సూర్యాపేట..ఖ్యాతి చాటేలా..!
సూర్యాపేట జిల్లా ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వస్తోంది. జిల్లా పరిపాలన సౌధం అయిన కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయం (డీపీవో), వైద్య కళాశాల భవనం, సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్లు రేపు (ఆదివారం ఆగస్టు 20వ తేదీ) సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి.
ఈనాడు, నల్గొండ : సూర్యాపేట జిల్లా ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వస్తోంది. జిల్లా పరిపాలన సౌధం అయిన కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయం (డీపీవో), వైద్య కళాశాల భవనం, సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్లు రేపు (ఆదివారం ఆగస్టు 20వ తేదీ) సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. ఈ నాలుగు భవనాల నిర్మాణానికి రూ.288.50 కోట్లు ఖర్చు చేశారు. జిల్లా భారాస పార్టీ కార్యాలయాన్ని సైతం ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ భవనాల డ్రోన్ ఫొటోలను మంత్రి జగదీశ్రెడ్డి సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విట్టర్లలో పంచుకున్నారు.
ముస్తాబైంది ఇలా.. వైద్య కళాశాల
వైద్యకళాశాల, విద్యార్థుల వసతిగృహాల సముదాయం
రూ.156 కోట్లతో.. 20 ఎకరాల విస్తీర్ణంలో..ఆరు లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో ఎనిమిది విభాగాలుగా దీనిని నిర్మించారు. ఇందులో జీ+5 నిర్మాణంలో కళాశాల, బాలుర, బాలికల వసతిగృహాలతో పాటూ ప్రిన్సిపల్, సిబ్బంది క్వార్టర్స్ను ఏర్పాటు చేశారు. ఆరు ఎకరాల్లో పచ్చదనం కోసం చెట్లను పెంచుతున్నారు. 900 మందికి వసతి కల్పించేలా వసతిగృహాలను విశాలమైన భవనాలుగా తీర్చిదిద్దడం విశేషం.
పచ్చ‘ధనం’లో.. కలెక్టరేట్ భవనం
కలెక్టరేట్
రూ.64 కోట్ల అంచనా వ్యయంతో.. 21 ఎకరాల్లో.. 1.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. జీ+2 అంతస్తుల్లో 37 శాఖలకు చెందిన ఉద్యోగులకు గదులు, క్వార్టర్స్ను కేటాయించారు. పది ఎకరాల్లో పచ్చదనం, ల్యాండ్స్కేప్ను సూర్యుడి ఆకారంలో తీర్చిదిద్దారు. రాష్ట్రంలోనే తొలిసారిగా కలెక్టరేట్ మొత్తం సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందుకు రూ. 65 లక్షలతో 100 కిలో వాల్ట్ల సామర్థ్యంతో ప్లాంటును కలెక్టరేట్ భవనంపై ఏర్పాటు చేశారు.
రాజభవనం తరహాలో.. డీపీవో కార్యాలయం
జిల్లా పోలీసు కార్యాలయం
రూ.38.50 కోట్లతో.. 20 ఎకరాల్లో 60 వేల చదరపు అడుగుల్లో మూడు అంతస్తుల్లో డీపీవోను నిర్మించారు. రాజభవనం ప్రాసాదం డిజైన్లో తీర్చిదిద్దారు. సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేసిన అన్ని సీసీ టీవీ కెమెరాల దృశ్యాలను ఇందులో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నేరుగా పర్యవేక్షించొచ్చు. ప్రజలు తమ అర్జీలను ఇచ్చేందుకు విశాలమైన గ్రీవెన్స్హాల్ను నిర్మించారు. కార్పొరేట్ భవనం తరహాలో రిసెప్షన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో విస్తీర్ణం పరంగా ఇదే అతిపెద్ద పోలీసు కార్యాలయమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఆసియాలోనే అతిపెద్దగా.. సమీకృత మార్కెట్
సమీకృత వెజ్ - నాన్వెజ్ మార్కెట్
రైతులు పండించిన వ్యవసాయ, మాంసం ఉత్పత్తులను మార్కెట్కు తరలించి వాటికి డిమాండ్ పెంచే లక్ష్యంతో ఆసియాలోనే అతిపెద్దదైన సమీకృత మార్కెట్ను ఇక్కడ నిర్మించారు. విద్యుత్తు అవసరం లేకుండానే మార్కెట్లో వెలుతురు, చల్లనిగాలి వచ్చేలా గ్రీన్ బిల్డింగ్ తరహాలో నిర్మాణాలు చేయడం విశేషం. రూ.30 కోట్ల వ్యయంతో ఆరు ఎకరాల విస్తీర్ణం, 2.5 లక్షల ఎకరాల చదరపు అడుగుల్లో దీనిని తీర్చిదిద్దారు. ఐదు బ్లాకుల్లో 200 కంటే ఎక్కువ దుకాణాలు ఉండేలా నిర్మాణాలు చేశారు. రోజులో పది గంటల పాటూ వెలుతురు వచ్చేలా రూఫ్టాప్ డిజైన్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ బస్టాండ్లలో పార్కింగ్ ఫీజులుం
[ 17-05-2024]
సూర్యాపేట బస్టాండ్లో ఓ ప్రయాణికుడు తన వాహనాన్ని పార్కింగ్ చేసి నాలుగు గంటల తర్వాత తీసుకునేందుకు వెళ్లగా.. రూ.30 వసూలు చేశారు. ఇదేమని నిలదీస్తే రోజుకు రూ.30 అని, ఎన్ని గంటలైనా తమకు సంబంధం లేదని నిర్వాహకులు దురుసుగా సమాధానం చెప్పారు. చేసేదేమీ లేక ఇచ్చేసి వచ్చేశాడు. -
జాబితాలో చోటెప్పుడిస్తారో..!
[ 17-05-2024]
రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన మంత్రి(పీఎం) కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధుల కోసం అయిదేళ్లుగా రైతులు ఎదురు చూస్తున్నారు. -
పట్టించుకోకుంటే ప్రమాదమే..!
[ 17-05-2024]
ఈ చిత్రంలో కనిపిస్తున్న హోర్డింగ్లు కోదాడ పట్టణంలోని పుర కార్యాలయం ఎదురుగా ఉన్న కూరగాయల మార్కెట్కు ఆనుకొని ఉన్నాయి. ఒక వైపు మార్కెట్, మరోవైపు ప్రధాన రహదారి. -
అక్షరానికి ఊతం ఉల్లాస్
[ 17-05-2024]
చదువును మధ్యలోనే ఆపేసిన విద్యార్థులు, వయోజనులను అక్షరాస్యులుగా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నవభారత సాక్షరత (న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం) అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
ఉద్యోగుల తండా
[ 17-05-2024]
అదో మారుమూల గిరిజన తండా. 1,500 వరకు జనాభా ఉన్న ఈ పల్లెలో అంతా వ్యవసాయ కూలీలే. రెక్కాడందే పూట గడవని పేదరికం వారిది. తమకు అక్షరజ్ఞానం లేకున్నా.. దశాబ్దాలుగా కనీస సౌకర్యాలు లేని గ్రామంలోనే.. ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు. -
ఓటర్లు పెరిగినా.. చైతన్యం పెరగలే
[ 17-05-2024]
గతంతో పోల్చితే ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు పెరిగారు. కానీ వారిలో విధిగా ఓటు వేయాలన్న భావన కలగలేదు. ఎన్నికల సంఘం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు రూ.కోట్లాది నిధులు ఖర్చుచేసి ఓటర్లను చైతన్యం చేసేందుకు విస్తృత ప్రచారం చేస్తున్నా.. -
పంట దిగుబడిలో విత్తన ఎంపిక ముఖ్యం
[ 17-05-2024]
వివిధ రకాల పంటల దిగుబడిలో విత్తన ఎంపిక ముఖ్యమని కంపసాగర్ కేవీకే వరి సేద్య విభాగపు శాస్త్రవేత్త కె.చంద్రశేఖర్ అన్నారు. ‘ఈనాడు’ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఫోన్- ఇన్ కార్యక్రమంలో జిల్లా నలుమూలలకు చెందిన రైతులు ఫోన్ ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. -
అన్విత మరో సాహసం
[ 17-05-2024]
ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఏడు ఎత్తైన పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న పర్వతారోహిణి (ఎవరెస్టర్) పడమటి అన్విత ఉత్తర అమెరికాలోని ఎత్తైన శిఖరం ‘దెనాలి’(6190మీ.)ని అధిరోహించేందుకు పయనమవుతోంది. -
భానుడు భగభగ.. మీటర్ గిరగిర
[ 17-05-2024]
భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో ప్రజలు ఉక్కపోతతో విలవిల్లాడుతున్నారు. ఎండలకు తోడు విద్యుత్తు వినియోగం పెరుగుతోంది. కరెంటు లేకుంటే ప్రజలు ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి నెలకొంది. -
71 కేంద్రాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్: కలెక్టర్
[ 17-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, జూన్ 9న జరిగే గ్రూప్-1 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటరావు తెలిపారు. -
నాడు 40.. నేడు 22 రోజులు
[ 17-05-2024]
గత లోక్సభ ఎన్నికల నుంచి ఫలితాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఫలితాలు నాలుగైదు రోజులు, వారం ఉంటే వాటి కోసం నిరీక్షణ అంతగా ఉండదు. కానీ, ప్రస్తుతం 22 రోజుల వరకు వేచి చూడాల్సి వస్తోంది. -
పంచనారసింహులకు నిత్యారాధనలు
[ 17-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న పంచనారసింహులను ఆరాధిస్తూ నిత్య ఆరాధనలు, ఆర్జిత కైంకర్యాలను పూజారులు ఆలయ ఆచారంగా కొనసాగించారు. -
ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఎక్కడంటే...!
[ 17-05-2024]
రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. 17 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆయా లోక్సభ స్థానాల పరిధిలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు 43 చోట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
రెండు చోట్ల ఓట్లు .. తొలగించేది ఎప్పుడు!
[ 17-05-2024]
ఒక వ్యక్తికి ఒక రాష్ట్రంలో ఒకే నియోజకవర్గంలో ఓటు ఉండాలి. ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓటు కలిగి ఉండటం నిబంధనలకు విరద్ధ్ధం. ఎవరైనా రెండు ఓటరు కార్డులు ఉంటే అందులో ఒకదానిని వినియోగించుకొని ఇంకొక దానిని ఖచ్చితంగా రద్దు చేసుకోవాలి. -
యాదాద్రిలో నిజాయతీ చాటిన హోంగార్డు
[ 17-05-2024]
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ భద్రతా సిబ్బందిలో హోంగార్డు నిజాయతీ వల్ల ఓ కుటుంబం విలువైన వస్తువులను దక్కించుకోగలిగారు. -
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
[ 17-05-2024]
తీవ్రమైన కడుపు నొప్పి భరించలేక రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయినిగూడ-నల్గొండ రైల్వే పరిధిలో గురువారం చోటు చేసుకుంది. రైల్వే హెడ్కానిస్టేబుల్ రజిత తెలిపిన వివరాల ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే