logo

Medak: భర్తను రోడ్డు మింగింది.. భార్య గుండె ఆగింది

రోడ్డు ప్రమాదంలో భర్త చనిపోవడం భార్యను కుంగదీసింది.. మనోవ్యధకు గురైన ఆమె గుండె ఆగింది. ఒక రోడ్డు ప్రమాదం 20 రోజుల వ్యవధిలో ఒక కుటుంబాన్ని రోడ్డున పడేలా చేయడం

Updated : 09 Nov 2023 09:15 IST

20 రోజుల్లో దంపతుల మృతి

సాయిలు, యశోద

అల్లాదుర్గం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో భర్త చనిపోవడం భార్యను కుంగదీసింది.. మనోవ్యధకు గురైన ఆమె గుండె ఆగింది. ఒక రోడ్డు ప్రమాదం 20 రోజుల వ్యవధిలో ఒక కుటుంబాన్ని రోడ్డున పడేలా చేయడం మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలంలోని చేవెళ్ల గ్రామాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల గ్రామానికి చెందిన సాయిలు(39), యశోద(35) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు(17) సంతానం. అతను ఆటో నడుపుతూ, ఆమె కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. దంపతులిద్దరూ కష్టపడి ఇద్దరు కుమార్తెల వివాహం చేశారు. అక్టోబరు 19న రేగోడు మండలం ఇటికాల గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయిలు మృతి చెందాడు. ఈ పరిణామంతో కుంగిపోయిన యశోద ఈనెల 5న గుండెపోటుకు గురైంది. చికిత్స నిమిత్తం హైదరాబాదులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. తల్లీదండ్రిని కోల్పోయిన పిల్లలు రోదించిన తీరు గ్రామస్థులను కలచివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని