విద్యా వికాసానికి పీఎంశ్రీ
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు.
జిల్లాలో 11 బడుల ఎంపిక
న్యూస్టుడే, చేగుంట: పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు..మన బడి’ కార్యక్రమంలో పాఠశాలలను అభివృద్ధి చేస్తోంది. ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వం కూడా ‘ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా’(పీఎంశ్రీ) పేరుతో కొత్త పథకానికి గత ఏడాది శ్రీకారం చుట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో విడత 11 పాఠశాలలను ఈ పథకం కింద ఎంపిక చేశారు. యూడైస్ ప్లస్ ప్రోగ్రాంలో నమోదైన సమాచారం ప్రకారం జిల్లాల వారిగా పీఎంశ్రీ పథకానికి ఎంపిక ప్రక్రియ చేపట్టారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 60 రకాల ప్రశ్నావళిని పూరించారు. పాఠశాల ఫొటోలు, పంచాయతీ, పాఠశాల తీర్మాన ప్రతులను ఆన్లైన్లో నమోదు చేయాలి. సొంత భవనం, అగ్ని ప్రమాదాల నుంచి రక్షణ, విద్యార్థుల నమోదు, శౌచాలయాలు, తాగునీరు, చేతుల శుభ్రత, సరిపడే సంఖ్యలో ఉపాధ్యాయులు, విద్యుత్తు, గ్రంథాలయ వసతి వంటి అంశాలను అందులో నింపారు. దాని ఆధారంగా మొదటి విడతలో జిల్లాలో 20 పాఠశాలలను ఎంపిక చేశారు. తాజాగా రెండో విడతలో 11 పాఠశాలలను ఎంపిక చేశారు.
రూ.లక్షల్లో నిధులు: ఎంపికైన పాఠశాలలకు నాలుగేళ్లలో రూ.లక్షల్లో నిధులు విడుదలకానున్నాయి. ఇందులో కేంద్రం 60శాతం, రాష్ట్రం 40శాతం నిధులు అందిస్తుంది. ఈ నిధులతో పోషకాహారవనం, శుద్ధి జలం, సౌర విద్యుత్తు, ప్రయోగశాలలు, అంతర్జాల సదుపాయం, డిజిటల్ బోధన, వృత్తివిద్యా కోర్సులు, ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దటం, డిజిటల్ గ్రంథాలయం, క్రీడా మైదానం, నైపుణ్యాభివృద్ధి పెంపునకు చర్యలు తీసుకోనున్నారు. పాఠశాల దశ నుంచే ఒకేషనల్ కోర్సులను ప్రోత్సహిస్తారు. విద్యార్థి డిగ్రీకి వచ్చే సరికి ఏదో ఒక రంగంలో ఉపాధి పొందేలా తీర్చిదిద్దాలని జాతీయ విద్యావిధానం లక్ష్యం.
కొన్ని పాఠశాలలే: పీఎంశ్రీ కింద పాఠశాలలను ఎంపిక చేసేందుకు దరఖాస్తు చేసుకోవాలని అప్పట్లో సూచించారు. ప్రతి మండలం నుంచి రెండు పాఠశాలలను ఎంపిక చేస్తామని ప్రకటించారు. తీరా మొదటి విడతలో కొన్ని, ఇప్పుడు మరికొన్ని ఎంపిక చేశారు. మండలానికి రెండు పాఠశాలలు ఎంపికవుతాయని ఉపాధ్యాయులు, గ్రామస్థులు భావించారు. కానీ కొన్ని మండలాల్లోని బడులకు ప్రాతినిధ్యం దక్కలేదు.
జిల్లాలో ఎంపికైనవి : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంట, టీఎస్డబ్ల్యూఆర్ఈఐస్ మెదక్, జడ్పీ ఉన్నత పాఠశాల చిన్నశంకరంపేట, జడ్పీ ఉన్నత పాఠశాల కూచన్పల్లి(హావేలిఘనపూర్), జడ్పీ ఉన్నత పాఠశాల లింగాయిపల్లి-చీకోడ్(పాపన్నపేట), జడ్పీ ఉన్నత పాఠశాల గోమారం(శివ్వంపేట), జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నర్సాపూర్, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల పెద్దశంకరంపేట, కేజీబీవీ కొల్చారం, ప్రాథమీకోన్నత పాఠశాల నర్సంపల్లి(నార్సింగి), జడ్పీ ఉన్నత పాఠశాల కౌడిపల్లి.
పాఠశాల అభివృద్ధికి మేలు రాధాకిషన్, డీఈవో
జిల్లాలో రెండో విడత మరికొన్ని పాఠశాలలను పీఎంశ్రీ కింద ఎంపిక చేశారు. దీనివల్ల పాఠశాలల్లో మరిన్ని సౌకర్యాలు లభించనున్నాయి. ఏటా కొన్ని పాఠశాలలను ఎంపిక చేస్తున్నారు. ఎంపిక చేసిన వాటికి త్వరలోనే నిధులు విడుదల అవుతాయి. వాటితో ఎన్నో పనులు చేసేందుకు ఆస్కారం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాగల వారం రోజులు..
[ 04-05-2024]
ఎన్నికల ప్రచారం ముగిసేందుకు మరో వారం రోజులే ఉండడంతో... రాజకీయ పార్టీలు ముమ్మర ప్రచారానికి సమాయత్తమవుతున్నాయి. -
నిఘా తగ్గి.. అక్రమాలు పెరిగి
[ 04-05-2024]
అధికారులంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో అక్రమార్కులు విజృంభిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. -
సంచరిస్తున్న చిరుత.. ప్రజలు జాగ్రత్త
[ 04-05-2024]
అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
వనిత చేతిలో నేతల భవిత
[ 04-05-2024]
మహిళలు ఇంటిని చక్కబెట్టడమే కాదు.. ఓటు ద్వారా సమాజంలో మార్పు కాంక్షించడంలో ముందు వరుసలో ఉంటారు. -
హస్తం హామీలకు రూ.3లక్షల కోట్లు కావాలి
[ 04-05-2024]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేరాలంటే రూ.3 లక్షల కోట్లు కావాలని, మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నానని రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. -
కాంగ్రెస్ పాలనతోనే దేశం క్షేమం
[ 04-05-2024]
దేశాన్ని క్షేమంగా ఉంచడం కాంగ్రెస్కే సాధ్యమని, పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. -
పేదల సంక్షేమం మాతోనే సాధ్యం: జగ్గారెడ్డి
[ 04-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేద ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
పౌరులు పొరపడితే.. అభ్యర్థులకు గ్రహపాటే
[ 04-05-2024]
ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు. -
ఓటింగ్ శాతం పెంపునకు ప్రాధాన్యం
[ 04-05-2024]
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా యంత్రాంగం ముందుకు సాగుతోంది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. -
శిక్ష తప్పదు తస్మాత్ జాగ్రత్త!
[ 04-05-2024]
అన్ని పార్టీలు లోక్సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో ప్రచారంతో దూసుకెళ్తున్నాయి. -
త్రిముఖ పోరు..ప్రచార జోరు
[ 04-05-2024]
ఓ వైపు ఎండలు మండుతున్నప్పటికీ.. మరో వైపు విజయమే లక్ష్యంగా నేతలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. -
ఆరు గ్యారంటీల పేరుతో మోసం: హరీశ్రావు
[ 04-05-2024]
ఆరు గ్యారంటీల పేరుతో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించినట్లు మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. -
పార్టీలు మారే వారికి ఓటెయొద్దు: రాజాసింగ్
[ 04-05-2024]
పార్టీలు మారే వారికి ఓటెయ్యవద్దని, ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకైన భాజపా అభ్యర్థి రఘునందన్రావును గెలిపించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. -
దుబ్బాకలో లోకల్ దారి
[ 04-05-2024]
నియోజకవర్గంలోని ఓటర్లందరినీ ఒకేరకమైన హామీతో ప్రసన్నం చేసుకోవాలనుకుంటే కొంత ఇబ్బందే. -
పెళ్లి రోజే అనంత లోకాలకు
[ 04-05-2024]
ద్విచక్రవాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన జగదేవపూర్ మండలం తీగుల్లో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!
-
టీ20ల్లో ‘యాంకర్’ పదానికి చోటే లేదు.. కోహ్లీ బ్యాటింగ్లో గేర్లు ఎక్కువే: మూడీ
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!