దూరం.. ఉపకారం
ఏటా ఒకటి నుంచి పదో తరగతి వరకు మైనారిటీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలను అందిస్తోంది.
1 నుంచి 8వ తరగతులకు నిలిపి వేసిన ప్రభుత్వం
కోదాడ, న్యూస్టుడే: ఏటా ఒకటి నుంచి పదో తరగతి వరకు మైనారిటీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలను అందిస్తోంది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదివే విద్యార్థులకు ఈ ఏడాది నుంచి ఉపకార వేతనాలు నిలిపివేస్తున్నట్లు తాజాగా కేంద్రం వెల్లడించింది. అయితే ఈ ఏడాది మైనారిటీ ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒకటి నుంచి పదో తరగతి వరకు ఈ ఏడాది 5,277 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎనిమిదో తరగతి వరకు ఈ పథకం నిలిపి వేయడంతో 4,377 మంది విద్యార్థులు ఈ పథకానికి దూరం అయ్యారు. 1 నుంచి 5వ తరగతి వరకు ప్రతి నెల రూ.100, 5 నుంచి 10వ తరగతి వరకు రూ.350 చొప్పున ఏడాది కాలంలో 10 నెలలు అందుతాయి. ప్రవేశ ఫీజు కింద ఏడాదికి రూ.5,00, పుస్తకాలు అందిస్తారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రభుత్వం ఈ పథకం నిలిపివేయడంతో ఆ కుటుంబాలపై ఈ మేరకు ఆర్థికం భారం పడనుంది.
కారణాలు..
విద్యా హక్కు చట్టం కింద 1 నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వం ఉచితంగా ప్రాథమిక విద్యను అందిస్తోంది. దీంతో సామాజిక న్యాయ, గిరిజన మంత్రిత్వ శాఖలు కేవలం 9,10 తరగతి వారికే ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు అందిస్తున్నాయి. దీంతో ఇదే తరహాలో మైనారిటీ శాఖ పరిధిలో నడుస్తున్న ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలను 1 నుంచి 8వ తరగతి వరకు తొలగించి 9, 10వ తరగతులకు కొనసాగించిందని ఆ శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు.
దరఖాస్తు తర్వాత తొలగింపు
- షేక్ అబీద్ నల్లబండగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కోదాడ
నేను ఏడో తరగతి చదువుతున్నాను. ఈ ఏడాది మైనారిటీ ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకున్నాను. గతంలో ప్రతి నెల రూ.350 అందేవి. దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రభుత్వం తొలగించింది. దీంతో ప్రభుత్వం అందించే ఆర్థిక భరోసాను కోల్పోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతాయి.
9, 10వ తరగతులకు..
-మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి, నల్గొండ
ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉచిత నిర్బంధ విద్య అమలులో ఉండటంతో మైనారిటీ ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర విద్యార్థుల మాదిరిగానే 9, 10వ తరగతి చదివే విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలతో పాటూ ఈ ఎన్నిక గెలుపుపైనా దృష్టి సారించాయి. -
ఇంటింటికీ పోల్ చిట్టీలు..!
[ 27-04-2024]
ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్ చిట్టీలు పంపిణీ చేస్తోంది. -
పురంపై సైబర్ ఉచ్చు..!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో రాకేశ్ అనే వ్యాపారికి ఈ నెల 21న సాయంత్రం సెల్ నంబరు 63054 68441 నుంచి ఫోన్ కాల్ వచ్చింది. -
మామిడీలా
[ 27-04-2024]
మామిడి.. భారతదేశపు పండుగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఇది నిన్నామొన్నటి మాట. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాడు: రాజగోపాల్రెడ్డి
[ 27-04-2024]
రాబోయే నాలుగేళ్లలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తానని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
పద తమ్ముడూ.. పార్టీ మారుదాం!
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. రాజకీయ సమీకరణాలూ శరవేగంగా మారుతున్నాయి. -
సమగ్ర సమాచార మార్గదర్శి
[ 27-04-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలు చేపడుతోంది. -
‘గుర్తు’ తెచ్చుకుందాం..రండి
[ 27-04-2024]
రాజకీయ పార్టీల ఉనికిని చాటేది వాటి గుర్తులే. గుర్తుల ఆధారంగానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాకుండా ఓటర్లు ఓటు వేస్తుంటారు. -
ప్రజల మనిషి ధర్మభిక్షం
[ 27-04-2024]
మునుగోడు మండలం ఊకొండిలో కల్లుగీత వృత్తి పని చేసుకునే ధర్మభిక్షం కుటుంబం సూర్యాపేటకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. -
ఈతకెళ్లి తండ్రీతనయుల మృతి
[ 27-04-2024]
నీటి ప్రమాదాల నుంచి తప్పించుకునేలా తన ఇద్దరు కుమారులకు ఈత నేర్పాలని భావించిన ఆ తండ్రి. -
అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!
[ 27-04-2024]
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. -
వీడని మిస్టరీ..!
[ 27-04-2024]
ఈ నెల 18 నుంచి కనిపించకుండా పోయిన సూర్యాపేట మండలం యల్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య కేసు మిస్టరీ వీడటం లేదు. -
చివరికి మొగి పురుగు దాడి
[ 27-04-2024]
ఈ సీజన్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు ఆలస్యంగా విడుదల కావడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో 40 శాతం వరి సాగు జనవరి మాసంలో చేపట్టారు. -
వేతనాలు రాక టీఏల ఇబ్బందులు
[ 27-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి పనులను చూపిస్తూ విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయకుల ( టెక్నికల్ అసిస్టెంట్లు)కు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బరిలో..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.