ఓటరు చైతన్యంతోనే.. ప్రజాస్వామ్య పరిరక్షణ
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు.
శతశాతం లక్ష్య సాధన అందరి బాధ్యత
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టుతో సమానం. పారదర్శకంగా ఎన్నికయ్యే నేత హితానికి కట్టుబడతారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తుంటారు. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో ఓటరు చేతిలో తిరుగులేని ఆయుధమైన ఓటు సద్వినియోగంతోనే సమర్థ నేతను ఎన్నుకోవచ్చు. ఓటింగ్ రోజు గడపదాటి ఓటేస్తేనే వ్యవస్థను గౌరవించినట్లు లెక్క. అభ్యర్థి నచ్చని పక్షంలో ‘నోటా’ సైతం ఈవీఎంలో పొందుపర్చి ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి.
ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం కొంత మెరుగ్గా ఉంటున్నా.. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది. వాటితో పోలిస్తే 10 -15 శాతం తగ్గుముఖం పడుతుండటం గమనార్హం. దివ్యాంగులు, వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్న వారెంతో మంది పోలింగ్ కేంద్రానికి వస్తున్నారు. మిగతావారూ వీరి స్ఫూర్తిగా కదలాల్సిన ఆవశ్యకత ఉంది.
న్యూస్టుడే, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి టౌన్, వికారాబాద్
మార్పు వస్తేనే..
మరోవైపు పార్లమెంట్ ఎన్నికలనగానే.. తమకు సంబంధించినవి కావనే ధోరణిలో కొందరు, వరుసగా సెలవులు కలిసొస్తే యాత్రలకు వెళ్తున్న వారూ ఉన్నారు. పట్టణవాసులు ఆనాసక్తి చూపుతున్నారు. ఈ విషయంలో మార్పు రావాలి.
చైతన్య కార్యక్రమాలతో..
ఉమ్మడి జిల్లాలో ముమ్మరంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో స్వీప్ ఆధ్వర్యంలో అవగాహన సమావేశాలు చేపట్టారు. మరోవైపు డిగ్రీ, పీజీ విద్యార్థులతో ప్లాష్మ్యాబ్, ర్యాలీలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలోనూ సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో చైతన్య కార్యక్రమాలు కొనసాగించనుంది. అధికార యంత్రాంగం మరింత దృష్టిసారించి ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరినీ పోలింగ్ కేంద్రాల వైపు నడిపించాలి.
ఆయా జిల్లాల్లో..
- సంగారెడ్డి జిల్లాలో గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేసింది 67.56 శాతం మంది మాత్రమే. వందలో 33 మంది పోలింగ్ కేంద్రానికి రాలేదు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో 63.21 శాతమే ఓటేయడం గమనార్హం. 2018 శాసనసభ ఎన్నికలతో పోల్చితే 2023 ఎన్నికల్లో పోలింగ్ 5 శాతం మేర తగ్గింది.
- మెదక్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో 2014 నుంచి ఇటీవల జరిగి ఎన్నికల వరకు పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వచ్చింది. అదే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం భిన్నమైన గణాంకాలు నమోదయ్యాయి. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2019 లోక్సభ ఎన్నికల్లో 13.04 శాతం తగ్గింది.
- సిద్దిపేట జిల్లాలో ఇదేతరహాలో నమోదైంది. 2018 ఎన్నికల్లో 84 శాతం మంది మేర ఓటేయగా.. 2023లో ఒక శాతానికి పైగా తగ్గింది. అదే గత పార్లమెంట్ ఎన్నికల్లో 72 శాతం నమోదైంది.
అందరినీ నడిపిద్దాం..: నరేందర్, మిరుదొడ్డి
సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం ప్రథమ సంవత్సరం చదువుతున్నా. గతేడాది ఆగస్టులో ఓటు హక్కు వచ్చింది. నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఓటేశాను. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ హక్కును సద్వినియోగం చేసుకుంటా. 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు తమ బాధ్యతను నిర్వర్తించాలి. భవితను దృష్టిలో పెట్టుకొని ముందుకు రావాలి. ఐదేళ్లలో మంచి చేస్తారనే నమ్మకం కలిగిన నేతను ఎన్నుకోవాలి. తోటివారిని సైతం పోలింగ్ కేంద్రానికి నడిపిద్దాం.
ఓటు విలువ ఎనలేనిది
ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైంది. సమర్థుల ఎన్నికకు దీన్ని ఉపయోగించాలి. పల్లెలతో పోలిస్తే పట్టణవాసులు ఎక్కువ మంది ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఓటరు చైతన్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. అర్హులందరూ ఓటరుగా నమోదయ్యేలా చూశాం. వారంతా పోలింగ్లో పాల్గొనేలా చైతన్యానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. స్వీప్ ఆధ్వర్యంలో ఊరూరా అవగాహన కల్పించేందుకు కార్యాచరణ రూపొందించాం. ఇప్పటికే కార్యక్రమాలు షురూ చేశాం. పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగులు బాధ్యతగా హక్కు వినియోగించుకోవాలి.
వల్లూరు క్రాంతి, కలెక్టర్, సంగారెడ్డి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమర్శల జోరు.. కేరింతల హోరు
[ 01-05-2024]
మెదక్ జిల్లా అల్లాదుర్గం చిల్వేర్ ఐబీ చౌరస్తాలో మంగళవారం మెదక్-జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల భాజపా విశాల్ జనసభ కమలదళంలో ఆద్యంతం ఉత్తేజం నింపింది. కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రధాని నరేంద్రమోదీ దుయ్యబట్టారు. -
కార్మికుల రాత మార్చే నేత కావాలి
[ 01-05-2024]
చేగుంట మండలం రెడ్డిపల్లిలోని ఓ పరిశ్రమకు చెందిన 15 మంది కార్మికులను శిథిలావస్థకు చేరిన గదిలో నివాసం ఉంచారు. గతేడాది ఆగస్టులో భారీ వర్షానికి గోడలు కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందగా, ఐదుగురికి పైగా తీవ్రంగా గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. -
‘శత’శాతం ప్రగతి..!
[ 01-05-2024]
నిర్దిష్ట ప్రణాళికకు శ్రమించే తత్వం తోడయితే.. సత్ఫలితాలు సాధ్యం. ఉపాధ్యాయుల అనుశీలన.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అనేక సర్కారు బడులు శతశాతం ఫలితాలు సాధించి భళా అనిపించాయి. -
సమన్వయంతో పని చేయండి
[ 01-05-2024]
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భేషజాలకు పోకుండా ముఖ్యులు సమన్వయంతో పని చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్మున్షీ అన్నారు. మంగళవారం పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో మెదక్ అభ్యర్థి నీలం మధు కార్యాలయంలో పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. -
శాతం పెరిగె.. స్థానం దిగజారె!
[ 01-05-2024]
పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో మెతుకుసీమ విద్యార్థులు సత్తాచాటారు. ఈసారి ఫలితాల్లో కాస్త మెరుగుపడగా.. రాష్ట్ర స్థాయిలో స్థానం దిగజారింది. -
‘పది’లో ద్వితీయస్థానం అభినందనీయం: మంత్రి పొన్నం ప్రభాకర్
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా ద్వితీయ స్థానంలో నిలవడంపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. -
పెళ్లింట విషాదం..
[ 01-05-2024]
వివాహం జరిగి మూడు రోజులు కాలేదు.. సంతోషంగా ద్విచక్ర వాహనంపై కొత్త దంపతులిద్దరు వెళ్లగా.. మృత్యురూపంలో దూసుకొచ్చిన లారీ నూతన వరుడిని బలి తీసుకుంది. -
ఓటు పాఠం.. అవగాహన కీలకం
[ 01-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటింగ్ కీలకమన్నది అందరికీ తెలిసిందే. 18 ఏళ్లకు ఓటు హక్కు పొందవచ్చు. అయితే అంతకంటే ముందే విద్యార్థిగా ఉన్న సమయంలో పోలింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు పదో తరగతి సాంఘిక శాస్త్రంలో 16వ పాఠంగా ‘భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ’ పాఠ్యాంశాన్ని పొందుపర్చారు. -
సరకుల అక్రమ తరలింపు.. ఇద్దరి తొలగింపు
[ 01-05-2024]
హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయం నుంచి బియ్యం, పప్పులు ఇతర సామగ్రి అక్రమ తరలింపు వ్యవహారంపై ఇన్ఛార్జి ప్రిన్సిపల్ 27న పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారని విద్యాలయాల ప్రాంతీయ సమన్వయకర్త డీఎస్ వెంకన్న మంగళవారం తెలిపారు. -
అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
[ 01-05-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గం నుంచి 44 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భాజపా, భారాస, బీఎస్పీ అభ్యర్థుల గుర్తులు పోనూ.. మిగిలిన గుర్తింపు, రిజిస్టర్డ్ పార్టీల, స్వతంత్ర అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ ఎన్నికల చిహ్నాలను కేటాయించారు. -
ఫలితం అద్వితీయం..స్థానం పదిలం
[ 01-05-2024]
పదో తరగతి వార్షిక ఫలితాల్లో సిద్దిపేట జిల్లా సత్తా చాటింది. రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచి హవా కొనసాగించింది. గత విద్యా సంవత్సర స్థానాన్ని పదిలం చేసుకుంటూ.. ప్రత్యేకత నిలిపింది. 98.65 శాతం విద్యార్థులు పాసయ్యారు. -
డీఈఓకు సన్మానం
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచినందుకు గాను పలు ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘విస్తారా’కు వడగండ్ల దెబ్బ.. విమానం అత్యవసర ల్యాండింగ్
-
కీర్తి సురేశ్తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి