మాటలే తూటాలై..!
‘నల్గొండ జిల్లా సాగునీటి రంగానికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారు. బస్సు యాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా భారాసకు ఎవరూ ఓటేయరు.
‘నల్గొండ జిల్లా సాగునీటి రంగానికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారు. బస్సు యాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా భారాసకు ఎవరూ ఓటేయరు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన జగదీశ్రెడ్డికి 80 ఎకరాల ఫాంహౌస్, వందల కోట్లు ఎలా వచ్చాయో ప్రజలకు చెప్పాలి. కేసీఆర్, జగదీశ్రెడ్డి కలిసి నల్గొండ జిల్లాను నాశనం చేశారు.’
మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
ఇక్కడున్న ఒక మంత్రి రైతుబంధు అడిగితే రైతులను దుర్భాషలాడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయనకు కర్రుకాల్చి వాత పెట్టుడు ఖాయం. సీఎం రేవంత్, మంత్రులు ప్రతిపక్ష నాయకులను బూతులు తిట్టడం తప్పితే ఏం చేయడం లేదు. సాగర్ నీళ్లను ఏపీ తరలించుకుపోతే ఉమ్మడి జిల్లా మంత్రులు ఏం తెలియనట్లు వ్యవహరిస్తున్నారు.’
నామినేషన్ ర్యాలీలో మాజీ మంత్రి జగదీశ్రెడ్డి
ఈనాడు, నల్గొండ : లోక్సభ ఎన్నికల్లో కీలకపర్వమైన నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరుతున్న వేళ.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారాస మధ్య మాటలయుద్ధం తారస్థాయికి చేరుతోంది. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి భారాసతో పాటూ మాజీ మంత్రి జగదీశ్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు జగదీశ్రెడ్డి ఇద్దరు మంత్రులతో పాటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇటీవల భువనగిరిలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ సైతం మాజీ మంత్రిపై పలు విమర్శలు చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలో మంత్రులు, మాజీ మంత్రి మధ్య రాజకీయంగా మారింది.
అధికార పార్టీ నుంచి నల్గొండ లోక్సభకు మంత్రి ఉత్తమ్ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తుండగా..భువనగిరికి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి సమన్వయకర్తగా ఉన్నారు. ప్రతిపక్ష భారాస నుంచి రెండు లోక్సభ స్థానాలకు జగదీశ్రెడ్డియే ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం, మంత్రులపై భారాస ప్రధానంగా సాగర్ నుంచి ఏపీ నీటి తరలింపుతో పాటూ రైతుల కరవు, కష్టాల గురించి విమర్శలు చేస్తుండగా.. పదేళ్ల పాలనలో జిల్లాను నాశనం చేశారని అధికార పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునేందుకు రెండు పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.
కేసీఆర్ రాకతో పెరగనున్న వే‘ఢీ’
మిర్యాలగూడలో నేడు మాజీ సీఎం కేసీఆర్ బస్సుయాత్ర ప్రారంభం కానుంది. హైదరాబాద్ నుంచి బస్సులో చౌటుప్పల్, చిట్యాల, నల్గొండ మీదుగా మిర్యాలగూడ చేరుకోనున్న మాజీ సీఎం సాయంత్రం మిర్యాలగూడ, అనంతరం సూర్యాపేటలో రోడ్షో చేయనున్నారు. ఈ యాత్రలో భారీగా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొనేలా భారాస ఏర్పాట్లు చేస్తోంది. లోక్సభ పరిధిలోని నియోజకవర్గాల నుంచి రెండు ప్రాంతాల్లో పాల్గొనేలా జనసమీకరణ చేస్తున్నారు. మరోవైపు ఇదే రోజు నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్రెడ్డి నామినేషన్ సందర్భంగా కాంగ్రెస్ మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డితో పాటూ జానారెడ్డి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి అధికార పార్టీ సైతం భారీ ఏర్పాట్లు చేస్తోంది. భారీ జనసమీకరణ చేసి తమ సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో ఉమ్మడి జిల్లాలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో యాత్ర సందర్భంగా కేసీఆర్ ఏం మాట్లాడుతారనే ఉత్కంఠ నెలకొంది. రెండు స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో భాజపా సైతం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా కేంద్ర మంత్రులు హాజరుకాగా.. త్వరలోనే కేంద్ర పథకాలు, మోదీ మేనియాతో ప్రజల్లోకి ఉద్ధృతంగా వెళ్లాలని భావిస్తోంది. మొత్తంగా పోలింగుకు మరో 20 రోజులు ఉండగానే మూడు పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ పార్టీ స్పష్టతతో ఉంది: చామల కిరణ్ కుమార్ రెడ్డి
[ 03-05-2024]
ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టతతో ఉందని భువనగిరి లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. -
ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలి
[ 03-05-2024]
ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంత్ కే.జెండగే నోడల్ అధికారులకు సూచించారు. -
బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి
[ 03-05-2024]
భువనగిరి పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని భువనగిరి, ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన అదనపు బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంత్ కే.జెండగే తెలిపారు. -
అయ్యో పాపం ఆరుషి
[ 03-05-2024]
నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన ఐతగోని రవి, మమత దంపతుల కుమార్తె ఆరుషి(18 నెలల). -
రాగల తొమ్మిది రోజుల్లో..!
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారానికి మరో తొమ్మిది రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో ప్రధాన పార్టీలు ముమ్మర ప్రచారానికి సమాయత్తమవుతున్నాయి. -
అసెంబ్లీకి ఉత్సాహం.. లోక్సభకు తాత్సారం
[ 03-05-2024]
అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా తగ్గుతోంది. ఓటర్లలో అసెంబ్లీ ఎన్నికలకు ఉన్న ఆసక్తి లోక్సభ ఎన్నికలకు వచ్చే సరికి సడలిపోతోంది. -
చెరువును చెరబట్టి.. అక్రమంగా తవ్వేసి
[ 03-05-2024]
అక్రమార్కులు చెరువులపై పడ్డారు. తాటి చెట్టంత లోతుల్లో జేసీబీలతో తవ్వుతూ వందలాది వాహనాలతో మట్టి తరలిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో చెరువులు ఎండిపోవడం అక్రమార్కులకు కలిసొచ్చింది. -
ఇంటి వద్దే ఓటు..!
[ 03-05-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం పలు రకాల చర్యలు చేపడుతోంది. నడవలేని, పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని ఓటరు ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. -
అత్యధికం 2.72 లక్షలు.. అత్యల్పం 5 వేలు
[ 03-05-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గంలో ఆధిక్యతల తీరు పరిశీలిస్తే ఔరా అన్పించేలా ఉన్నాయి. నియోజకవర్గంలో మొదటిసారి ఎన్నికలు జరిగిన సమయంలో జాతీయ స్థాయి రికార్డును నెలకొల్పడంతో పార్లమెంటు భవనాన్ని -
ఎవరికి ఓటేశామో తెలుసుకోవచ్చు
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికలు ఈ నెల 13న జరుగనున్నాయి. ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత అభ్యర్థికి పడిందో లేదో వీవీప్యాట్ యంత్రంలో ఓటర్లు పరిశీలించవచ్చు. -
ఎవరికి ‘మూడు’ద్దో
[ 03-05-2024]
నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 2009లో భువనగిరి లోక్సభ స్థానం ఏర్పడింది. అప్పటి నుంచి మూడు సార్లు ఎన్నికలు జరగ్గా ఇంత భారీ సంఖ్యలో నామినేషన్లు పడలేదు. -
లాడ్జిలపై ఏదీ నిఘా?
[ 03-05-2024]
ప్రసిద్ధ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్టలో లాడ్జిల నిర్వహణ అధ్వానంగా మారింది. ఎవరు వస్తున్నారో.. ఎవరు పోతున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. -
విద్వేషాలు సృష్టిస్తున్న భాజపా: మంత్రి ఉత్తమ్
[ 03-05-2024]
మతాన్ని అడ్డు పెట్టుకొని భాజపా విద్వేషాలు సృష్టిస్తుందని, మరో అవకాశం ఇస్తే రిజర్వేషన్లకు తూట్లు పడతాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
వైద్యుల అర్హతలు బోర్డుల మీద బహిర్గతం చేయండి
[ 03-05-2024]
అర్హతలు లేకుండానే ఆస్పత్రుల్లో వైద్యం చేస్తున్న తీరుపై గత నెల 18న ‘నాడి తెలియని నకిలీలు’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. -
ఓటుకు నోటు కేసును ప్రభావితం చేస్తారేమో?
[ 03-05-2024]
భారాస అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై రెండు రోజుల నిషేధం విధించడం ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుట్రలో భాగమేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. -
ఆరుబయట నిద్రిస్తుండగా..చోరీ
[ 03-05-2024]
ఒకేరోజు రాత్రి తాళాలు వేసి ఉన్న నాలుగు ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన యాదాద్రిభువనగిరి జిల్లా గుండాల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన స్టార్క్.. ముంబయిపై కోల్కతా విజయం
-
119 కోట్లకు టెలికాం సబ్స్క్రైబర్లు.. జియోకు ఎంతమందంటే?
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు