logo

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేస్తున్నాం

పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేస్తున్నామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి హన్మంత్ కే జెండగే అన్నారు.

Updated : 30 Apr 2024 15:43 IST

భువనగిరి: పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేస్తున్నామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి హన్మంత్ కే జెండగే అన్నారు. మంగళవారం డీసీపీ రాజేష్ చంద్రతో కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 61మంది నామినేషన్ వేయగా.. పోటీలో 39 మంది నిలిచారని పేర్కొన్నారు. ఫలితాల లెక్కింపు భువనగిరి ఆరోరా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా 245 టీమ్‌లుగా విభజించి కోడ్ ఉల్లంఘనకు గురికాకుండా చూస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గ కేంద్రాలతో కలిపి రూ. 9 కోట్ల 43 వేల నగదు, మద్యం సీజ్ చేశామన్నారు. సమావేశంలో తదితర అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని