రూ.7.20 లక్షల ఆర్థిక సాయం అందజేత
చౌటుప్పల్లో నివాసముండే కోతులాపురానికి చెందిన ఏనుగు భూపాల్రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితం అయ్యాడు.
చెక్కును అందిస్తున్న ప్రవాస భారతీయుడు వంశీధర్రెడ్డి, మిత్రులు
చౌటుప్పల్, న్యూస్టుడే: చౌటుప్పల్లో నివాసముండే కోతులాపురానికి చెందిన ఏనుగు భూపాల్రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితం అయ్యాడు. ఇద్దరు కుమారులు రాంరెడ్డి, లక్ష్మారెడ్డిల చదువు ఆగిపోయే పరిస్థితి ఉందని ‘దాతలు స్పందించాలి..చేయూత అందించాలి’ అనే శీర్షికతో ‘ఈనాడు’లో 2023 సెప్టెంబరు 27న కథనం ప్రచురితమైంది. కథనానికి అమెరికాలోని డల్లాస్లో నివాసముండే ప్రవాస భారతీయులు వంశీధర్రెడ్డి, కోడూరు కృష్ణారెడ్డిలు స్పందించారు. హైదరాబాద్ నివాసి కేవీరెడ్డి సహకారంతో గుడిమల్కాపురానికి చెందిన మన్నె నర్సింహారెడ్డి అందించిన వివరాలతో ‘గో ఫండ్ మీ’ సంస్థ ద్వారా రూ.3,53,000 విరాళాలు సేకరించారు. ఆ చెక్కును వరంగల్ ఎన్ఐటీలో విద్యాభ్యాసం చేస్తున్న ఏనుగు రాంరెడ్డికి సోమవారం అందజేశారు. సోదరులు రాంరెడ్డి, లక్ష్మారెడ్డిల ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసేందుకు ఈ డబ్బు వినియోగించాలని, భవిష్యత్తులో వారి చదువుకు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. అంతకు ముందు ‘ఈనాడు’లో కథనానికి స్పందించిన పలువురు దాతలు తమకు తోచినంత ఫోన్పే, గూగుల్ పే ద్వారా పంపిన ఆర్థిక సహాయం రూ.3,67,000 పోగయింది. ఈ డబ్బును పిల్లల చదువులు నిల్చిపోకుండా భూపాల్రెడ్డి వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు కుమారులు రాంరెడ్డి, లక్ష్మారెడ్డిలు ఒకరు వరంగల్, మరొకరు కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం ‘ఎన్ఐటీ’ల్లో సీట్లు సాధించారు. డబ్బులేక చదువు ఆగిపోయి.. భవిష్యత్తు అంధకారం అవుతుందేమోనని కుమిలిపోతున్న సమయంలో దాతలు అందించిన రూ.7.20 లక్షలు ఆర్థిక సాయంతో నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేస్తామనే భరోసా ఏర్పడిందని, దాతలకు, ‘ఈనాడు’కు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లింక్ నొక్కారంటే.. డబ్బు మాయం
[ 21-05-2024]
నేడు స్మార్ట్ఫోన్ వినియోగం పెరిగింది. డిజిటల్ లావాదేవీలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సైబర్ మోసాలు జోరుగా సాగుతున్నాయి. అందరినీ బురిడీ కొట్టించేలా ఫోన్కాల్స్ చేయడం, -
నల్గొండ జిల్లాలో అనుమతులు.. సూర్యాపేట పరిధిలో తవ్వకాలు
[ 21-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఇసుక పాలసీపై ఇప్పటివరకు ఒక విధాన నిర్ణయం తీసుకోలేదు. దీంతో కొన్నిచోట్ల పాత పద్ధతి ప్రకారం రీచ్ల నుంచి ఇసుక తరలింపునకు జిల్లా ఉన్నతాధికారులు అనుమతులు ఇస్తున్నారు. -
సభ్యత్వం పేరుతో వసూళ్లు
[ 21-05-2024]
వారందరూ పేద కుటుంబాల వారే. మత్స్య కార్మిక సంఘంలో పేరు నమోదు చేసుకుంటే మేలు జరుగుతుందన్న ఆశ వారిది. వారి ఆశను ఆసరాగా చేసుకుని కొందరు సభ్యత్వ నమోదు పేరిట వసూళ్లకు పాల్పడ్డారు. -
భారత్ను అగ్రస్థానంలో నిలిపిన మోదీ: ఈటల
[ 21-05-2024]
నిర్మాణ రంగంలో భారతదేశాన్ని ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలిపిన ఘనత ప్రధాని నరేంద్రమోదీదే అని మాజీ మంత్రి ఈటల రాజేందర్, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్లు అన్నారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, లెక్కింపునకు ఏర్పాట్లు చేయాలి: ఆర్వో
[ 21-05-2024]
వరంగల్ -ఖమ్మం -నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్, లెక్కింపునకు తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్సీ ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు. -
పునరావాసం లేదాయె.. కొలువు రాదాయె..!
[ 21-05-2024]
యాదాద్రి అల్ట్రా మెగా సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంటు (వైటీపీఎస్) నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన కొంతమంది నిర్వాసితులకు ఇప్పటి వరకు పరిహారం అందకపోవడంతో బతుకుదెరువు కోసం వారు కూలీలుగా జీవిస్తున్నారు. -
గెలుపుతో భారాసలో ధైర్యం నింపాలి: జగదీశ్రెడ్డి
[ 21-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో ధైర్యం నింపేందుకు నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి కోరారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల భారాస సన్నాహక సమావేశంలో మాట్లాడారు. -
నకిలీ విత్తన విక్రేతలపై ఉక్కుపాదం
[ 21-05-2024]
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ముందస్తుగానే వానలు కురిసే అవకాశం ఉండటంతో రైతులు నాణ్యమైన విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: హరీశ్రావు
[ 21-05-2024]
ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో ఉపాధ్యాయులపై లాఠీఛార్జీలు జరిగాయని.. నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులను సీఎం రేవంత్రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. -
ప్రాణం తీసిన అనుమానం
[ 21-05-2024]
భార్యపై అనుమానంతో భర్త కర్రతో చితక బాదడంతో తీవ్ర గాయాలు కాగా ఆమెను చికిత్స కోసం తరలించగా అప్పటికే మృతిచెందారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
స్టార్ హీరోయిన్ ఎదురుగా ఉన్నా.. తనపనిలో నిమగ్నమై: నెట్టింట్లో వైరల్గా డెలివరీ బాయ్
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ జట్లు.. ఈ కామన్ పాయింట్ గమనించారా?
-
జగన్ కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులే: బొండా ఉమ
-
ఓటీటీలోకి విశాల్ ‘రత్నం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
అబద్ధాలు చెప్పడం భారాస నేతలకు అలవాటు: భట్టి విక్రమార్క
-
వరల్డ్కప్ స్క్వాడ్ సభ్యులు లేకుండా.. ఐపీఎల్ టాప్-2 జట్లా?