అతిథులు తరలొచ్చె.. బూర పూరించె..!
ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు.
కలెక్టరేట్లో కేంద్ర మంత్రి జైశంకర్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, శాసనసభాపక్ష నేత ఎ.మహేశ్వర్రెడ్డి,
పార్టీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లుతో కలిసి రిటర్నింగ్ అధికారి హన్మంత్ కె. జెండగేకు
మరో సెట్టు నామపత్రం సమర్పిస్తున్న భువనగిరి నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్
భువనగిరి, న్యూస్టుడే: ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. ప్రతి విషయాన్ని మతంతో ముడిపెడుతూ ఒక వర్గం మెప్పు కోసం పాకులాడే కాంగ్రెస్ పార్టీ భాజపా మత రాజకీయాలు చేస్తుందని ఆరోపించడం సరికాదన్నారు. భువనగిరి లోక్సభ భాజపా అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ నామినేషన్ పురస్కరించుకుని మంగళవారం అట్టహాసంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్థానిక వినాయక చౌరస్తాలో రోడ్షోలో ఆయన ప్రసంగించారు. ముస్లింల ఓట్ల కోసం మజ్లిస్ పార్టీకి రేవంత్రెడ్డి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఆయా పార్టీలకు గుణపాఠం చెప్పాలని కోరారు. డాక్టర్గా వృత్తిలో రాణిస్తూ, మాజీ ఎంపీగా ఈ ప్రాంత అభివృద్ధికి సేవలు అందించిన డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ను లోక్సభకు పంపి మోదీని తిరిగి ప్రధాని చేయాలన్నారు. భాజపా శాసనసభాపక్ష నేత ఎ.మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ..ఓటమి తప్పదన్న నిఘా వర్గాల హెచ్చరికతో ఉలిక్కిపడిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భాజపాపై విమర్శలు చేస్తున్నారన్నారు. భువనగిరిలో కూడా ఓటమి తప్పదని గ్రహించి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఇంటికి పరుగులు తీసి పొగడ్తలతో ముంచుతున్నాడన్నారు. అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. ధనం, అధికార అహంకారంతో తనను ఓడించేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ కుట్రచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భువనగిరి కోటపై కాషాయ జెండా ఎగరేస్తామన్నారు.
అభ్యర్థి నర్సయ్యగౌడ్ ఒక సెట్టు నామినేషన్ వేసినా.. భాజపా శ్రేణులు వెంటరాగా మరో సెట్టు నామపత్రాన్ని కేంద్ర మంత్రి జైశంకర్, డాక్టర్ లక్ష్మణ్, మహేశ్వరెడ్డితో కలిసి వేశారు. హైదరాబాద్ చౌరస్తా నుంచి భారీ ర్యాలీలో కోలాహాలంగా నామినేషన్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ రాష్ట్ర నాయకులు జి.మనోహర్రెడ్డి, చీకోటి ప్రవీణ్, జిల్లా నాయకులు దాసరి మల్లేశం, పీఎస్ రవీందర్, జనగాం, నల్గొండ, భువనగిరి జిల్లా అధ్యక్షులు దశరథరెడ్డి, వర్షిత్రెడ్డి, పాశం భాస్కర్, నాయకులు చందా మహేందర్గుప్తా, ఉట్కూరి అశోక్గౌడ్, పడాల శ్రీనివాస్, ఎన్నం శివకుమార్, నార్లకంటి మొగిలయ్య, జగన్మోహన్రెడ్డి, మాయ దశరథ, రత్నపురం బలరాం పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ పార్టీ స్పష్టతతో ఉంది: చామల కిరణ్ కుమార్ రెడ్డి
[ 03-05-2024]
ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టతతో ఉందని భువనగిరి లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. -
ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలి
[ 03-05-2024]
ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంత్ కే.జెండగే నోడల్ అధికారులకు సూచించారు. -
బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి
[ 03-05-2024]
భువనగిరి పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని భువనగిరి, ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన అదనపు బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంత్ కే.జెండగే తెలిపారు. -
అయ్యో పాపం ఆరుషి
[ 03-05-2024]
నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన ఐతగోని రవి, మమత దంపతుల కుమార్తె ఆరుషి(18 నెలల). -
రాగల తొమ్మిది రోజుల్లో..!
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారానికి మరో తొమ్మిది రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో ప్రధాన పార్టీలు ముమ్మర ప్రచారానికి సమాయత్తమవుతున్నాయి. -
అసెంబ్లీకి ఉత్సాహం.. లోక్సభకు తాత్సారం
[ 03-05-2024]
అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా తగ్గుతోంది. ఓటర్లలో అసెంబ్లీ ఎన్నికలకు ఉన్న ఆసక్తి లోక్సభ ఎన్నికలకు వచ్చే సరికి సడలిపోతోంది. -
చెరువును చెరబట్టి.. అక్రమంగా తవ్వేసి
[ 03-05-2024]
అక్రమార్కులు చెరువులపై పడ్డారు. తాటి చెట్టంత లోతుల్లో జేసీబీలతో తవ్వుతూ వందలాది వాహనాలతో మట్టి తరలిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో చెరువులు ఎండిపోవడం అక్రమార్కులకు కలిసొచ్చింది. -
ఇంటి వద్దే ఓటు..!
[ 03-05-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం పలు రకాల చర్యలు చేపడుతోంది. నడవలేని, పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని ఓటరు ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. -
అత్యధికం 2.72 లక్షలు.. అత్యల్పం 5 వేలు
[ 03-05-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గంలో ఆధిక్యతల తీరు పరిశీలిస్తే ఔరా అన్పించేలా ఉన్నాయి. నియోజకవర్గంలో మొదటిసారి ఎన్నికలు జరిగిన సమయంలో జాతీయ స్థాయి రికార్డును నెలకొల్పడంతో పార్లమెంటు భవనాన్ని -
ఎవరికి ఓటేశామో తెలుసుకోవచ్చు
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికలు ఈ నెల 13న జరుగనున్నాయి. ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత అభ్యర్థికి పడిందో లేదో వీవీప్యాట్ యంత్రంలో ఓటర్లు పరిశీలించవచ్చు. -
ఎవరికి ‘మూడు’ద్దో
[ 03-05-2024]
నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 2009లో భువనగిరి లోక్సభ స్థానం ఏర్పడింది. అప్పటి నుంచి మూడు సార్లు ఎన్నికలు జరగ్గా ఇంత భారీ సంఖ్యలో నామినేషన్లు పడలేదు. -
లాడ్జిలపై ఏదీ నిఘా?
[ 03-05-2024]
ప్రసిద్ధ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్టలో లాడ్జిల నిర్వహణ అధ్వానంగా మారింది. ఎవరు వస్తున్నారో.. ఎవరు పోతున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. -
విద్వేషాలు సృష్టిస్తున్న భాజపా: మంత్రి ఉత్తమ్
[ 03-05-2024]
మతాన్ని అడ్డు పెట్టుకొని భాజపా విద్వేషాలు సృష్టిస్తుందని, మరో అవకాశం ఇస్తే రిజర్వేషన్లకు తూట్లు పడతాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
వైద్యుల అర్హతలు బోర్డుల మీద బహిర్గతం చేయండి
[ 03-05-2024]
అర్హతలు లేకుండానే ఆస్పత్రుల్లో వైద్యం చేస్తున్న తీరుపై గత నెల 18న ‘నాడి తెలియని నకిలీలు’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. -
ఓటుకు నోటు కేసును ప్రభావితం చేస్తారేమో?
[ 03-05-2024]
భారాస అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై రెండు రోజుల నిషేధం విధించడం ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుట్రలో భాగమేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. -
ఆరుబయట నిద్రిస్తుండగా..చోరీ
[ 03-05-2024]
ఒకేరోజు రాత్రి తాళాలు వేసి ఉన్న నాలుగు ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన యాదాద్రిభువనగిరి జిల్లా గుండాల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్