ప్లాస్టిక్ ముప్పు.. ఎవరిదీ తప్పు..!
పురపాలికల్లో పాలిథిన్ నిషేధం ప్రచారానికే పరిమితం అయింది. అటవీ, పర్యావరణ పరిరక్షణ చట్టం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ఉత్తర్వుల ప్రకారం 50 మైక్రాన్లు మందం కంటే తక్కువ ఉన్న పాలిథిన్ సంచులను వాడొద్దు.
నల్గొండలో రోడ్ల పక్కన వాడి పడేసిన పాలిథిన్ సంచులు
నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్టుడే: పురపాలికల్లో పాలిథిన్ నిషేధం ప్రచారానికే పరిమితం అయింది. అటవీ, పర్యావరణ పరిరక్షణ చట్టం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ఉత్తర్వుల ప్రకారం 50 మైక్రాన్లు మందం కంటే తక్కువ ఉన్న పాలిథిన్ సంచులను వాడొద్దు. తెలుపు కవర్లు తప్ప నలుపు, నీలం, ఇతర రంగులను వాడటానికి వీలు లేదు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పురపాలికల్లో కమిషనర్లు పర్యవేక్షిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తే నిల్వలను సీజ్ చేయాలి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ప్లాస్టిక్ను తగ్గించాలని చెబుతున్నా ఆ దిశగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టడం లేదు. దీంతో జిల్లాలో పాలిథిన్ వస్తువుల వాడకం విపరీతంగా పెరిగిపోతోంది.
అటకెక్కిన పాలిథిన్ నిషేధం
పురపాలికల్లో మండల కేంద్రాల్లో నిర్ధిష్ట ప్రమాణాలు లేని ప్లాస్టిక్ నిషేధం కథ మొదటికొచ్చింది. పూర్వ నల్గొండ జిల్లా పరిధిలోని 19 పురపాలిక పరిధిలో నిత్యం 320 టన్నులకు పైగా వ్యర్థాలు ఉత్పత్తి అవుతోంది. అందులో 30శాతానికి పైగా పాలిథిన్ సంచులు, గ్లాసులు, బాటిల్స్ పోగవుతున్నాయి. గత ఏడాది నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ పట్టణాల్లో పాలిథిన్ సంచులు వాడే దుకాణాలను సీజ్ చేసి రూ.3లక్షలకు పైగా జరిమానా విధించిన విషయం తెలిసిందే. కానీ.. ప్రస్తుతం ప్లాస్టిక్ నియంత్రణ కరవైంది. తనిఖీలు, జరిమానా విధించే అధికారులు రాజకీయ ఒత్తిళ్లతో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సూర్యాపేట, నల్గొండ పురపాలికల్లో నామమాత్రంగా తనిఖీలు చేపడుతున్నారు. మిగత 17 పురపాలికల్లో తనిఖీల జోలికి అధికారులు వెళ్లడం లేదు. హైదరాబాద్, విజయవాడ కేంద్రాల నుంచి ప్రధాన పట్టణాలకు దిగుమతి చేసుకుంటున్నారు. అక్కడి నుంచి మండల కేంద్రాలకు వ్యాపారులు సరఫరా చేస్తూ కాసులు జేబులు నింపుకొంటున్నారు.
పొంచి ఉన్న ప్రమాదం..
రంగు రంగుల సంచుల తయారీలో హానీకర రసాయనాలు కలిసిన పాలిథిన్ సంచులు వాడటంతో క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. భూమి పొరల్లో సంవత్సరాల కొద్ది ప్లాస్టిక్ కరిగిపోకుండా ఉండటం వల్ల నీరు సరిగా ఇంకడం లేదు. వాడి పడేసిన పాలిథిన్ వ్యర్థాలతో మురుగు కాల్వలు నిండిపోతున్నాయి. నీరు దిగువకు పారకుండా అడ్డుపడుతున్నాయి. పాలిథిన్ విక్రయాలపై ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించకపోతే స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులపై ప్రభావం పడే అవకాశం ఉంది.
నిషేధం అమలయ్యేలా చర్యలు:
ముసాబ్ అహ్మద్ సయ్యద్, కమిషనర్, నల్గొండ పురపాలిక
పాలిథిన్ నిషేధం పూర్తి స్థాయిలో అమలు జరిగేలా చర్యలు తీసుకుంటాం. ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నాం. వ్యాపారులపై ఇటీవలనే రూ.50వేలకు పైగా జరిమానాలు వసూలు చేశాం. ఎన్నికలు పూర్తవ్వగానే పూర్తి స్థాయిలో దాడులు చేస్తూ పాలిథిన్ వాడకం, విక్రయాల నియంత్రణ చేపడుతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
75 వేలు సైబర్ మోసం
[ 18-05-2024]
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో హెచ్.పి పెట్రోల్ బంక్ నిర్వాహకుడు రాచకొండ రామ కోటేశ్వరరావు నుంచి సైబర్ నేరగాళ్లు రూ.75వేలు చోరీ చేశారు. -
సేవా సంస్థల చేయూత అభినందనీయం
[ 18-05-2024]
సేవా సంస్థలు అందించే చేయూత బాధితులకు ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తుందని చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి అన్నారు. -
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
[ 18-05-2024]
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. -
కార్పొరేట్ వాకిటకు..సర్కారు సౌరభం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్ విద్యకు సహకారం అందిస్తోంది. -
పరిశ్రమలు 900.. అధికారులు ఐదుగురు
[ 18-05-2024]
రసాయన, ఇతర పరిశ్రమల నుంచి వచ్చే ప్రమాదకర వ్యర్థాలను జాగ్రత్తగా నిర్వీర్యం చేయాలి. ఎక్కడ పడితే అక్కడ పారబోస్తే భూగర్భ జలాలు కలుషితం కావడంతో పాటు ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. -
ప్రముఖుల పల్లెల్లో..ప్రజాస్వామ్యం మురిసె
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్లో ప్రముఖుల పల్లెల్లో ఓటు చైతన్యం వెల్లివిరిసింది. ఈ గ్రామాలకు చెందిన నేతలు ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా సేవలు అందించడంతో పాటు ఇతర ముఖ్యులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేవిధంగా పల్లెవాసులు వారిని ప్రోత్సహించారు. -
చలో.. నెల్లిబండ గట్టు జాతర
[ 18-05-2024]
వందల ఏళ్ల చరిత్ర.. రెండేళ్లకోసారి జాతర.. వేలాది మంది భక్తుల రాక.. ఉమ్మడి జిల్లాలో దురాజ్పల్లి పెద్దగట్టు తర్వాతి స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న చిన్నగట్టు జాతరకు నెల్లిబండ ముస్తాబైంది. -
పట్టభద్రులకు పోల్ చిట్టీలు
[ 18-05-2024]
వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రధాన పార్టీల తరఫున బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. -
పెరిగిన పోలింగ్.. ఎవరికి లాభించేనో?
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల క్రతువు ఇటీవలే ముగిసింది. అందరి దృష్టి భువనగిరి లోక్సభ పైనే ఉంది. ఇక్కడ గతంలో కంటే పోలింగ్ శాతం పెరగడంతో ఇది ఎవరికి లాభిస్తుందనే విషయమై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.. అందనున్న ప్రత్యేక సేవలు
[ 18-05-2024]
సాధారణ సేవలకు మాత్రమే పరిమితమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పల్లెదవాఖానాల్లో అదనంగా ఏడు రకాల వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాల వాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
అమ్మ అంత్యక్రియలకు అడ్డంకిగా ఆస్తి
[ 18-05-2024]
అమ్మ అంత్యక్రియలకు ఆస్తి పంపకం అడ్డంకిగా మారిన ఉదంతమిది. కన్నతల్లి అంత్యక్రియలు తమ బాధ్యత అనే విషయాన్ని మరిచి ఆ కుటుంబ సభ్యులు రెండు రోజులుగా ఆస్తి పంపకం విషయమై గ్రామపెద్దలతో ఎడతెగని చర్చలు జరిపారు -
ఆ చేపల పులుసు..మనసులు గెలుచు
[ 18-05-2024]
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: బూర
[ 18-05-2024]
పార్లమెంట్ ఎన్నికల స్ఫూర్తితో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు పనిచేయాలని భాజపా ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్, జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ కోరారు -
కలవరపెడుతున్న క్షయ
[ 18-05-2024]
క్షయ వ్యాధి కలవరపెడుతోంది. జిల్లాలో ప్రతి సంవత్సరం వ్యాధి బారినపడేవారు సంఖ్య పెరుగుతోంది. -
ఈసారైనా సీసీ లైనింగ్కు గ్రీన్సిగ్నల్ వచ్చేనా..?
[ 18-05-2024]
నల్గొండ జిల్లాలో 2.20 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఏఎంఆర్పీ) ప్రధాన కాల్వకు సిమెంటు కాంక్రీటు(సీసీ) లైనింగ్ చేసే పనులకు ఈ సారైనా ప్రభుత్వం పచ్చజెండా ఊపుతుందా..
తాజా వార్తలు (Latest News)
-
మోదీ నాతో చర్చకు వస్తే అడిగే ప్రశ్నలివే..: రాహుల్ గాంధీ
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు