ఎంపీలకు ఎన్ని సౌకర్యాలో..!
ఒకసారి ఎంపీగా ప్రమాణస్వీకారం చేస్తే ప్రభుత్వ పరంగా జీతభత్యాలతో పాటు అనేక సౌకర్యాలు కల్పిస్తారు. అలాంటి సీటులో కూర్చునేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు.
హుజూర్నగర్, న్యూస్టుడే: ఒకసారి ఎంపీగా ప్రమాణస్వీకారం చేస్తే ప్రభుత్వ పరంగా జీతభత్యాలతో పాటు అనేక సౌకర్యాలు కల్పిస్తారు. అలాంటి సీటులో కూర్చునేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు.
- నెలకు రూ.లక్ష వేతనం (అన్ని అలవెన్సులతో కలిపి) లభిస్తుంది. పదవి అనంతరం రూ.50 వేల నుంచి అత్యధికంగా రూ.70వేల వరకు పింఛన్ వస్తుంది.
- ఎంపీ నిధుల కింద ఏడాదికి రూ.5 కోట్లు ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇవి జిల్లా కలెక్టరుకు వస్తాయి. ఎంపీ గుర్తించిన పనులకు వాటిని ఖర్చు చేస్తారు. నియోజకవర్గంలో ఎక్కడ అవసరమో అక్కడ అభివృద్ధి పనులకు వీటిని కేటాయిస్తుంటారు. ఎంపీ సిఫార్సు మేరకు ఆయా నిధులను మంజూరు చేయడం, ఆయా పనులు చేయించడం జిల్లా యంత్రాంగం చూసుకుంటుంది.
- నియోజకవర్గ కార్యాలయ నిర్వహణ ఖర్చు నెలకు రూ.45 వేలు (ఇందులో రూ.15 వేలు స్టేషనరీ, పోస్టేజీకి, రూ.30 వేలు సహాయ సిబ్బంది, ఇతర ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు). పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటే రోజుకు రూ.2 వేలు అదనంగా చెల్లిస్తారు.
- ఏడాదికి 34 సార్లు ఉచిత విమాన ప్రయాణం. ఎంపీతో పాటు జీవిత భాగస్వామికి లేదా మరొకరికి అవకాశం ఉంటుంది. వీరు ఎంపీని కలిసేందుకు ఎనిమిది సార్లు ఒంటరిగానూ ప్రయాణించే అవకాశం కల్పించారు.
- రైలు ప్రయాణం ఉచితం. ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్లో ప్రయాణించవచ్చు. జీవిత భాగస్వామికీ అవకాశం ఉంది.
- రహదారి మీదుగా ప్రయాణిస్తే కిలోమీటరుకు రూ.16 చొప్పున బిల్లు ఇస్తారు. బస్సులోనూ వీరికి ప్రత్యేక సీటు కేటాయింపు ఉంటుంది.
- ఫర్నిచర్ కోసం.. ప్రతి మూడు నెలలకు ఒక సోఫా కవర్లు మార్చుకునేందుకు, సీలింగ్ అవసరాల నిమిత్తం రూ.60 వేలు, ఎలక్ట్రానిక్, ఇతర వస్తువులు సమకూర్చుకునేందుకు రూ.15వేలు ఇస్తారు.
- ఇవికాక రూ.4 లక్షల వరకు అదనపు వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు. వీటిని నెలనెలా వాయిదాల రూపంలో 60 నెలల్లో చెల్లించుకోవచ్చు. వీరి నివాసం వద్ద ఎల్పీజీ గ్యాస్, గ్రంథాలయ సదుపాయాలు ఉంటాయి.
- ప్రథమ శ్రేణి అధికారుల కేంద్ర పౌరసేవల కింద కేంద్ర ప్రభుత్వం వైద్యారోగ్య పథకం ద్వారా వైద్యారోగ్య సేవలు(సీజీహెచ్ఎస్) పొందవచ్చు. ఎక్స్రే, అల్ట్రా సౌండ్, ఈసీజీ, పాథలాజికల్ లాబొరేటరీ సౌకర్యం, హృద్రోగ, దంత, కంటి, ఈఎన్టీ, చర్మ, తదితర ఆరోగ్య సేవలను ఉచితంగా పొందవచ్చు.
- దిల్లీలో నివాస వసతిని కల్పిస్తారు. మొదటిసారి గెలిచిన ఎంపీలకు రాష్ట్ర ప్రభుత్వ వసతి గృహాలను కేటాయిస్తారు. దిల్లీలో బీకేఎస్ మార్గ్లోని ఎంఎస్ ప్లాట్ను కేటాయిస్తున్నారు. సీనియర్ ఎంపీలకు వ్యక్తిగత బంగ్లాను కేటాయిస్తారు. 50 వేల యూనిట్ల విద్యుత్ను వినియోగించుకోవచ్చు.
- మూడు టెలిఫోన్లు పెట్టుకునే సౌకర్యం ఉంటుంది. దిల్లీలోని ఇంటి వద్ద, కార్యాలయంలో, రాష్ట్రంలోని నివాసం వద్ద తనకు ఇష్టమైన చోట ఏర్పాటు చేసుకోవచ్చు. ఏడాదిలో 50 వేల కాల్స్ ఉచితం. మొబైల్ ఫోన్ 3జీ ప్యాకేజీతో అదనంగా 1.50 లక్షల కాల్స్ మాట్లాడుకునే వీలు ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
75 వేలు సైబర్ మోసం
[ 18-05-2024]
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో హెచ్.పి పెట్రోల్ బంక్ నిర్వాహకుడు రాచకొండ రామ కోటేశ్వరరావు నుంచి సైబర్ నేరగాళ్లు రూ.75వేలు చోరీ చేశారు. -
సేవా సంస్థల చేయూత అభినందనీయం
[ 18-05-2024]
సేవా సంస్థలు అందించే చేయూత బాధితులకు ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తుందని చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి అన్నారు. -
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
[ 18-05-2024]
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. -
కార్పొరేట్ వాకిటకు..సర్కారు సౌరభం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్ విద్యకు సహకారం అందిస్తోంది. -
పరిశ్రమలు 900.. అధికారులు ఐదుగురు
[ 18-05-2024]
రసాయన, ఇతర పరిశ్రమల నుంచి వచ్చే ప్రమాదకర వ్యర్థాలను జాగ్రత్తగా నిర్వీర్యం చేయాలి. ఎక్కడ పడితే అక్కడ పారబోస్తే భూగర్భ జలాలు కలుషితం కావడంతో పాటు ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. -
ప్రముఖుల పల్లెల్లో..ప్రజాస్వామ్యం మురిసె
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్లో ప్రముఖుల పల్లెల్లో ఓటు చైతన్యం వెల్లివిరిసింది. ఈ గ్రామాలకు చెందిన నేతలు ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా సేవలు అందించడంతో పాటు ఇతర ముఖ్యులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేవిధంగా పల్లెవాసులు వారిని ప్రోత్సహించారు. -
చలో.. నెల్లిబండ గట్టు జాతర
[ 18-05-2024]
వందల ఏళ్ల చరిత్ర.. రెండేళ్లకోసారి జాతర.. వేలాది మంది భక్తుల రాక.. ఉమ్మడి జిల్లాలో దురాజ్పల్లి పెద్దగట్టు తర్వాతి స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న చిన్నగట్టు జాతరకు నెల్లిబండ ముస్తాబైంది. -
పట్టభద్రులకు పోల్ చిట్టీలు
[ 18-05-2024]
వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రధాన పార్టీల తరఫున బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. -
పెరిగిన పోలింగ్.. ఎవరికి లాభించేనో?
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల క్రతువు ఇటీవలే ముగిసింది. అందరి దృష్టి భువనగిరి లోక్సభ పైనే ఉంది. ఇక్కడ గతంలో కంటే పోలింగ్ శాతం పెరగడంతో ఇది ఎవరికి లాభిస్తుందనే విషయమై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.. అందనున్న ప్రత్యేక సేవలు
[ 18-05-2024]
సాధారణ సేవలకు మాత్రమే పరిమితమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పల్లెదవాఖానాల్లో అదనంగా ఏడు రకాల వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాల వాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
అమ్మ అంత్యక్రియలకు అడ్డంకిగా ఆస్తి
[ 18-05-2024]
అమ్మ అంత్యక్రియలకు ఆస్తి పంపకం అడ్డంకిగా మారిన ఉదంతమిది. కన్నతల్లి అంత్యక్రియలు తమ బాధ్యత అనే విషయాన్ని మరిచి ఆ కుటుంబ సభ్యులు రెండు రోజులుగా ఆస్తి పంపకం విషయమై గ్రామపెద్దలతో ఎడతెగని చర్చలు జరిపారు -
ఆ చేపల పులుసు..మనసులు గెలుచు
[ 18-05-2024]
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: బూర
[ 18-05-2024]
పార్లమెంట్ ఎన్నికల స్ఫూర్తితో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు పనిచేయాలని భాజపా ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్, జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ కోరారు -
కలవరపెడుతున్న క్షయ
[ 18-05-2024]
క్షయ వ్యాధి కలవరపెడుతోంది. జిల్లాలో ప్రతి సంవత్సరం వ్యాధి బారినపడేవారు సంఖ్య పెరుగుతోంది. -
ఈసారైనా సీసీ లైనింగ్కు గ్రీన్సిగ్నల్ వచ్చేనా..?
[ 18-05-2024]
నల్గొండ జిల్లాలో 2.20 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఏఎంఆర్పీ) ప్రధాన కాల్వకు సిమెంటు కాంక్రీటు(సీసీ) లైనింగ్ చేసే పనులకు ఈ సారైనా ప్రభుత్వం పచ్చజెండా ఊపుతుందా..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ధోనీ వల్లే.. ఇలాంటి విరాట్ను చూస్తున్నాం: సునీల్ గావస్కర్
-
తనలాంటి వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి.. బెయిల్ కోసం ‘లావా’ బాస్ నిర్వాకం
-
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
-
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!
-
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు లేదు