ల భవిష్యత్తు కాపాడండి.. అందుకు ఇలా చేయండి: అనిల్ కుంబ్లే
-
వరల్డ్ ‘సూపర్-రిచ్’లో 15 మంది.. జాబితాలో అదానీ
-
యూఏఈ నుంచి ఇక ‘బ్లూ రెసిడెన్సీ వీసా’.. ఎవరికంటే..?
-
టెండర్లలో 1.5 శాతం ఆయనకు ఇవ్వాల్సిందే: ఈడీ