ఐదేళ్లలో.. మూడు లక్షలు పెరిగె..!
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ- 2024 ప్రక్రియలో భాగంగా.. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ నియోజకవర్గాల తుది ఓటరు జాబితా ఇటీవలే విడుదలైంది.
రెండు లోక్సభ నియోజకవర్గాల్లో 35,34,050 మంది ఓటర్లు
మిర్యాలగూడ పట్టణం, న్యూస్టుడే
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ- 2024 ప్రక్రియలో భాగంగా.. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ నియోజకవర్గాల తుది ఓటరు జాబితా ఇటీవలే విడుదలైంది. ఈ జాబితాలను ఎన్నికల బరిలో ఉన్న రాజకీయ పార్టీల ప్రతినిధులకు సైతం పంపిణీ చేశారు. ప్రస్తుత జాబితా ప్రకారం నల్గొండ లోక్సభ నియోజకవర్గంలో మొత్తం 17,25,465 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషులు 8,44,843 మంది, మహిళలు 8,80,453 మంది, థర్డ్ జెండర్ 169 మంది ఉన్నారు. భువనగిరి నియోజకవర్గంలో మొత్తం 18,08,585 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 8,98,416 మంది, మహిళలు 9,10,090 మంది, థర్డ్ జెండర్ 79 మంది ఉన్నారు.
2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ నియోజకవర్గాల్లో మొత్తం 3,21,213 మంది ఓటర్లు పెరిగారు. నల్గొండ లోక్సభ పరిధిలో మొత్తం 1,40,155 మంది ఓటర్లు పెరగగా.. మహిళలు 79,281 మంది, పురుషులు 60,835 మంది, థర్డ్జెండర్ 142 మంది పెరిగారు. పోలింగ్ కేంద్రాలు 70 పెరిగి 2,060కి చేరాయి. భువనగిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం 1,81,058 మంది ఓటర్లు పెరగగా.. మహిళలు 1,01,165 మంది, పురుషులు 79,844 మంది, థర్డ్జెండర్ 49 మంది పెరిగారు. ఈ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలు 73 పెరిగి 2,141కి చేరాయి.
అక్కడ ఇబ్రహీంపట్నం.. ఇక్కడ దేవరకొండ
భువనగిరి లోక్సభ స్థానం పరిధిలోని ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 3,39,341 మంది ఓటర్లు ఉండగా.. భువనగిరిలో అతి తక్కువగా 2,20,596 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. నల్గొండ లోక్సభ స్థానం పరిధిలో దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 2,62,480 మంది ఓటర్లు ఉండగా.. మిర్యాలగూడ నియోజకవర్గంలో అతి తక్కువగా 2,36,343 మంది ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లా పరంగా చూస్తే దేవరకొండలో అత్యధికంగా, భువనగిరిలో అతి తక్కువ మంది ఓటర్లు ఉన్నారు. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 56 మంది థర్డ్జెండర్లు ఉండగా.. భువనగిరిలో అతి తక్కువగా ఒక్కరు మాత్రమే ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసన మండలి(ఎమ్మెల్సీ) నియోజకవర్గానికి ఈ నెల 27న ఉపఎన్నిక జరగనుంది. -
గృహజ్యోతిపై భానుడి ప్రతాపం
[ 20-05-2024]
భానుడు గత పది సంవత్సరాల ఉష్ణోగ్రత రికార్డును అధిగమించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. -
డిగ్రీ విద్యార్థులకు దోస్త్
[ 20-05-2024]
ఇంటర్లో ఆయా కోర్సులు పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది చేరేది డిగ్రీ. తెలంగాణ ప్రభుత్వం కొన్నేళ్లుగా డిగ్రీలో ప్రవేశాలకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) వెబ్సైట్’ను ప్రారంభించింది. -
మరోసారి గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్
[ 20-05-2024]
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కీలకమైందని, పట్టభద్రులు విజ్ఞతతో ఓటేసి నిజాయతీ గల భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని శాసన మండలికి పంపాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. -
దర్జీగా.. ఇక దర్జాగా..!
[ 20-05-2024]
మహిళలు ఆర్థిక సాధికారత పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడులు మహిళలకు అప్పగించింది. -
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
రాష్ట్రానికి ఈ సారి ముందస్తుగా రుతు పవనాలు చేరుకుంటాయని, వర్షాలు కూడా గత ఏడాది కంటే ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. -
పట్టభద్రుల ఉప ఎన్నికకు రంగం సిద్ధం
[ 20-05-2024]
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. -
పదికి సంసిద్ధత
[ 20-05-2024]
తొమ్మిదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను రాబోయే 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పదో తరగతికి సంసిద్ధులను చేస్తోంది జిల్లా విద్యాశాఖ. -
అరచేతిలో పుస్తక ప్రపంచం
[ 20-05-2024]
పిల్లల్లో పఠనాసక్తిని పెంచేందుకు లిటరసీ క్లౌడ్ కార్యక్రమాన్ని విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. -
మోదీ పాలనలో కుంభకోణాలు లేవు: ఈటల
[ 20-05-2024]
భాజపా పదేళ్ల పాలనలో దేశంలో ఎలాంటి కుంభకోణాలు లేకుండా మోదీ పరిపాలించారని మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి: మంత్రి ఉత్తమ్
[ 20-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
ఎర్లీబర్డ్తో ఖజానాకు కాసులు
[ 20-05-2024]
పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్లు పెంచేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
[ 20-05-2024]
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడెం స్టేజీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
-
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
-
ప్రారంభమైన ‘టెట్’ ఎగ్జామ్.. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM