బడికి నిధులు
యాదాద్రి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టనున్నారు.
కొలనుపాకలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల
ఆలేరు, న్యూస్టుడే: యాదాద్రి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ పూర్తి కావొచ్చింది. జిల్లాలో 712 పాఠశాలలు ఉండగా గతంలో 251 పాఠశాలల్లో మన ఊరు-మనబడి ప్రణాళికలో వివిధ పనులు చేపట్టారు. సుమారు 150 పాఠశాలల్లో పనులు చేపట్టగా మిగతా 101 పాఠశాలల్లో పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటి వరకు మౌలిక వసతులకు నోచుకోని పాఠశాలలు 583 ఉన్నట్లుగా గుర్తించారు.
చేపట్టనున్న పనులు..
ప్రధానంగా మరుగుదొడ్లు, బాలికల మూత్రశాలలు, విద్యుత్తు, తాగునీరు, తరగతి గదుల మరమ్మతులు చేపడతారు. మొదటి విడతగా మౌలిక వసతుల కల్పన, స్కూల్ యూనిఫాం కుట్టుకూలీ కోసం 25 శాతం నిధులు మంజూరు చేస్తారు. పాఠశాలలకు మంజూరైన నిధులను మొదటగా ఎంపీడీవోల ఖాతాల్లో జమ కానున్నాయి. పాఠశాలల్లో గరిష్ఠంగా రూ.14 లక్షలు, కనిష్ఠంగా రూ.1.35 లక్షలతో పనులు గుర్తించారు. అమ్మ ఆదర్శ కమిటీల తీర్మానం మేరకు పనులు చేపట్టనున్నారు.
నిధుల డ్రా ఇలా..
పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి మౌలిక వసతుల పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో బ్యాంకు ఖాతాలు తెరిపించారు. రూ.25వేల విలువైన పనులు చేపట్టిన అనంతరం అమ్మ ఆదర్శ కమిటీలు సమావేశమై నిధులను బ్యాంకు నుంచి తీయాల్సి ఉంటుంది. రూ.లక్ష వరకు అయితే ఎంపీడీవో అనుమతితో బ్యాంకు ఖాతా నుంచి తీయాల్సి ఉంటుంది. లక్ష రూపాయలకు పైబడి విలువైన పనులను చేపడితే జిల్లా మహిళా సమాఖ్యతో పాటు, జిల్లా ఉన్నతాధికారి అనుమతితో నిధులు డ్రా చేయాల్సి ఉంటుంది.
త్వరలో ప్రారంభిస్తాం
నారాయణరెడ్డి, డీఈవో, యాదాద్రి భువనగిరి
పాఠశాలల్లో అవసరమైన పనులకు సంబంధించి ప్రతిపాదనలు పూర్తయ్యాయి. త్వరలో పనులు ప్రాంభమవుతాయి. రానున్న విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అమ్మ ఆదర్శ కమిటీలతో చేపట్టనున్న పనులు పూర్తయితే పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు సమకూరుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ పార్టీ స్పష్టతతో ఉంది: చామల కిరణ్ కుమార్ రెడ్డి
[ 03-05-2024]
ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టతతో ఉందని భువనగిరి లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. -
ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలి
[ 03-05-2024]
ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంత్ కే.జెండగే నోడల్ అధికారులకు సూచించారు. -
బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి
[ 03-05-2024]
భువనగిరి పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని భువనగిరి, ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన అదనపు బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంత్ కే.జెండగే తెలిపారు. -
అయ్యో పాపం ఆరుషి
[ 03-05-2024]
నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన ఐతగోని రవి, మమత దంపతుల కుమార్తె ఆరుషి(18 నెలల). -
రాగల తొమ్మిది రోజుల్లో..!
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారానికి మరో తొమ్మిది రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో ప్రధాన పార్టీలు ముమ్మర ప్రచారానికి సమాయత్తమవుతున్నాయి. -
అసెంబ్లీకి ఉత్సాహం.. లోక్సభకు తాత్సారం
[ 03-05-2024]
అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా తగ్గుతోంది. ఓటర్లలో అసెంబ్లీ ఎన్నికలకు ఉన్న ఆసక్తి లోక్సభ ఎన్నికలకు వచ్చే సరికి సడలిపోతోంది. -
చెరువును చెరబట్టి.. అక్రమంగా తవ్వేసి
[ 03-05-2024]
అక్రమార్కులు చెరువులపై పడ్డారు. తాటి చెట్టంత లోతుల్లో జేసీబీలతో తవ్వుతూ వందలాది వాహనాలతో మట్టి తరలిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో చెరువులు ఎండిపోవడం అక్రమార్కులకు కలిసొచ్చింది. -
ఇంటి వద్దే ఓటు..!
[ 03-05-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం పలు రకాల చర్యలు చేపడుతోంది. నడవలేని, పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని ఓటరు ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. -
అత్యధికం 2.72 లక్షలు.. అత్యల్పం 5 వేలు
[ 03-05-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గంలో ఆధిక్యతల తీరు పరిశీలిస్తే ఔరా అన్పించేలా ఉన్నాయి. నియోజకవర్గంలో మొదటిసారి ఎన్నికలు జరిగిన సమయంలో జాతీయ స్థాయి రికార్డును నెలకొల్పడంతో పార్లమెంటు భవనాన్ని -
ఎవరికి ఓటేశామో తెలుసుకోవచ్చు
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికలు ఈ నెల 13న జరుగనున్నాయి. ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత అభ్యర్థికి పడిందో లేదో వీవీప్యాట్ యంత్రంలో ఓటర్లు పరిశీలించవచ్చు. -
ఎవరికి ‘మూడు’ద్దో
[ 03-05-2024]
నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 2009లో భువనగిరి లోక్సభ స్థానం ఏర్పడింది. అప్పటి నుంచి మూడు సార్లు ఎన్నికలు జరగ్గా ఇంత భారీ సంఖ్యలో నామినేషన్లు పడలేదు. -
లాడ్జిలపై ఏదీ నిఘా?
[ 03-05-2024]
ప్రసిద్ధ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్టలో లాడ్జిల నిర్వహణ అధ్వానంగా మారింది. ఎవరు వస్తున్నారో.. ఎవరు పోతున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. -
విద్వేషాలు సృష్టిస్తున్న భాజపా: మంత్రి ఉత్తమ్
[ 03-05-2024]
మతాన్ని అడ్డు పెట్టుకొని భాజపా విద్వేషాలు సృష్టిస్తుందని, మరో అవకాశం ఇస్తే రిజర్వేషన్లకు తూట్లు పడతాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
వైద్యుల అర్హతలు బోర్డుల మీద బహిర్గతం చేయండి
[ 03-05-2024]
అర్హతలు లేకుండానే ఆస్పత్రుల్లో వైద్యం చేస్తున్న తీరుపై గత నెల 18న ‘నాడి తెలియని నకిలీలు’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. -
ఓటుకు నోటు కేసును ప్రభావితం చేస్తారేమో?
[ 03-05-2024]
భారాస అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై రెండు రోజుల నిషేధం విధించడం ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుట్రలో భాగమేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. -
ఆరుబయట నిద్రిస్తుండగా..చోరీ
[ 03-05-2024]
ఒకేరోజు రాత్రి తాళాలు వేసి ఉన్న నాలుగు ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన యాదాద్రిభువనగిరి జిల్లా గుండాల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు