కార్మికులకు కలిసొచ్చే కాలమే..!
‘మూఢం’ వచ్చేసింది.. పెళ్లిళ్లు, పేరంటాళ్లు, శుభకార్యాలకు అంతరాయం ఏర్పడింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని ‘మూఢం’గా పండితులు పరిగణిస్తారు.
నాంపల్లి, న్యూస్టుడే: ‘మూఢం’ వచ్చేసింది.. పెళ్లిళ్లు, పేరంటాళ్లు, శుభకార్యాలకు అంతరాయం ఏర్పడింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని ‘మూఢం’గా పండితులు పరిగణిస్తారు. గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినపుడు గురుమౌఢ్యంగా, శుక్రగ్రహం సూర్యగ్రహానికి దగ్గరగా వచ్చినపుడు శుక్ర మౌఢ్యంగా పిలుస్తారు. ఈ కాలాన్ని ఏవైనా పనులు ప్రారంభించడానికి అశుభంగా భావిస్తూ వాయిదా వేస్తుంటారు. ఏప్రిల్ నెల 27 నుంచి ఆగస్టు 8 వరకు ‘మూఢం’ ఉంటుందని పండితులు చెబుతున్నారు. కానీ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన లోక్సభ ఎన్నిక ఇదే సమయంలో వచ్చేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా అరంగేట్రం చేసి రాజకీయ భవిష్యత్తు పరీక్షించుకునే యువ నాయకులు, గత రాజకీయ భవిష్యత్తును గణనీయంగా కోల్పోయిన అగ్రజులు, పాత పార్టీలో ఇమడలేక పార్టీలు మార్చే నేతలకు ఈ కాలం కలిసొచ్చేనా అనే సందేహాలు వేధిస్తున్నాయి.
శుభకార్యాలకు విరామం.. ప్రచారం ఆరంభం
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆశావహ నేతలందరూ ఓట్ల కోసం తమ అభిమానులు, అనుచరులకు సంబంధించి అన్ని శుభకార్యాలకూ హాజరవుతూ వస్తున్నారు. ప్రస్తుతం ‘మూఢం’ రావడంతో వాటికి బ్రేక్ పడింది. ఇక మిగిలిందల్లా ఎన్నికల ప్రచారం, ఊరేగింపులు, ర్యాలీలు, బహిరంగ సభలు, తదితర జనసమ్మర్ధ కార్యక్రమాల్లోనే ఓటర్లను మూకుమ్మడిగా ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఓటరు మహాశయులను కలవాలంటే శుభకార్యాలకు బదులుగా పుట్టినరోజు వేడుకలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునే ఆత్మీయ సమ్మేళనాలవంటి సందర్భాలు సృష్టించుకోవాల్సిందే.
- మే 13న లోక్సభ ఎన్నికలు, ఆ వెంటనే గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు ఎన్నికలు జరగనుండటంతో శుభకార్యాలకు అడ్డొచ్చిన ‘మూఢం’ కాస్తా.. కష్టం చేసుకునే కార్మికులకు కలిసొచ్చేలా ఉంది. శుభకార్యాలకు పనిచేసే వృత్తుల వారికి ఈ ఎన్నికలతో ఉపశమనం లభించనుంది. ముఖ్యంగా వివిధ పార్టీల ప్రచారం కోసం, టిఫిన్లు, భోజనాల తయారుతో పాటు విజయోత్సవాల నిర్వహణ వంటి కార్యక్రమాలకు ఎంతో మంది కూలీల అవసరం ఉంటుంది. నాయకుడు ఊరేగింపులో మేళతాళాలు వాయించే వారి నుంచి డీజే, లైటింగ్, జెండాలు పట్టే వారు, నృత్యాలు, కోలాటాలు, బ్యానర్లు కట్టే వారు, జెండాలు మోసే వారు, వంటా వార్పు, వడ్డింపులు, కూలీలు ఇలా అన్ని రంగాల్లో పని చేసే కార్మికులకు పని చూపదనుకున్న ఈ ‘మూఢం’ కాస్త ఎన్నికల పుణ్యమాని ఊరటనివ్వనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలి
[ 20-05-2024]
ఎం.ఎల్.సి ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే సెక్టార్ ఆఫీసర్లకు, టీములకు సూచించారు. -
యాదాద్రీశుడి జయంత్యుత్సవాలకు శ్రీకారం
[ 20-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో నారసింహుడు జయంత్యుత్సవాలు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా సోమవారం ఉదయం మొదలయ్యాయి. -
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసన మండలి(ఎమ్మెల్సీ) నియోజకవర్గానికి ఈ నెల 27న ఉపఎన్నిక జరగనుంది. -
గృహజ్యోతిపై భానుడి ప్రతాపం
[ 20-05-2024]
భానుడు గత పది సంవత్సరాల ఉష్ణోగ్రత రికార్డును అధిగమించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. -
డిగ్రీ విద్యార్థులకు దోస్త్
[ 20-05-2024]
ఇంటర్లో ఆయా కోర్సులు పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది చేరేది డిగ్రీ. తెలంగాణ ప్రభుత్వం కొన్నేళ్లుగా డిగ్రీలో ప్రవేశాలకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) వెబ్సైట్’ను ప్రారంభించింది. -
మరోసారి గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్
[ 20-05-2024]
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కీలకమైందని, పట్టభద్రులు విజ్ఞతతో ఓటేసి నిజాయతీ గల భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని శాసన మండలికి పంపాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. -
దర్జీగా.. ఇక దర్జాగా..!
[ 20-05-2024]
మహిళలు ఆర్థిక సాధికారత పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడులు మహిళలకు అప్పగించింది. -
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
రాష్ట్రానికి ఈ సారి ముందస్తుగా రుతు పవనాలు చేరుకుంటాయని, వర్షాలు కూడా గత ఏడాది కంటే ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. -
పట్టభద్రుల ఉప ఎన్నికకు రంగం సిద్ధం
[ 20-05-2024]
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. -
పదికి సంసిద్ధత
[ 20-05-2024]
తొమ్మిదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను రాబోయే 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పదో తరగతికి సంసిద్ధులను చేస్తోంది జిల్లా విద్యాశాఖ. -
అరచేతిలో పుస్తక ప్రపంచం
[ 20-05-2024]
పిల్లల్లో పఠనాసక్తిని పెంచేందుకు లిటరసీ క్లౌడ్ కార్యక్రమాన్ని విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. -
మోదీ పాలనలో కుంభకోణాలు లేవు: ఈటల
[ 20-05-2024]
భాజపా పదేళ్ల పాలనలో దేశంలో ఎలాంటి కుంభకోణాలు లేకుండా మోదీ పరిపాలించారని మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి: మంత్రి ఉత్తమ్
[ 20-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
ఎర్లీబర్డ్తో ఖజానాకు కాసులు
[ 20-05-2024]
పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్లు పెంచేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
[ 20-05-2024]
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడెం స్టేజీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
విమాన సర్వీసు రద్దు.. రేణిగుంట ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన
-
మీ సపోర్ట్కు థ్యాంక్స్.. అభిమానులపై ఎన్టీఆర్ స్పెషల్ పోస్ట్
-
సీఎం సోదరుడి ఓటు గల్లంతు..
-
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్
-
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం: ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం
-
హీరో- హార్లే భాగస్వామ్యంలో మరిన్ని మోటార్ సైకిల్స్