జనన, మరణ ధ్రువపత్రాల జారీ సులువే
జనన, మరణ ధ్రువపత్రాల కోసం పట్టణవాసుల ఇక్కట్లు దూరమయ్యాయి. 24 గంటల వ్యవధిలోనే అందించేలా గతంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తోంది.
ఆలేరు పురపాలిక నుంచి నూతన విధానంలో జారీ అయిన జనన ధ్రువ పత్రం
ఆలేరు, న్యూస్టుడే: జనన, మరణ ధ్రువపత్రాల కోసం పట్టణవాసుల ఇక్కట్లు దూరమయ్యాయి. 24 గంటల వ్యవధిలోనే అందించేలా గతంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తోంది. పత్రాలు పొందేందుకు పురపాలికల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోయింది. ఒక్క రోజులోనే ఆయా పత్రాలను మీసేవా కేంద్రాల ద్వారా పొందవచ్చు. జనన, మరణ ధ్రువపత్రాల జారీకి ఉమ్మడి జిల్లాలోని 500 ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేటు ఆసుపత్రులను ఎంపిక చేసింది. వీటికి రాష్ట్ర పురపాలక పరిపాలనా విభాగం వేర్వేరు యూజర్ నేమ్, పాస్వర్డులు ఇచ్చింది. దీంతో పాటు 400లకు పైగా హిందూ, ముస్లిమ్, క్రైస్తవ శ్మశాన వాటికల నిర్వాహకులు, కాటికాపర్లను గుర్తించి ప్రత్యేక యాప్లను డౌన్లోడ్ చేసిన స్మార్ట్ఫోన్లను అందజేశారు. 2022 మార్చిలో ప్రారంభమైన ఈ విధానంలో ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో సుమారు 10 వేలకు పైగా జనన, మరణ ధ్రువపత్రాలు జారీ అయ్యాయి.
జనన ధ్రువపత్రం ఇలా..
ఆసుపత్రులలో శిశువులు జన్మించిన 24 గంటల వ్యవధిలో ఆసుపత్రుల అధికారులు, నిర్వాహకులు యూజర్ నేమ్, పాస్వర్డ్ల ద్వారా శిశువు, తల్లిదండ్రుల వివరాలను అప్లోడ్ చేస్తారు. ఆ వెంటనే సంబంధిత చరవాణికి సంక్షిప్త సందేశం, లింక్ వస్తుంది. లింక్ను క్లిక్ చేస్తే తాత్కాలిక జనన ధ్రువపత్రం ఆన్లైన్ ద్వారా పొందవచ్చు. పుట్టిన శిశువు ఏడాది లోపు పేరుపెట్టిన అనంతరం తిరిగి ఆ లింక్లోనే పేరుతో సహా అవసరమై వివరాలను అప్లోడ్ చేసి తిరిగి పూర్తిస్థాయి జనన ధ్రువపత్రం పొందవచ్చు. అనుకోని పరిస్థితుల్లో ఇంటివద్ద, ఇతర ప్రాంతాల్లో సాధారణ కాన్పులు జరిగితే ఇతర చికిత్సల కోసం వెళ్లిన ఆసుపత్రుల ద్వారా జనన వివరాలను అప్ లోడ్ చేసి జనన ధ్రువపత్రాల పొందవచ్చు.
ప్రత్యేక యాప్..
మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో శ్మశానవాటికల నిర్వాహకులు లేదా కాటికాపరుల బాధ్యతలు కీలకంగా మారాయి. అంత్యక్రియల సమయంలో శ్మశాన వాటికకు తీసుకువచ్చే మృతదేహాల వివరాలను శ్మశానవాటికల నిర్వాహకులు లేదా కాటికాపరులు తమకు మున్సిపల్ పరిపాలనా విభాగం అందజేసిన స్మార్ట్ఫోన్ ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేస్తారు. ఆ వెంటనే సంబంధితుల సెల్ఫోన్కు మెస్సేజ్, లింక్ వస్తుంది. లింక్పైక్లిక్ చేసి మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందవచ్చు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పోస్ట్మార్టం పూర్తి కాగానే ప్రత్యేసైట్లో అప్లోడ్ చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
75 వేలు సైబర్ మోసం
[ 18-05-2024]
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో హెచ్.పి పెట్రోల్ బంక్ నిర్వాహకుడు రాచకొండ రామ కోటేశ్వరరావు నుంచి సైబర్ నేరగాళ్లు రూ.75వేలు చోరీ చేశారు. -
సేవా సంస్థల చేయూత అభినందనీయం
[ 18-05-2024]
సేవా సంస్థలు అందించే చేయూత బాధితులకు ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తుందని చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి అన్నారు. -
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
[ 18-05-2024]
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. -
కార్పొరేట్ వాకిటకు..సర్కారు సౌరభం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్ విద్యకు సహకారం అందిస్తోంది. -
పరిశ్రమలు 900.. అధికారులు ఐదుగురు
[ 18-05-2024]
రసాయన, ఇతర పరిశ్రమల నుంచి వచ్చే ప్రమాదకర వ్యర్థాలను జాగ్రత్తగా నిర్వీర్యం చేయాలి. ఎక్కడ పడితే అక్కడ పారబోస్తే భూగర్భ జలాలు కలుషితం కావడంతో పాటు ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. -
ప్రముఖుల పల్లెల్లో..ప్రజాస్వామ్యం మురిసె
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్లో ప్రముఖుల పల్లెల్లో ఓటు చైతన్యం వెల్లివిరిసింది. ఈ గ్రామాలకు చెందిన నేతలు ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా సేవలు అందించడంతో పాటు ఇతర ముఖ్యులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేవిధంగా పల్లెవాసులు వారిని ప్రోత్సహించారు. -
చలో.. నెల్లిబండ గట్టు జాతర
[ 18-05-2024]
వందల ఏళ్ల చరిత్ర.. రెండేళ్లకోసారి జాతర.. వేలాది మంది భక్తుల రాక.. ఉమ్మడి జిల్లాలో దురాజ్పల్లి పెద్దగట్టు తర్వాతి స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న చిన్నగట్టు జాతరకు నెల్లిబండ ముస్తాబైంది. -
పట్టభద్రులకు పోల్ చిట్టీలు
[ 18-05-2024]
వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రధాన పార్టీల తరఫున బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. -
పెరిగిన పోలింగ్.. ఎవరికి లాభించేనో?
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల క్రతువు ఇటీవలే ముగిసింది. అందరి దృష్టి భువనగిరి లోక్సభ పైనే ఉంది. ఇక్కడ గతంలో కంటే పోలింగ్ శాతం పెరగడంతో ఇది ఎవరికి లాభిస్తుందనే విషయమై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.. అందనున్న ప్రత్యేక సేవలు
[ 18-05-2024]
సాధారణ సేవలకు మాత్రమే పరిమితమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పల్లెదవాఖానాల్లో అదనంగా ఏడు రకాల వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాల వాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
అమ్మ అంత్యక్రియలకు అడ్డంకిగా ఆస్తి
[ 18-05-2024]
అమ్మ అంత్యక్రియలకు ఆస్తి పంపకం అడ్డంకిగా మారిన ఉదంతమిది. కన్నతల్లి అంత్యక్రియలు తమ బాధ్యత అనే విషయాన్ని మరిచి ఆ కుటుంబ సభ్యులు రెండు రోజులుగా ఆస్తి పంపకం విషయమై గ్రామపెద్దలతో ఎడతెగని చర్చలు జరిపారు -
ఆ చేపల పులుసు..మనసులు గెలుచు
[ 18-05-2024]
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: బూర
[ 18-05-2024]
పార్లమెంట్ ఎన్నికల స్ఫూర్తితో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు పనిచేయాలని భాజపా ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్, జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ కోరారు -
కలవరపెడుతున్న క్షయ
[ 18-05-2024]
క్షయ వ్యాధి కలవరపెడుతోంది. జిల్లాలో ప్రతి సంవత్సరం వ్యాధి బారినపడేవారు సంఖ్య పెరుగుతోంది. -
ఈసారైనా సీసీ లైనింగ్కు గ్రీన్సిగ్నల్ వచ్చేనా..?
[ 18-05-2024]
నల్గొండ జిల్లాలో 2.20 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఏఎంఆర్పీ) ప్రధాన కాల్వకు సిమెంటు కాంక్రీటు(సీసీ) లైనింగ్ చేసే పనులకు ఈ సారైనా ప్రభుత్వం పచ్చజెండా ఊపుతుందా..
తాజా వార్తలు (Latest News)
-
మోదీ నాతో చర్చకు వస్తే అడిగే ప్రశ్నలివే..: రాహుల్ గాంధీ
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు