logo

తండ్రి మందలించాడని.. ఉరి వేసుకొని యువతి బలవన్మరణం

చండూరులో ఓ యువతి ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణం చేసుకున్న ఘటన శనివారం చోటు చేసుకుంది. నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి చండూరులో కొంతకాలంగా రూ.పదికి దొరికే వస్తువులు అమ్మె దుకాణాన్ని నడిపిస్తున్నారు.

Published : 23 Jan 2022 05:53 IST

చండూరు, న్యూస్‌టుడే: చండూరులో ఓ యువతి ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణం చేసుకున్న ఘటన శనివారం చోటు చేసుకుంది. నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి చండూరులో కొంతకాలంగా రూ.పదికి దొరికే వస్తువులు అమ్మె దుకాణాన్ని నడిపిస్తున్నారు. ఆయన చిన్న కుమార్తె(18) కల్వకుర్తిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతోంది. ఇటీవల స్వగ్రామం వెళ్లిన వెంకటయ్య శుక్రవారం తన కూతురుతో చండూరుకు వచ్చారు. శనివారం మధ్యాహ్నం తండ్రి దుకాణంలో ఉండగా ఇంటి లోపలికి వెళ్లిన ఆమె ఉరి వేసుకుంది. తండ్రి కొద్ది సేపటికి వెళ్లి చూడగా ఆమె అప్పటికే మృతి చెందింది. ఏదో కారణంగా తండ్రి మందలించినందుకే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఉరి వేసుకోవటంలో కూడా కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎస్సై నవీన్‌కుమార్‌ ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని