కృష్ణా జలాల వాటాపై పోరాటం
‘బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం కృష్ణాలో రావాల్సిన నీటి వాటా కోసం పోరాడుతా. సాగర్ ప్రాజెక్టులో 130 టీఎంసీల నీరున్నా రైతులకు సాగునీళ్లు ఇవ్వలేదు. మా హయాంలో ఉమ్మడి జిల్లాలో 11.5 లక్షల ఎకరాల్లో వరి సాగయితే..
‘ఈనాడు’తో నల్గొండ భారాస అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి
ఈనాడు, నల్గొండ : ‘బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం కృష్ణాలో రావాల్సిన నీటి వాటా కోసం పోరాడుతా. సాగర్ ప్రాజెక్టులో 130 టీఎంసీల నీరున్నా రైతులకు సాగునీళ్లు ఇవ్వలేదు. మా హయాంలో ఉమ్మడి జిల్లాలో 11.5 లక్షల ఎకరాల్లో వరి సాగయితే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే 4 లక్షల ఎకరాల్లో పంటలను ఎండగొట్టారు. పరిపాలన అనుభవం లేకనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందుల పాలు చేస్తోంద’ని నల్గొండ భారాస అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి అన్నారు. తాను రైతుబిడ్డగా ప్రజల్లోకి వస్తుంటే, వారసత్వ రాజకీయాలు, ఇంటికి రెండు ఉద్యోగాలతో కాంగ్రెస్ నాయకులు ప్రచారానికి వస్తున్నారని విమర్శించారు. లోక్సభ ఎన్నికల పోలింగ్కు మరో తొమ్మిది రోజులే గడువు ఉన్న నేపథ్యంలో ‘ఈనాడు’తో ముఖాముఖి మాట్లాడారు.
పంటలకు గిట్టుబాటు ధరకు ఉద్యమం
ఉమ్మడి జిల్లాలో పత్తి, వరి పంట పండుతున్నా చాలా వరకు గిట్టుబాటు ధరలు రైతులకు దక్కడం లేదు. నన్ను ఎంపీగా గెలిపిస్తే స్వామినాథన్ సిఫార్సుల అమలుకు లోక్సభలో పోరాడుతాను. జాతీయ ఉపాధి హామీ కూలీలు సైతం రాష్ట్రంలో నల్గొండ లోక్సభ పరిధిలోనే ఎక్కువగా ఉన్నారు. వీరిని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మహిళలు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు పలు పరిశ్రమలను స్థాపించేందుకు ప్రయత్నం చేస్తాను.
రైల్వే సమస్యలను పరిష్కరిస్తాం..
గతంలో ఇక్కడి నుంచి ఎంపీలుగా ప్రాతినిథ్యం వహించిన వారు రైల్వే సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చూపించారు. నాకు ఒక్క అవకాశం కల్పిస్తే ఏళ్లుగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తాను. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి మార్గంలో బుల్లెట్ రైలుతో పాటూ పలు చోట్ల ఫ్లై ఓవర్లు, అండర్పాసుల నిర్మాణంపై సంబంధిత అధికారులతో చర్చించి పార్లమెంటులో ఈ సమస్యలను లేవనెత్తుతాను.
రహదారుల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ
లోక్సభ పరిధిలో పలు జాతీయ రహదారుల నిర్మాణాలు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయి. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై బ్లాక్స్పాట్స్ వద్ద ప్రమాదాల నివారణకు శాశ్వత చర్యలకు అధికారులతో మాట్లాడి చర్యలు ప్రారంభిస్తాను. నల్గొండ - మల్లేపల్లి రహదారిని ఎన్హెచ్ఏఐ అధికారులతో మాట్లాడి జాతీయ రహదారిగా మారుస్తాం.
కొత్త జిల్లాల్లో నవోదయ ఏర్పాటు
రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడి తొమ్మిదేళ్లవుతున్నా నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయలేదు. గత సీఎం కేసీఆర్ సైతం పలుమార్లు విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరినా భాజపా ప్రభుత్వం పట్టించుకోలేదు. వాళ్లకెందుకు ఓటేయాలి. గత పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో 10,300 ఉద్యోగాలిస్తే మా పదేళ్ల పాలనలో 1.92 లక్షల ఉద్యోగాలిచ్చాం. నల్గొండ లోక్సభ పరిధిలో కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయిని రాబట్టుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాను.
ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి కృషి..
ఆయకట్టులోని మిర్యాలగూడ, సాగర్, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో రైస్మిల్లులు, సిమెంటు పరిశ్రమలున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. వారందరినీ ఈఎస్ఐ పరిధిలో చేర్పించి ఈ ప్రాంతంలో కేంద్రం తరఫున ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేస్తాను. ఏళ్ల నుంచి ఉన్నన ఈ డిమాండ్ను గత ఎంపీలు పట్టించుకోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
75 వేలు సైబర్ మోసం
[ 18-05-2024]
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో హెచ్.పి పెట్రోల్ బంక్ నిర్వాహకుడు రాచకొండ రామ కోటేశ్వరరావు నుంచి సైబర్ నేరగాళ్లు రూ.75వేలు చోరీ చేశారు. -
సేవా సంస్థల చేయూత అభినందనీయం
[ 18-05-2024]
సేవా సంస్థలు అందించే చేయూత బాధితులకు ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తుందని చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి అన్నారు. -
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
[ 18-05-2024]
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. -
కార్పొరేట్ వాకిటకు..సర్కారు సౌరభం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్ విద్యకు సహకారం అందిస్తోంది. -
పరిశ్రమలు 900.. అధికారులు ఐదుగురు
[ 18-05-2024]
రసాయన, ఇతర పరిశ్రమల నుంచి వచ్చే ప్రమాదకర వ్యర్థాలను జాగ్రత్తగా నిర్వీర్యం చేయాలి. ఎక్కడ పడితే అక్కడ పారబోస్తే భూగర్భ జలాలు కలుషితం కావడంతో పాటు ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. -
ప్రముఖుల పల్లెల్లో..ప్రజాస్వామ్యం మురిసె
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్లో ప్రముఖుల పల్లెల్లో ఓటు చైతన్యం వెల్లివిరిసింది. ఈ గ్రామాలకు చెందిన నేతలు ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా సేవలు అందించడంతో పాటు ఇతర ముఖ్యులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేవిధంగా పల్లెవాసులు వారిని ప్రోత్సహించారు. -
చలో.. నెల్లిబండ గట్టు జాతర
[ 18-05-2024]
వందల ఏళ్ల చరిత్ర.. రెండేళ్లకోసారి జాతర.. వేలాది మంది భక్తుల రాక.. ఉమ్మడి జిల్లాలో దురాజ్పల్లి పెద్దగట్టు తర్వాతి స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న చిన్నగట్టు జాతరకు నెల్లిబండ ముస్తాబైంది. -
పట్టభద్రులకు పోల్ చిట్టీలు
[ 18-05-2024]
వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రధాన పార్టీల తరఫున బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. -
పెరిగిన పోలింగ్.. ఎవరికి లాభించేనో?
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల క్రతువు ఇటీవలే ముగిసింది. అందరి దృష్టి భువనగిరి లోక్సభ పైనే ఉంది. ఇక్కడ గతంలో కంటే పోలింగ్ శాతం పెరగడంతో ఇది ఎవరికి లాభిస్తుందనే విషయమై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.. అందనున్న ప్రత్యేక సేవలు
[ 18-05-2024]
సాధారణ సేవలకు మాత్రమే పరిమితమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పల్లెదవాఖానాల్లో అదనంగా ఏడు రకాల వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాల వాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
అమ్మ అంత్యక్రియలకు అడ్డంకిగా ఆస్తి
[ 18-05-2024]
అమ్మ అంత్యక్రియలకు ఆస్తి పంపకం అడ్డంకిగా మారిన ఉదంతమిది. కన్నతల్లి అంత్యక్రియలు తమ బాధ్యత అనే విషయాన్ని మరిచి ఆ కుటుంబ సభ్యులు రెండు రోజులుగా ఆస్తి పంపకం విషయమై గ్రామపెద్దలతో ఎడతెగని చర్చలు జరిపారు -
ఆ చేపల పులుసు..మనసులు గెలుచు
[ 18-05-2024]
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: బూర
[ 18-05-2024]
పార్లమెంట్ ఎన్నికల స్ఫూర్తితో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు పనిచేయాలని భాజపా ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్, జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ కోరారు -
కలవరపెడుతున్న క్షయ
[ 18-05-2024]
క్షయ వ్యాధి కలవరపెడుతోంది. జిల్లాలో ప్రతి సంవత్సరం వ్యాధి బారినపడేవారు సంఖ్య పెరుగుతోంది. -
ఈసారైనా సీసీ లైనింగ్కు గ్రీన్సిగ్నల్ వచ్చేనా..?
[ 18-05-2024]
నల్గొండ జిల్లాలో 2.20 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఏఎంఆర్పీ) ప్రధాన కాల్వకు సిమెంటు కాంక్రీటు(సీసీ) లైనింగ్ చేసే పనులకు ఈ సారైనా ప్రభుత్వం పచ్చజెండా ఊపుతుందా..
తాజా వార్తలు (Latest News)
-
మోదీ నాతో చర్చకు వస్తే అడిగే ప్రశ్నలివే..: రాహుల్ గాంధీ
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు