పోరుగడ్డ.. ప్రముఖుల అడ్డా
ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత,
ప్రధాని, సీఎంను అందించిన పార్లమెంటు నియోజకవర్గం
న్యూస్టుడే-మెదక్: ఉద్యమ ఖిల్లా, చారిత్రక నేపథ్యమున్న మెదక్ లోక్సభ స్థానం 19వ సారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి, ఏడుపాయల వనదుర్గామాత, కొమురవెల్లి మల్లన్న ఆలయాలు వంటి పర్యాటక ప్రాంతాలు ఉన్న నియోజకవర్గం ఎందరో రాజకీయ ఉద్ధండులను అందించింది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించే అవకాశం మెతుకుసీమ ప్రజలు కల్పించారు. ఈ క్రమంలో మరోమారు లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఈ అంశంపై ‘న్యూస్టుడే’ కథనం...
18 సార్లు ఎన్నికలు...
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. ఇప్పటి వరకు 18 సార్లు ఎన్నికలు జరిగాయి. వాస్తవంగా 17 సార్లు జరగాల్సి ఉండగా, 2014 లోక్సభ ఎన్నికల్లో భారాస అధినేత కేసీఆర్ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి భారీ మెజార్టీ రావడంతో కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో దుబ్బాక మండలం పోతారానికి చెందిన కొత్త ప్రభాకర్రెడ్డి ఎంపీగా గెలుపొందారు.
ప్రధానిని అందించిన నేల....
దేశానికి ప్రధానిని అందించిన ఘనత మెతుకుసీమకు దిక్కింది. 1980లో మధ్యంతర ఎన్నికలు రావడంతో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీచేసి గెలుపొందారు. 3,15,077 ఓట్లు వచ్చాయి. ఆమె మెదక్ ఎంపీగా ఉండి ప్రధాని పదవిలో కొనసాగుతుండగానే 1984 అక్టోబర్ 31న మరణించారు.
హస్తం అత్యధిక సార్లు...
మెదక్ లోక్సభ స్థానం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ అత్యధిక సార్లు గెలుపొందింది. ఉపఎన్నికతో కలుపుకొని 18 సార్లు ఎన్నికలు జరగ్గా.. పీడీఎఫ్, టీపీఎస్, భాజపా, తెదేపాలకు ఒకే ఒకసారి అవకాశం దక్కింది. కాంగ్రెస్ అభ్యర్థులు తొమ్మిది సార్లు ఎంపీగా గెలుపొందారు. వీరిలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన బాగారెడ్డి అత్యధిక సార్లు ఎన్నికకావడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈయన 1989లో గెలుపొందారు. అప్పటి నుంచి వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు. ఆలె నరేంద్ర, మల్లికార్జున్, హన్మంతరావు, కొత్త ప్రభాకర్రెడ్డి రెండేసి సార్లు ప్రాతినిధ్యం వహించారు. 2004 నుంచి వరుసగా భారాస జయకేతనం ఎగరవేస్తూ వచ్చింది.
మారిన స్వరూపం..
మొదట్లో మెదక్, అందోలు, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణ్ఖేడ్, ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధితో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్వరూపం మారింది. దీని పరిధిలోకి ప్రస్తుతమున్న సంగారెడ్డి, పటాన్చెరు, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లు చేరాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమర్శల జోరు.. కేరింతల హోరు
[ 01-05-2024]
మెదక్ జిల్లా అల్లాదుర్గం చిల్వేర్ ఐబీ చౌరస్తాలో మంగళవారం మెదక్-జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల భాజపా విశాల్ జనసభ కమలదళంలో ఆద్యంతం ఉత్తేజం నింపింది. కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రధాని నరేంద్రమోదీ దుయ్యబట్టారు. -
కార్మికుల రాత మార్చే నేత కావాలి
[ 01-05-2024]
చేగుంట మండలం రెడ్డిపల్లిలోని ఓ పరిశ్రమకు చెందిన 15 మంది కార్మికులను శిథిలావస్థకు చేరిన గదిలో నివాసం ఉంచారు. గతేడాది ఆగస్టులో భారీ వర్షానికి గోడలు కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందగా, ఐదుగురికి పైగా తీవ్రంగా గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. -
‘శత’శాతం ప్రగతి..!
[ 01-05-2024]
నిర్దిష్ట ప్రణాళికకు శ్రమించే తత్వం తోడయితే.. సత్ఫలితాలు సాధ్యం. ఉపాధ్యాయుల అనుశీలన.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అనేక సర్కారు బడులు శతశాతం ఫలితాలు సాధించి భళా అనిపించాయి. -
సమన్వయంతో పని చేయండి
[ 01-05-2024]
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భేషజాలకు పోకుండా ముఖ్యులు సమన్వయంతో పని చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్మున్షీ అన్నారు. మంగళవారం పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో మెదక్ అభ్యర్థి నీలం మధు కార్యాలయంలో పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. -
శాతం పెరిగె.. స్థానం దిగజారె!
[ 01-05-2024]
పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో మెతుకుసీమ విద్యార్థులు సత్తాచాటారు. ఈసారి ఫలితాల్లో కాస్త మెరుగుపడగా.. రాష్ట్ర స్థాయిలో స్థానం దిగజారింది. -
‘పది’లో ద్వితీయస్థానం అభినందనీయం: మంత్రి పొన్నం ప్రభాకర్
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా ద్వితీయ స్థానంలో నిలవడంపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. -
పెళ్లింట విషాదం..
[ 01-05-2024]
వివాహం జరిగి మూడు రోజులు కాలేదు.. సంతోషంగా ద్విచక్ర వాహనంపై కొత్త దంపతులిద్దరు వెళ్లగా.. మృత్యురూపంలో దూసుకొచ్చిన లారీ నూతన వరుడిని బలి తీసుకుంది. -
ఓటు పాఠం.. అవగాహన కీలకం
[ 01-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటింగ్ కీలకమన్నది అందరికీ తెలిసిందే. 18 ఏళ్లకు ఓటు హక్కు పొందవచ్చు. అయితే అంతకంటే ముందే విద్యార్థిగా ఉన్న సమయంలో పోలింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు పదో తరగతి సాంఘిక శాస్త్రంలో 16వ పాఠంగా ‘భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ’ పాఠ్యాంశాన్ని పొందుపర్చారు. -
సరకుల అక్రమ తరలింపు.. ఇద్దరి తొలగింపు
[ 01-05-2024]
హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయం నుంచి బియ్యం, పప్పులు ఇతర సామగ్రి అక్రమ తరలింపు వ్యవహారంపై ఇన్ఛార్జి ప్రిన్సిపల్ 27న పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారని విద్యాలయాల ప్రాంతీయ సమన్వయకర్త డీఎస్ వెంకన్న మంగళవారం తెలిపారు. -
అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
[ 01-05-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గం నుంచి 44 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భాజపా, భారాస, బీఎస్పీ అభ్యర్థుల గుర్తులు పోనూ.. మిగిలిన గుర్తింపు, రిజిస్టర్డ్ పార్టీల, స్వతంత్ర అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ ఎన్నికల చిహ్నాలను కేటాయించారు. -
ఫలితం అద్వితీయం..స్థానం పదిలం
[ 01-05-2024]
పదో తరగతి వార్షిక ఫలితాల్లో సిద్దిపేట జిల్లా సత్తా చాటింది. రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచి హవా కొనసాగించింది. గత విద్యా సంవత్సర స్థానాన్ని పదిలం చేసుకుంటూ.. ప్రత్యేకత నిలిపింది. 98.65 శాతం విద్యార్థులు పాసయ్యారు. -
డీఈఓకు సన్మానం
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచినందుకు గాను పలు ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆఫ్లైన్లోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష: టీఎస్పీఎస్సీ
-
ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో ఇకపై సన్ నెక్స్ట్..
-
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
లైంగిక దౌర్జన్యం కేసు - తొలిసారి స్పందించిన ప్రజ్వల్ రేవణ్ణ
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి