కళ్లెదుటే కవలలు దుర్మరణం.. కోమాలోకి వెళ్లిన తల్లి
భర్తను కోల్పోయిన బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.. కవలలైన ఇద్దరు కుమారులను సర్వస్వం అనుకుంటూ జీవనం సాగిస్తుంది.. ఇంతలో దీపావళి పండగకు పిల్లలకు బాణసంచా కొనిచ్చేందుకు ద్విచక్రవాహనంపై తీసుకెళ్లగా..
పిల్లలతో అన్నపూర్ణ
మెదక్, టేక్మాల్, న్యూస్టుడే: భర్తను కోల్పోయిన బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.. కవలలైన ఇద్దరు కుమారులను సర్వస్వం అనుకుంటూ జీవనం సాగిస్తుంది.. ఇంతలో దీపావళి పండగకు పిల్లలకు బాణసంచా కొనిచ్చేందుకు ద్విచక్రవాహనంపై తీసుకెళ్లగా.. టిప్పర్ ఢీకొని కుమారులు మృత్యువాత పడిన విషాదకర ఘటన ఆదివారం మెదక్లో చోటుచేసుకుంది. మెదక్ పట్టణ సీఐ వెంకట్ తెలిపిన వివరాలు.. టేక్మాల్ మండలం కాదలూర్కు చెందిన బేగరి రాములుకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు శ్రీనివాస్కు అన్నపూర్ణతో వివాహం జరగ్గా.. వీరికి పృధ్వీతేజ్ (12), ప్రణీత్ తేజ్ (12) కవల పిల్లలు ఉన్నారు. శ్రీనివాస్ మెదక్లో డీఎస్పీ వద్ద హోంగార్డుగా పని చేసేవాడు. అన్నపూర్ణ మెదక్లోని కస్తూర్బా పాఠశాలలో 2018 నుంచి ఒప్పంద పద్ధతిన జీవశాస్త్రం బోధకురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2021లో సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం అన్నాసాగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ మృతి చెందాడు. అప్పటి నుంచి అన్నపూర్ణ పిల్లల బాధ్యత మోస్తున్నారు. మెదక్లోని జంబికుంటలో ఓ అద్దె ఇంట్లో ఉంటూ పిల్లలను చదివిస్తోంది. ఒక కుమారుడిని స్థానికంగా, మరొకరిని తూప్రాన్లోని ఓ ప్రైవేటు పాఠశాల హాస్టల్లో చదివిస్తున్నారు.
టిప్పర్ తలలపై నుంచి..: ఆదివారం దీపావళి పండగకని కుమారులకు బాణసంచా కొనిచ్చేందుకు అన్నపూర్ణ పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఆటోనగర్ వద్దకు రాగానే వెనక నుంచి టిప్పర్ వచ్చి ఢీకొట్టడంతో కిందపడ్డారు. కుడివైపు ఇద్దరు పిల్లలు పడిపోగా వారి తలలపై నుంచి టిప్పర్ వెళ్లడంతో నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతిచెందారు. తల్లి అన్నపూర్ణ ఎడమ వైపు పడటంతో ప్రాణాలతో బయటపడింది. ప్రమాదం జరగ్గానే టిప్పర్ డ్రైవరు పరారయ్యాడు. రెండేళ్ల క్రితం భర్తను రోడ్డు ప్రమాదం బలితీసుకోగా, అలాంటి రోడ్డు ప్రమాదంలోనే ఇద్దరు కుమారులను కోల్పోవడంతో ఆమె ఒంటరిగా మిగిలారు. కళ్లెదుట కుమారుల మృతిని చూసిన అన్నపూర్ణ కోమాలోకి వెళ్లారు. మెదక్లో ప్రాథమిక చికిత్స అనంతరం సోమవారం సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాదలూర్లో పిల్లలిద్దరికీ అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ వివరించారు.
మరో ఘటనలో..: పేట్బషీరాబాద్: టపాసుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రీషియన్ దుర్మరణం చెందాడు. పేట్బషీరాబాద్ ఎస్ఐ ధర్మేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్కు చెందిన పి.మహేశ్(30) స్థానికంగా ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. అతనికి తెలిసిన వారు బోయిన్పల్లిలో బాణసంచా దుకాణం ఏర్పాటు చేశారు. వారి వద్ద టపాసులు తీసుకురావడానికి ఆదివారం ఉదయం ఇంటి నుంచి బోయిన్పల్లికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. కండ్లకోయ వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. అతడు కింద పడగా.. తలపై నుంచి వెనుక చక్రం వెళ్లడంతో మృతి చెందాడు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదైందని ఎస్ఐ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అకాల వర్షం.. అపారనష్టం
[ 17-05-2024]
జిల్లాలో పాపన్నపేట, టేక్మాల్, హవేలిఘనపూర్ మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం కురిసింది. పాపన్నపేట కొనుగోలు కేంద్రంలోని వడ్ల కుప్పల వద్ద వర్షపు నీరు చేరింది. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే : ఎమ్మెల్యే సునీతారెడ్డి
[ 17-05-2024]
వరి పండించిన రైతులకు మద్దతు ధరలతో పాటు, రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి మాట తప్పిందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. -
బడులకు భద్రతేదీ!
[ 17-05-2024]
పెద్దశంకరంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరునెలల క్రితం వంటశాలలో పాత్రలను అపహరించుకుపోయారు. అనంతరం తరగతి గదుల కిటికీలు, తలుపులు పగులగొట్టారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఉక్కుపాదం
[ 17-05-2024]
దిగుబడుల ఆశచూపి అన్నదాతలకు నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకునే దళారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం యంత్రాంగం నడుం బిగించింది. -
మూగబోనున్న తెర
[ 17-05-2024]
ప్రజలకు వినోదాన్ని పంచే సినిమా థియేటర్లు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కరోనా కంటే ముందు ప్రేక్షకుల ఆదరణతో నడిచిన సినిమా హాళ్లు ప్రస్తుతం ఆదరణకు నోచుకోవడం లేదు. -
ప్రాథమిక విద్యకు సాంకేతిక ఊతం
[ 17-05-2024]
ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. తొలిమెట్టు పేరుతో రెండేళ్ల నుంచి ప్రత్యేక బోధన చేయిస్తోంది. -
మహిళాభ్యున్నతికి బాటలు
[ 17-05-2024]
మహిళలు రాణిస్తే ప్రగతి సాధ్యం. ఇదే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు ఇప్పించడం ఇందులో భాగమే. -
A .. యాపిల్ Z .. జహీరాబాద్
[ 17-05-2024]
శీతల ప్రాంతాల్లో ఎక్కువగా పండే పంట యాపిల్. కశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి చల్లటి వాతావరణంలో మాత్రమే ఆ చెట్లు పెరిగి కాస్తాయి. అలాంటి పంటను తెలుగు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా ఉండే ఏపీలోని లంబసింగి, -
వినూత్న తీర్పు
[ 17-05-2024]
మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన నిందితులు నలుగురికి తాండూరు స్పెషల్ క్లాస్ జ్యుడీషియల్ న్యాయమూర్తి నామాల అశోక్ వినూత్న తీర్పు ఇచ్చారు. -
ఇంటిపైన వనం.. ఖాళీ స్థలం సద్వినియోగం
[ 17-05-2024]
కూరగాయల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పైగా రసాయనాలు, పురుగుల మందుల వాడకంతో అవి కలుషితమవుతున్నాయి. వాటిని కొనుగోలు చేసి తిన్నవారి ఖర్చులు పెరగడంతో పాటు అనారోగ్యానికి గురవుతున్నారు. -
అర్హులకు దక్కని ఓటు
[ 17-05-2024]
ఓటరు జాబితాలో తప్పులు సర్వ సాధారణమైంది. వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటరు జాబితాలో తప్పులున్నాయి. -
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలి
[ 17-05-2024]
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలైన ఘటన మండలంలోని అప్పాజీపల్లిలో గురువారం జరిగింది. ఎస్సై మహ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. -
హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ కౌన్సిలర్గా సంగారెడ్డి వాసి విజయం
[ 17-05-2024]
బ్రిటన్లోని హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ వార్డు కౌన్సిలర్గా సంగారెడ్డికి చెందిన బొంకూర్ కార్తిక్ కుమార్ అధికార లేబర్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 1,763 ఓట్లు పోలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
రాణించిన కేఎల్ రాహుల్-పూరన్.. ముంబయి లక్ష్యం
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
ఏపీలో ఎన్నికల ముందు తర్వాత హింసపై సిట్ ..ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
విజయవాడ డివిజన్ పరిధిలో 14 రైళ్లు రద్దు