బరిలో 44 మంది 15 మంది
మెదక్ లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య తేలింది. కీలకమైన సంగ్రామంలో 44 మంది అభ్యర్థులు తలపడనున్నారు.
గుర్తింపు, రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు
29 మంది స్వతంత్రులు
మెదక్, న్యూస్టుడే: మెదక్ లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య తేలింది. కీలకమైన సంగ్రామంలో 44 మంది అభ్యర్థులు తలపడనున్నారు. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు తలపడుతున్న నియోజకవర్గాల్లో రాష్ట్రంలోనే మెదక్ ద్వితీయ స్థానంలో ఉంది. ఇందులో గుర్తింపు, రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. పార్టీల అభ్యర్థుల కంటే స్వతంత్రులు ఎక్కువ సంఖ్యలో ఉండడం గమనార్హం. మెదక్ లోక్సభ నియోజకవర్గానికి మొత్తం 54 మంది నామినేషన్ దాఖలు చేయగా, అందులో ఒక స్వతంత్ర అభ్యర్థి నామపత్రం తిరస్కరించిన సంగతి విధితమే. నామపత్రాల ఉపసంహరణకు సోమవారం తుది గడువు కాగా, మధ్యాహ్నం మూడు గంటలలోపు తెలంగాణ రాజ్య సమితి పార్టీ అభ్యర్థి తుపాకుల మురళీ, యుగ తులసీ పార్టీ అభ్యర్థి అనిల్, స్వతంత్ర అభ్యర్థులు బద్రేశ్, పృధ్వీరాజ్, బంగారయ్య, వరికోలు శ్రీనివాస్, మల్లికార్జున్, గానగోని శ్రీనివాస్, మంతురి బాబు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో తుది పోరులో 44 మంది అభ్యర్థులు నిలిచారు.
స్వతంత్రులే అధికం..
ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో మెదక్ లోక్సభ స్థానానికి పార్టీల అభ్యర్థుల కంటే స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో పోటీ చేస్తుండడం గమనార్హం. మొత్తం 29 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. కుమార్, అభిలాష్ చెలిమెల, అభిలాష్ శిర్న, ఆంజనేయులు, క్రాంతికుమార్, కాసోజు శ్రీకాంత్, కొండి అశోక్, కొల్కూర్ ప్రతాప్, గడీల ఆంజనేయులు, భుజంగం, గౌటి మల్లేశ్, వీర్సంగప్ప, రాజేందర్, భానుచందర్ దాసరి, దుబ్బాల శ్రీశైలం, నరహరి, నవీన్కుమార్, నాగమణి, ప్రదీప్, విజయ్కుమార్, లక్ష్మినారాయణ, అజార్, మేడి శ్రీనివాస్రెడ్డి, రఘు, రాజేశ్ సాగర్, లక్ష్మినారాయణ, రమేశ్, వెంకటేశ్, సత్యనారాయణగౌడ్ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. వీరికి రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్ ఎన్నికల గుర్తులను కేటాయించారు.
జహీరాబాద్లో 19 మంది..
జహీరాబాద్ లోక్సభ స్థానానికి బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. 19 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరించగా.. 40 మంది 68 సెట్లు దాఖలు చేశారు. పరిశీలన ప్రక్రియలో 14 మందికి చెందిన 19 సెట్లు తిరస్కరించారు. 26 మంది అభ్యర్థుల నామపత్రాలను ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇందులో ఏడుగురు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉప సంహరించుకున్నారు. బరిలో ఉన్న వారిలో జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీలకు చెందిన వారు ముగ్గురు ఉండగా.. రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలకు చెందిన వారు ఆరుగురు, మిగతా పది మంది స్వతంత్రులు. అభ్యర్థుల సంఖ్య 15 దాటడంతో ఒక్కో పోలింగ్ కేంద్రంలో రెండు చొప్పున ఈవీఎంలు ఏర్పాటు చేయనున్నారు.
మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం...
అత్యధిక మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో పోలింగ్ రోజున ఓటు వేసేందుకు మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతాయి. ఒక బ్యాలెట్లో 16 మంది అభ్యర్థుల పేర్లు, ఫొటో, పార్టీ పేరు, గుర్తు వివరాలు ఉంటాయి. కానీ మెదక్ స్థానంలో 44 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో ప్రతి పోలింగ్ కేంద్రంలో మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం. పార్లమెంట్ నియోజకవర్గంలో 2,124 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పోలింగ్ కోసం 6,372 బ్యాలెట్ యూనిట్లు అవసరం. పోలింగ్ సమయంలో సాంకేతిక లోపాలు తలెత్తకుండా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 25 శాతం అదనంగా బ్యాలెట్ యూనిట్లను అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు. 6,372 బ్యాలెట్ యూనిట్లకు అదనంగా 1,593 సమకూర్చనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అకాల వర్షం.. అపారనష్టం
[ 17-05-2024]
జిల్లాలో పాపన్నపేట, టేక్మాల్, హవేలిఘనపూర్ మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం కురిసింది. పాపన్నపేట కొనుగోలు కేంద్రంలోని వడ్ల కుప్పల వద్ద వర్షపు నీరు చేరింది. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే : ఎమ్మెల్యే సునీతారెడ్డి
[ 17-05-2024]
వరి పండించిన రైతులకు మద్దతు ధరలతో పాటు, రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి మాట తప్పిందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. -
బడులకు భద్రతేదీ!
[ 17-05-2024]
పెద్దశంకరంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరునెలల క్రితం వంటశాలలో పాత్రలను అపహరించుకుపోయారు. అనంతరం తరగతి గదుల కిటికీలు, తలుపులు పగులగొట్టారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఉక్కుపాదం
[ 17-05-2024]
దిగుబడుల ఆశచూపి అన్నదాతలకు నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకునే దళారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం యంత్రాంగం నడుం బిగించింది. -
మూగబోనున్న తెర
[ 17-05-2024]
ప్రజలకు వినోదాన్ని పంచే సినిమా థియేటర్లు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కరోనా కంటే ముందు ప్రేక్షకుల ఆదరణతో నడిచిన సినిమా హాళ్లు ప్రస్తుతం ఆదరణకు నోచుకోవడం లేదు. -
ప్రాథమిక విద్యకు సాంకేతిక ఊతం
[ 17-05-2024]
ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. తొలిమెట్టు పేరుతో రెండేళ్ల నుంచి ప్రత్యేక బోధన చేయిస్తోంది. -
మహిళాభ్యున్నతికి బాటలు
[ 17-05-2024]
మహిళలు రాణిస్తే ప్రగతి సాధ్యం. ఇదే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు ఇప్పించడం ఇందులో భాగమే. -
A .. యాపిల్ Z .. జహీరాబాద్
[ 17-05-2024]
శీతల ప్రాంతాల్లో ఎక్కువగా పండే పంట యాపిల్. కశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి చల్లటి వాతావరణంలో మాత్రమే ఆ చెట్లు పెరిగి కాస్తాయి. అలాంటి పంటను తెలుగు రాష్ట్రాల్లో చలి ఎక్కువగా ఉండే ఏపీలోని లంబసింగి, -
వినూత్న తీర్పు
[ 17-05-2024]
మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన నిందితులు నలుగురికి తాండూరు స్పెషల్ క్లాస్ జ్యుడీషియల్ న్యాయమూర్తి నామాల అశోక్ వినూత్న తీర్పు ఇచ్చారు. -
ఇంటిపైన వనం.. ఖాళీ స్థలం సద్వినియోగం
[ 17-05-2024]
కూరగాయల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పైగా రసాయనాలు, పురుగుల మందుల వాడకంతో అవి కలుషితమవుతున్నాయి. వాటిని కొనుగోలు చేసి తిన్నవారి ఖర్చులు పెరగడంతో పాటు అనారోగ్యానికి గురవుతున్నారు. -
అర్హులకు దక్కని ఓటు
[ 17-05-2024]
ఓటరు జాబితాలో తప్పులు సర్వ సాధారణమైంది. వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటరు జాబితాలో తప్పులున్నాయి. -
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలి
[ 17-05-2024]
ట్రాక్టర్ డ్రైవరు నిర్లక్ష్యానికి చిన్నారి బలైన ఘటన మండలంలోని అప్పాజీపల్లిలో గురువారం జరిగింది. ఎస్సై మహ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. -
హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ కౌన్సిలర్గా సంగారెడ్డి వాసి విజయం
[ 17-05-2024]
బ్రిటన్లోని హ్యాట్ఫీల్డ్ సౌత్ వెస్ట్ వార్డు కౌన్సిలర్గా సంగారెడ్డికి చెందిన బొంకూర్ కార్తిక్ కుమార్ అధికార లేబర్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 1,763 ఓట్లు పోలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
రాణించిన కేఎల్ రాహుల్-పూరన్.. ముంబయి లక్ష్యం 215
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
ఏపీలో ఎన్నికల ముందు తర్వాత హింసపై సిట్ ..ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
విజయవాడ డివిజన్ పరిధిలో 14 రైళ్లు రద్దు