తండ్రి మందలించాడని.. ఉరి వేసుకొని యువతి బలవన్మరణం
చండూరులో ఓ యువతి ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణం చేసుకున్న ఘటన శనివారం చోటు చేసుకుంది. నాగర్కర్నూలు జిల్లా వెల్దండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి చండూరులో కొంతకాలంగా రూ.పదికి దొరికే వస్తువులు అమ్మె దుకాణాన్ని నడిపిస్తున్నారు.
చండూరు, న్యూస్టుడే: చండూరులో ఓ యువతి ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణం చేసుకున్న ఘటన శనివారం చోటు చేసుకుంది. నాగర్కర్నూలు జిల్లా వెల్దండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి చండూరులో కొంతకాలంగా రూ.పదికి దొరికే వస్తువులు అమ్మె దుకాణాన్ని నడిపిస్తున్నారు. ఆయన చిన్న కుమార్తె(18) కల్వకుర్తిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. ఇటీవల స్వగ్రామం వెళ్లిన వెంకటయ్య శుక్రవారం తన కూతురుతో చండూరుకు వచ్చారు. శనివారం మధ్యాహ్నం తండ్రి దుకాణంలో ఉండగా ఇంటి లోపలికి వెళ్లిన ఆమె ఉరి వేసుకుంది. తండ్రి కొద్ది సేపటికి వెళ్లి చూడగా ఆమె అప్పటికే మృతి చెందింది. ఏదో కారణంగా తండ్రి మందలించినందుకే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఉరి వేసుకోవటంలో కూడా కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎస్సై నవీన్కుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!
[ 27-04-2024]
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. -
వీడని మిస్టరీ..!
[ 27-04-2024]
ఈ నెల 18 నుంచి కనిపించకుండా పోయిన సూర్యాపేట మండలం యల్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య కేసు మిస్టరీ వీడటం లేదు. -
చివరికి మొగి పురుగు దాడి
[ 27-04-2024]
ఈ సీజన్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు ఆలస్యంగా విడుదల కావడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో 40 శాతం వరి సాగు జనవరి మాసంలో చేపట్టారు. -
వేతనాలు రాక టీఏల ఇబ్బందులు
[ 27-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి పనులను చూపిస్తూ విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయకుల ( టెక్నికల్ అసిస్టెంట్లు)కు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బరిలో..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్