నేటి నుంచి ఈవీఎంల కమీషనింగ్
ఎన్నికల పర్వంలో మరో కీలక ఘట్టమైన ఈవీఎంల కమీషనింగ్ (బ్యాలెట్ కాగితం అమర్చడం, నమూనా పోలింగ్) ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది.
మిర్యాలగూడ పట్టణం, న్యూస్టుడే: ఎన్నికల పర్వంలో మరో కీలక ఘట్టమైన ఈవీఎంల కమీషనింగ్ (బ్యాలెట్ కాగితం అమర్చడం, నమూనా పోలింగ్) ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈసీఐఎల్ ఇంజినీర్ల పర్యవేక్షణలో అభ్యర్థులు, వారి ఏజెంట్ల ఆధ్వర్యంలో కమీషనింగ్ ప్రక్రియ చేపడతారు. ఈ ప్రక్రియ ఆది, సోమవారాల్లో కొనసాగనుంది. ఈవీఎంలో భాగాలైన బ్యాలెట్ యూనిట్కు 4, కంట్రోల్ యూనిట్కు 3, వీవీ ప్యాట్కు 3 చొప్పున పోలింగ్ కేంద్రం చిరునామా ట్యాగులను అమర్చడం ద్వారా ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
యంత్రాలు సిద్ధం..
కమీషనింగ్ ప్రక్రియలో భాగంగా ఈసీఐఎల్ ఇంజినీర్లు వీవీ ప్యాట్లో బ్యాటరీ, పేపర్ రోల్ అమర్చి గుర్తులను లోడ్ చేస్తారు. అనంతరం ప్రింట్ను ఎన్నికల అధికారులు, సహాయ అధికారులు పరిశీలిస్తారు. దీని తర్వాత బ్యాలెట్ యూనిట్లోని పరికరాలన్నీ అసలైనవేనని ఇంజినీర్లు నిర్ధారిస్తారు. ప్రతి బ్యాలెట్ కాగితం వెనుక వైపు ఆర్వో సంతకం చేసి బ్యాలెట్ యూనిట్లోని తెరను తెరచి జాగ్రత్తగా కాగితాన్ని అమర్చుతారు. అనంతరం వాటికి సీల్ వేస్తారు. దీని తర్వాత కంట్రోల్ యూనిట్లోనూ బ్యాటరీని అమర్చుతారు.
ఒక్కొక్కరికి ఒక్కో ఓటు..
అనంతరం కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్లను సక్రమంగా అనుసంధానం చేస్తారు. కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆన్ చేసి.. నమూనా పోలింగ్కు సిద్ధం చేస్తారు. నమూనా పోలింగ్లో భాగంగా ప్రతి అభ్యర్థితో పాటు నోటాకు సైతం ఒక ఓటు చొప్పున వేస్తారు. అనంతరం సీయూ, వీవీ ప్యాట్లోని ఫలితాలను పోల్చి చూస్తారు. అనంతరం నమూనా పోలింగ్ డాటాను, వీవీ ప్యాట్లోని చిట్టీలను తొలగిస్తారు. కంట్రోల్ యూనిట్ను స్వీచ్ ఆఫ్ చేసి.. పేపర్ రోల్ను లాక్ చేసి.. వీవీ ప్యాట్తో అనుసంధానాన్ని తొలగిస్తారు.
అధిక మొత్తంలో నమూనా పోలింగ్..
అన్ని యంత్రాలను చిరునామా ట్యాగ్లతో సీల్ చేసి.. మొత్తం ఈవీఎంలలోని యంత్రాలలో వెయ్యి ఓట్లతో నమూనా పోలింగ్ కోసం యాధృచ్ఛికంగా 5 శాతం యంత్రాలను ఎంపిక చేస్తారు. వాటిలోని కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ల నుంచి నమూనా పోలింగ్ డాటాను తొలగిస్తారు. మళ్లీ కొత్తగా బ్యాటరీలు, పేపర్ రోల్లు అమర్చి.. వెయ్యి ఓట్లతో అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో నమూనా పోలింగ్ నిర్వహిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కార్పొరేట్ వాకిటకు..సర్కారు సౌరభం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్ విద్యకు సహకారం అందిస్తోంది. -
పరిశ్రమలు 900.. అధికారులు ఐదుగురు
[ 18-05-2024]
రసాయన, ఇతర పరిశ్రమల నుంచి వచ్చే ప్రమాదకర వ్యర్థాలను జాగ్రత్తగా నిర్వీర్యం చేయాలి. ఎక్కడ పడితే అక్కడ పారబోస్తే భూగర్భ జలాలు కలుషితం కావడంతో పాటు ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. -
ప్రముఖుల పల్లెల్లో..ప్రజాస్వామ్యం మురిసె
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్లో ప్రముఖుల పల్లెల్లో ఓటు చైతన్యం వెల్లివిరిసింది. ఈ గ్రామాలకు చెందిన నేతలు ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా సేవలు అందించడంతో పాటు ఇతర ముఖ్యులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేవిధంగా పల్లెవాసులు వారిని ప్రోత్సహించారు. -
చలో.. నెల్లిబండ గట్టు జాతర
[ 18-05-2024]
వందల ఏళ్ల చరిత్ర.. రెండేళ్లకోసారి జాతర.. వేలాది మంది భక్తుల రాక.. ఉమ్మడి జిల్లాలో దురాజ్పల్లి పెద్దగట్టు తర్వాతి స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న చిన్నగట్టు జాతరకు నెల్లిబండ ముస్తాబైంది. -
పట్టభద్రులకు పోల్ చిట్టీలు
[ 18-05-2024]
వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రధాన పార్టీల తరఫున బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. -
పెరిగిన పోలింగ్.. ఎవరికి లాభించేనో?
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల క్రతువు ఇటీవలే ముగిసింది. అందరి దృష్టి భువనగిరి లోక్సభ పైనే ఉంది. ఇక్కడ గతంలో కంటే పోలింగ్ శాతం పెరగడంతో ఇది ఎవరికి లాభిస్తుందనే విషయమై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.. అందనున్న ప్రత్యేక సేవలు
[ 18-05-2024]
సాధారణ సేవలకు మాత్రమే పరిమితమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పల్లెదవాఖానాల్లో అదనంగా ఏడు రకాల వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాల వాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
అమ్మ అంత్యక్రియలకు అడ్డంకిగా ఆస్తి
[ 18-05-2024]
అమ్మ అంత్యక్రియలకు ఆస్తి పంపకం అడ్డంకిగా మారిన ఉదంతమిది. కన్నతల్లి అంత్యక్రియలు తమ బాధ్యత అనే విషయాన్ని మరిచి ఆ కుటుంబ సభ్యులు రెండు రోజులుగా ఆస్తి పంపకం విషయమై గ్రామపెద్దలతో ఎడతెగని చర్చలు జరిపారు -
ఆ చేపల పులుసు..మనసులు గెలుచు
[ 18-05-2024]
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: బూర
[ 18-05-2024]
పార్లమెంట్ ఎన్నికల స్ఫూర్తితో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు పనిచేయాలని భాజపా ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్, జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ కోరారు -
కలవరపెడుతున్న క్షయ
[ 18-05-2024]
క్షయ వ్యాధి కలవరపెడుతోంది. జిల్లాలో ప్రతి సంవత్సరం వ్యాధి బారినపడేవారు సంఖ్య పెరుగుతోంది. -
ఈసారైనా సీసీ లైనింగ్కు గ్రీన్సిగ్నల్ వచ్చేనా..?
[ 18-05-2024]
నల్గొండ జిల్లాలో 2.20 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఏఎంఆర్పీ) ప్రధాన కాల్వకు సిమెంటు కాంక్రీటు(సీసీ) లైనింగ్ చేసే పనులకు ఈ సారైనా ప్రభుత్వం పచ్చజెండా ఊపుతుందా..
తాజా వార్తలు (Latest News)
-
ధోనీకిదే చివరి సీజనా? విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
-
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
-
స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్
-
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప