పోస్టల్ బ్యాలెట్ ఓటర్లుకు ఇబ్బందులు కలగొద్దు
ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకునేందుకు వచ్చిన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఆదేశించారు.
నల్గొండలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ప్రక్రియను పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన
నల్గొండ సంక్షేమం, న్యూస్టుడే: ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకునేందుకు వచ్చిన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఆదేశించారు. నల్గొండలోని కోమటిరెడ్డి ప్రతీక్రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ప్రక్రియను పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్లో ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులకు అసౌకర్యం కలగకుండా హెల్ప్డెస్క్ ఏర్పాటు, అవసరమైన టెంట్లు, కుర్చీలు, తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. హెల్ప్డెస్క్లో సిస్టమ్ లేదా లాప్టాప్ ఆధారంగా ఎపిక్నెంబర్ను పరిశీలించి ఓటు వేసే గది ఇతర వివరాలను స్పష్టంగా తెలపాలన్నారు. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఓటు వేసేలా అవకాశం కల్పించాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ జిల్లా నోడల్ అధికారి శ్రీదేవి పాల్గొన్నారు.
ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు..
నల్గొండ సంక్షేమం: వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అనిశెట్టిదుప్పలపల్లిలోని గోదాంలో ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన సోమవారం పరిశీలించారు. లెక్కింపునకు నాలుగు హాళ్లు ఉండాలని, ప్రతి హాల్లో 25 టేబుల్స్ ఉండే విధంగా చూడాలన్నారు. స్ట్రాంగ్రూం ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు, బ్యాలెట్ పెట్టెల భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ ఈఈ భూమయ్య, సర్వే లాండ్ రికార్డ్సు ఏడీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాదేశిక సమరంపై స్పష్టత కరవు
[ 19-05-2024]
జిల్లా, మండల పరిషత్తుల ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలు గడువులోపు అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఫలితంగా గ్రామ పంచాయతీలకు నియమించిన మాదిరిగానే జిల్లా, మండల పరిషత్తులకు ప్రత్యేకపాలన అధికారులను నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. -
పీడీఎస్ బియ్యం వ్యవహారంలో తొమ్మిది మందిపై కేసు నమోదు
[ 19-05-2024]
పెద్దవూర సమీపంలో పీడీఎస్ బియ్యం దందా వ్యవహారంలో తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు పెద్దవూర ఎస్ఐ వీరబాబు తెలిపారు. వీరిలో నలుగురిని అరెస్టు చేసినట్లు, మిగతా వారు పరారీలో ఉన్నారని శనివారం రాత్రి పత్రికా ప్రకటనలో పోలీసులు వెల్లడించారు. -
ఆరు నెలల్లో సూపర్స్పెషాలిటీ వైద్యసేవలు
[ 19-05-2024]
జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి స్థాయి మరింత పెరగనుంది. ఎస్సెల్బీసీ ప్రాంతంలో రూ.120 కోట్లతో 37 ఎకరాల్లో నిర్మిస్తున్న వైద్యకళాశాల పనులు సెప్టెంబరు లోపు పూర్తవుతాయని టీఎస్ఎంఐడీసీ అధికారులు చెబుతున్నారు. -
బడి.. పూర్వపు ఒరవడి!
[ 19-05-2024]
సీఎం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 203 చోట్ల పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించగా.. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 24, భువనగిరి, సూర్యాపేట జిల్లాలో పలు గ్రామాల్లో పాఠశాలలు ప్రారంభించనున్నారు. -
వనమాల.. బ్యాడ్మింటన్లో భళా!
[ 19-05-2024]
మిర్యాలగూడ పట్టణానికి చెందిన వనమాల శ్రీకాంత్- భవానీల కుమారుడు శశాంక్ చిన్నతనం నుంచి బ్యాడ్మింటన్లో అద్భుత ప్రతిభ కనబరచడంతో శిక్షకుడు మారబోయిన రామకృష్ణ సూచన మేరకు హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మక గోపిచంద్ అకాడమీలో చేర్పించారు. -
‘అద్విత’ంగా ప్రతిభ చూపి..!
[ 19-05-2024]
మిర్యాలగూడ పట్టణానికి చెందిన బిక్కుమళ్ల అద్విత్ కృష్ణ ఈఏపీసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో 275 ర్యాంకు సాధించాడు. పట్టణంలోని కేఎల్ఎన్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ బిక్కుమళ్ల కిరణ్కుమార్, శైలజ దంపతుల కుమారుడు అద్విత్ కృష్ణ స్థానికంగా కళాశాలలో ఇంటర్ బైపీసీ 958 మార్కులతో పూర్తిచేశాడు. -
ఈతకు వెళ్లిన బాలుడి గల్లంతు
[ 19-05-2024]
నీటి ప్రమాదాలు జరిగినప్పుడు మరణించొద్దనే ఆలోచనతో తండ్రి తన పిల్లలకు మూడు రోజులుగా ఈత నేర్పిస్తున్నాడు. ఈత వచ్చిందనే సంతోషంలో తండ్రికి తెలియకుండా మళ్లీ బావిలోకి దూకిన బాలుడు గల్లంతైన ఘటన శనివారం సాయంత్రం తిరుమలగిరిలో జరిగింది. -
పంచనారసింహులకు భక్తుల మొక్కు పూజలు
[ 19-05-2024]
పంచనారసింహులు కొలువై ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో శనివారం భక్త జనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. సుప్రభాతం నిర్వహించిన పూజారులను బిందెతీర్థంతో చేపట్టిన కైంకర్యాలు ఆలయ విశిష్టతకు అనుగుణంగా కొనసాగాయి. -
కొత్తగా 24 ప్రాథమిక పాఠశాలలు
[ 19-05-2024]
ప్రభుత్వ పాఠశాలలు లేని గ్రామపంచాయతీల్లో నూతనంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం కార్యరూపం దాల్చనుంది. జిల్లా వ్యాప్తంగా 421 గ్రామపంచాయతీలు ఉండగా 24 గ్రామపంచాయతీల పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు లేనట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
తాజా వార్తలు (Latest News)
-
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
-
ఆసక్తికరం.. 1.75 కోట్ల పందెం
-
పెట్టుబడి అంటే పట్టుబడినట్టే.. లాభాల పేరుతో సైబర్ నేరగాళ్ల దందా
-
4 నెలల్లో 1,300 ఫోన్ల ట్యాపింగ్!
-
పెళ్లిచూపులకు వస్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 3కి.మీ మేర బారులు