వేసవి శిబిరాలు.. నైపుణ్యాలకు నిలయాలు
క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. ఒత్తిడిలో ఉన్నవారు కాసేపు ఆటలు ఆడితే ఎంతో ఉపశమనం పొందవచ్చు. వేసవి వస్తే విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ చరవాణులకు అతుక్కుపోతుంటారు.
ఆటలాడుతున్న విద్యార్థులు
న్యూస్టుడే, చేగుంట: క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. ఒత్తిడిలో ఉన్నవారు కాసేపు ఆటలు ఆడితే ఎంతో ఉపశమనం పొందవచ్చు. వేసవి వస్తే విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ చరవాణులకు అతుక్కుపోతుంటారు. ఖాళీగా ఉండటంతో వారి ఆలోచనలో మార్పు వస్తుంది. అలాంటి వాటి నుంచి విముక్తి కలిగించేందుకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఎంతో మేలు చేస్తుంటాయి. జిల్లా యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో మే 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు.
జిల్లాలో పది చోట్ల : జిల్లాలో పది చోట్ల శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు వచ్చాయి. నెల రోజుల పాటు శిక్షకులకు రూ.4 వేల చొప్పున చెల్లిస్తారు. ఇలా జిల్లాలో మొత్తం పది శిబిరాలకు రూ.40 వేలు వెచ్చిస్తారు. క్రీడా సామగ్రి కొనుగోలుకు రూ.50 వేలు, మైదానాల అభివృద్ధి, విద్యార్థులకు ఇచ్చే ధ్రువీకరణ పత్రాలకు రూ.10వేలు, క్రీడల సమయంలో ఏదైనా ప్రమాదం జరగటం, గాయపడితే ప్రథమ చికిత్స అందించేందుకు రూ.5 వేల నిధులు కూడా కేటాయించారు. ఇలా ప్రతి జిల్లాకు రూ.1.05 లక్షలు ఖర్చు చేయనున్నారు.
వివిధ క్రీడాంశాలు: వాలీబాల్, ఖోఖో, సాఫ్ట్బాల్, బేస్బాల్, కబడ్డీ, ఫుట్బాల్, టేబుల్టెన్నిస్ వంటి వాటిలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఎండల తీవ్రతను బట్టి ఉదయం, సాయంత్రం శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 14 ఏళ్లలోపు బాలబాలికలకు ఇందులో అవకాశం కల్పించనున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను శిబిరాలకు పంపేలా ప్రోత్సహిస్తే నెల రోజుల్లో మెరికల్లా తయారయ్యే అవకాశం ఉంటుంది. వారిలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యం గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. ఈసారి రగ్బీ, యోగా వంటి వాటికి అవకాశం ఇవ్వలేదు. శిబిరాల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు శిక్షకులను నియమించారు.
ఎక్కడెక్కడ నిర్వహణ:బూర్గుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో వాలీబాల్, శాలిపేటలో ఖోఖో, కొడపాకలో వాలీబాల్, తూప్రాన్ క్రీడా ప్రాంగణంలో సాఫ్ట్బాల్, కొంతాల్పల్లిలో వాలీబాల్, మనోహరాబాద్లో బేస్బాల్, యూసూఫ్పేటలో కబడ్డీ, రామాయంపేటలో ఫుట్బాల్, వడియారంలో వాలీబాల్, మెదక్ గుల్షన్క్లబ్లో టేబుల్టెన్నిస్ నిర్వహించనున్నారు.
మంచి అవకాశం: వేసవిలో నిర్వహించే క్రీడా శిబిరాల వల్ల విద్యార్థులకు మంచి అవకాశం లభిస్తుంది. ప్రతి రోజు ఆటల్లో శిక్షణ తీసుకోవడం వల్ల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇంటి వద్దనే ఉండకుండా కాస్తా ఉపశమనం పొందేందుకు వీలు ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడా శిబిరాలకు పంపితే బాగుంటుంది. స్థానికంగానే వారు సాధన చేసేందుకు అవకాశం ఉంది.
నాగరాజు, డీవైఎస్వో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే రేవంత్కు సన్మానం చేస్తా: హరీశ్రావు
[ 03-05-2024]
సీఎం రేవంత్రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్లు మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు మరోసారి తెలిపారు. -
తొలి ఓటు వేశారోచ్
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తొలి సారిగా చేపట్టిన ఇంటి నుంచి ఓటు ప్రక్రియ సాఫీగా కొనసాగింది. -
ఈ రోజు ఇలా.. రేపు అలా..
[ 03-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఓటూ ప్రాధాన్యమే. బూత్ స్థాయి నుంచి అన్ని పార్టీలు శ్రేణులను సిద్ధం చేస్తున్నాయి. -
ఆరు నూరైనా మెతుకు సీమలో గెలవాలి
[ 03-05-2024]
సిద్దిపేటలో నిర్వహించిన కాంగ్రెస్ రోడ్షో శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. -
ఒకేలా కన్పిస్తూ.. గెలుపోటములు శాసిస్తూ..
[ 03-05-2024]
ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులెవరనేది తేలిపోయింది. పోలింగ్కు తక్కువ రోజులే ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. -
కాంగ్రెస్కు ఓటేస్తే.. సీఎం అబద్ధాల్ని ఆమోదించినట్లే
[ 03-05-2024]
‘అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. గద్దెనెక్కాక ప్రజల్ని మోసం చేసింది. -
లోక్సభ పోరు.. మరింత హోరు
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
భాజపాతోనే దేశాభివృద్ధి
[ 03-05-2024]
భాజపాతోనే దేశాభివృద్ధి సాధ్యమని మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. -
ఓటరు చైతన్యంపై ఆడియో ఆవిష్కరణ
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్శాతం పెంచేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ మనుచౌదరి పిలుపునిచ్చారు. -
కల నెరవేరిస్తేనే.. విద్యాప్రగతి
[ 03-05-2024]
విద్యతోనే ప్రగతి సాధ్యం.. పేదరిక నిర్మూలనకు ఎంతో దోహదపడుతుంది.. డిగ్రీ వరకు విద్యాభ్యాసానికి ప్రభుత్వపరంగా వసతులు ఉన్నా ఆపై చదువులకు ఇబ్బందులు తప్పడం లేదు.. ఎన్నికల సమయంలో విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పే నేతలు ఆ తర్వాత వదిలేస్తున్నారు. -
రెండు కళ్లూ చాలవులే..
[ 03-05-2024]
కల్యాణ వేదికపై ఆసీనులైన శ్రీరామచంద్రమూర్తిని సీతమ్మవారు ఓరకంట చూసి చిరుమందహాసం చేస్తోంది.. పక్కనే మరో వేదికపై వరుడి అలంకరణలో ఉన్న పరమేశ్వరుడిని చూసిన పార్వతిదేవి సిగ్గులొలికిస్తోంది. -
విద్వేషాలు రెచ్చగొడుతున్న భాజపా
[ 03-05-2024]
ప్రజా సంక్షేమాన్ని విస్మరించి విద్వేషాలను రెచ్చగొడుతూ అప్రజాస్వామిక రాజకీయాలు సాగిస్తున్న భాజపాను ఓడించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. -
లక్ష్యం.. సాకారం చేసుకొని..
[ 03-05-2024]
సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఎంతోమంది ఈ కలల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని కలలు కంటుంటారు. -
కాంగ్రెస్ సర్కారుతోనే సంక్షేమం: మంత్రి పొన్నం
[ 03-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ప్రజల సంక్షేమం, అభివృద్ధి జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు