logo

6న నల్గొండలో నడ్డా సభ: సైదిరెడ్డి

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6న నల్గొండలోని మేకల అభినవ్‌ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో భాజపా జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా పాల్గొంటారని ఆ పార్టీ నల్గొండ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తెలిపారు.

Published : 05 May 2024 04:28 IST

నీలగిరి, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6న నల్గొండలోని మేకల అభినవ్‌ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో భాజపా జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా పాల్గొంటారని ఆ పార్టీ నల్గొండ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టార్‌ క్యాంపెయిన్‌లో భాగంగా నల్గొండలో సభ నిర్వహిస్తున్నామన్నారు. నల్గొండ నియోజక వర్గంలో తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై రోడ్డుషోలో పాల్గొంటారని తెలిపారు. యువత, మహిళలు, వ్యవసాయ రంగం అభివృద్ధితో పాటు కృష్ణానది జలాలను కాపాడుకోవడానికి తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు మా అభ్యర్థి లక్షల మెజార్టీతో గెలుస్తారనే చెబుతున్నారే తప్పా.. ఓడిపోతే రాజీనామ చేస్తామని ఎందుకు చెప్పడంలేదని ప్రశ్నించారు. మీరు చేసిన అభివృద్ధి ఎక్కడ ఉందో చర్చించడానికి బహిరంగంగా రావాలని మంత్రులకు సవాల్‌ చేశారు. 6న జరిగే నిర్వహించే సభకు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.  భాజపా జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ నాగం వర్షిత్‌రెడ్డి, నూకల నర్సింహారెడ్డి, కన్మంతరెడ్డి శ్రీదేవి రెడ్డి, బండారు ప్రసాద్‌, పిల్లి రామరాజు యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని