మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం,
ఇద్దరు నిందితుల రిమాండ్
వివరాలు వెల్లడిస్తున్న జహీరాబాద్ సీఐ రవి
న్యూస్టుడే, జహీరాబాద్ అర్బన్, కోహీర్: డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, లేదంటే, ఎలా బతుకుతారో అంటూ యువకులను భయపెట్టి దాడి చేయడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. జహీరాబాద్ పట్టణ సర్కిల్ కార్యాలయంలో బుధవారం సీఐ రాజబోయిన రవి తెలిపిన ప్రకారం హత్యకు గురైన హైదరాబాద్లోని ఎల్లమ్మబండ ప్రాంతానికి చెందిన షేఖ్ అన్వర్అలీ అలియాస్ హనీసింగ్(30), కోహీర్ మండలం రాజనెల్లికి చెందిన ముస్తఖీమ్(22), కోహీర్ నల్సావాడికి చెందిన మహ్మద్ కైౖఫ్(24) కొంతకాలం జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఆటోడ్రైవర్లు కలిసి పనిచేశారు. ముస్తఖీమ్, మహ్మద్ కైౖఫ్లకు షేఖ్ అన్వర్అలీ తన మామా వద్ద ఆటోలను అద్దెకు ఇప్పించేవాడు. అద్దె రూ.1000 వసూలు చేసి రూ.600 యజమానికి ఇచ్చి రూ.400 కమీషన్ తీసుకునేవాడు. దీంతో పాటు దుర్భాషలాడుతూ రాత్రి వేళల్లో వారిని చోరీలకు తీసుకెళ్లేవాడు. అన్వర్అలీ ప్రవర్తన నచ్చకపోవడంతో ముస్తఖీమ్, మహ్మద్ కైౖఫ్ సొంతూళ్లకు వచ్చి ఆటోడ్రైవర్లుగా జీవనోపాధి పొందుతున్నారు. ఈ క్రమంలోనే అన్వర్ తరుచూ ఫోన్ చేసి మళ్లీ హైదరాబాద్ వచ్చేయండి చోరీలు చేద్దాం. లేదంటే ఆటో అద్దె బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేస్తు వచ్చాడు. జహీరాబాద్కు వస్తా నాలుగు ద్విచక్ర వాహనాలు అపహరించి ఇవ్వాలని షరతూ విధించాడు. లేదంటే మీ అంతు చూస్తానని బెదిరించాడు. హైదరాబాద్ నుంచి కోహీర్ వచ్చిన అలీతో మంగళవారం రాత్రి ప్రభుత్వ పాఠశాల వెనక కూర్చుని మాట్లాడుతుండగా గొడవ జరిగింది. వెంట తెచ్చుకున్న వేట కొడవలితో ముస్తఖీమ్పై అన్వర్అలీ దాడికి యత్నించగా, ముస్తఖీమ్, కైఫ్ కలిసి ఎదురుదాడి చేసి అతన్ని అంతమొందించారు. అదే రోజు నిందితుల్లో ఒకరు ఠాణాలో లొంగిపోయాడు. మరొకరిని బుధవారం అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడిని త్వరగా పట్టుకుని రిమాండ్కు తరలించడంలో కృషి చేసిన ఎస్సై విఠల్, సిబ్బంది శ్రీనివాస్, సుధాకర్ను సీఐ అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాగల వారం రోజులు..
[ 04-05-2024]
ఎన్నికల ప్రచారం ముగిసేందుకు మరో వారం రోజులే ఉండడంతో... రాజకీయ పార్టీలు ముమ్మర ప్రచారానికి సమాయత్తమవుతున్నాయి. -
నిఘా తగ్గి.. అక్రమాలు పెరిగి
[ 04-05-2024]
అధికారులంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో అక్రమార్కులు విజృంభిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. -
సంచరిస్తున్న చిరుత.. ప్రజలు జాగ్రత్త
[ 04-05-2024]
అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
వనిత చేతిలో నేతల భవిత
[ 04-05-2024]
మహిళలు ఇంటిని చక్కబెట్టడమే కాదు.. ఓటు ద్వారా సమాజంలో మార్పు కాంక్షించడంలో ముందు వరుసలో ఉంటారు. -
హస్తం హామీలకు రూ.3లక్షల కోట్లు కావాలి
[ 04-05-2024]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేరాలంటే రూ.3 లక్షల కోట్లు కావాలని, మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నానని రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. -
కాంగ్రెస్ పాలనతోనే దేశం క్షేమం
[ 04-05-2024]
దేశాన్ని క్షేమంగా ఉంచడం కాంగ్రెస్కే సాధ్యమని, పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. -
పేదల సంక్షేమం మాతోనే సాధ్యం: జగ్గారెడ్డి
[ 04-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేద ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
పౌరులు పొరపడితే.. అభ్యర్థులకు గ్రహపాటే
[ 04-05-2024]
ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు. -
ఓటింగ్ శాతం పెంపునకు ప్రాధాన్యం
[ 04-05-2024]
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా యంత్రాంగం ముందుకు సాగుతోంది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. -
శిక్ష తప్పదు తస్మాత్ జాగ్రత్త!
[ 04-05-2024]
అన్ని పార్టీలు లోక్సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో ప్రచారంతో దూసుకెళ్తున్నాయి. -
త్రిముఖ పోరు..ప్రచార జోరు
[ 04-05-2024]
ఓ వైపు ఎండలు మండుతున్నప్పటికీ.. మరో వైపు విజయమే లక్ష్యంగా నేతలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. -
ఆరు గ్యారంటీల పేరుతో మోసం: హరీశ్రావు
[ 04-05-2024]
ఆరు గ్యారంటీల పేరుతో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించినట్లు మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. -
పార్టీలు మారే వారికి ఓటెయొద్దు: రాజాసింగ్
[ 04-05-2024]
పార్టీలు మారే వారికి ఓటెయ్యవద్దని, ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకైన భాజపా అభ్యర్థి రఘునందన్రావును గెలిపించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. -
దుబ్బాకలో లోకల్ దారి
[ 04-05-2024]
నియోజకవర్గంలోని ఓటర్లందరినీ ఒకేరకమైన హామీతో ప్రసన్నం చేసుకోవాలనుకుంటే కొంత ఇబ్బందే. -
పెళ్లి రోజే అనంత లోకాలకు
[ 04-05-2024]
ద్విచక్రవాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన జగదేవపూర్ మండలం తీగుల్లో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!
-
టీ20ల్లో ‘యాంకర్’ పదానికి చోటే లేదు.. కోహ్లీ బ్యాటింగ్లో గేర్లు ఎక్కువే: మూడీ
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
-
దుస్తుల్లో 25 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. చిక్కిన అఫ్గాన్ దౌత్యవేత్త..!
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్