పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యం
గతంలో ఎన్నడూ లేని విధంగా 200 ఓటర్లున్నా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. ఎండ వేడిమి నియంత్రణతో పాటూ ఓటేయడానికి వచ్చే ఓటరుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లోక్సభ పరిధిలోని 2,061 పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.
అన్ని కేంద్రాల్లో పక్కా ఏర్పాట్లు
సరిహద్దు చెక్పోస్టుల వద్ద పటిష్ఠ బందోబస్తు
‘ఈనాడు’తో నల్గొండ లోక్సభ ఆర్వో దాసరి హరిచందన
ఈనాడు, నల్గొండ : ‘ గతంలో ఎన్నడూ లేని విధంగా 200 ఓటర్లున్నా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. ఎండ వేడిమి నియంత్రణతో పాటూ ఓటేయడానికి వచ్చే ఓటరుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లోక్సభ పరిధిలోని 2,061 పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. గత ఎన్నికల్లో నమోదైన 74.07 పోలింగ్ శాతాన్ని మించి ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నా’మని నల్గొండ లోక్సభ రిటర్నింగ్ అధికారి (ఆర్వో) దాసరి హరిచందన స్పష్టం చేశారు. ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల్లో వసతులు తదితర అంశాలపై ఆమె ‘ఈనాడు’తో ముఖాముఖీ మాట్లాడారు. ఈ నెల 13న జరగనున్న లోక్సభ ఎన్నికల పోలింగ్లో ప్రజలంతా అధిక సంఖ్యలో పాల్గొని ప్రజాస్వామ్య పండగను విజయవంతం చేయాలని కోరారు.
యువ ఓటర్లకు ఆహ్వానాలు..
కొత్తగా ఈ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకున్న వారు 61,143 మంది ఉన్నారు. వీరిలో కూడా సుమారు 53 శాతం మహిళా ఓటర్లు ఉన్నారు. వీరందరూ ఎన్నికల రోజును సెలవు దినంగా కాకుండా తప్పకుండా ఓటును వినియోగించుకునేలా ప్రత్యక్షంగా అందరికి ఓటు ఆహ్వానాలను అందజేస్తున్నాం. కళాశాలల్లో ఓటరు చైతన్య సదస్సులతో పాటూ పట్టణాల్లో అధికారులతో పలు అవగాహన సదస్సులను నిర్వహించాం. ఫొటో ఎగ్జిబిషన్లు, 2కే, 5కే రన్లు నిర్వహించి ప్రజలను చైతన్యం చేస్తున్నాం. మరోవైపు గత ఎన్నికల్లో 55 శాతం కంటే తక్కువగా ఓటింగ్ నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. కేవలం ఆరు కేంద్రాల్లో మాత్రమే గత ఎన్నికల్లో 55 శాతం కంటే తక్కువగా ఓటింగ్ నమోదైంది. ఈ ప్రాంతాల్లో అందరూ ఓటేసే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక సిబ్బందిని, అధికారులను ఆదేశించాం.
అంతర్రాష్ట్ర చెక్పోస్టులపై నిఘా..
రాష్ట్రంలో నల్గొండ లోక్సభ పరిధిలోనే ఎక్కువగా అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా చెక్పోస్టులున్నాయి. కేంద్ర బలగాలతో పాటూ స్థానిక పోలీసులతో ఈ చెక్పోస్టులపై నిఘా పెట్టాం. ఇప్పటి వరకు నగదు, మద్యం, ఇతర వస్తువులు కలిపి రూ. 20.13 కోట్ల వరకు సీజ్ చేశాం. ఇందులో నగదు రూ.9 కోట్ల వరకు ఉంటుంది. ఎన్నికల సమయంలో ఎలాంటి ఫిర్యాదులు అయినా, సమాచారం తదితర అంశాలకు హెల్ప్లైన్ను ఏర్పాటు చేశాం. ఇది 24 గంటలూ పనిచేస్తుంది. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లో వాటిని పరిష్కరించే విధంగా కార్యాచరణ చేస్తున్నాం.
70 శాతం కేంద్రాల్లో లైవ్ వెబ్కాస్టింగ్
లోక్సభ పరిధిలోని 2,061 పోలింగ్ కేంద్రాలకు గానూ సుమారు 1,800 కేంద్రాల్లో లైవ్ వెబ్కాస్టింగ్కు ఏర్పాట్లు చేస్తున్నాం. మిగతా వాటిల్లో వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్లు నిత్యం పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. ఒక్కో కేంద్రంలో పీవో, ఏపీవో, భద్రతా సిబ్బందితో పాటూ మొత్తం ఐదుగురు సిబ్బంది ఉంటారు. సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన 148 కేంద్రాల్లో కేంద్ర అదనపు బలగాలను మోహరించాం. ప్రతి కేంద్రంలో రెండు బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం. ఓటింగ్ సమయంలో అవి మొరాయించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లూ చేస్తున్నాం.
మహిళా సంఘాలతో సమావేశం..
గరిష్ఠ ఉష్ణోగ్రతల నేపథ్యంలో పోలింగ్ సమయాన్ని ఎన్నికల సంఘం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పొడిగించింది. మరో గంట సమయం పెంపు వల్ల గ్రామాలతో పాటూ పట్టణాల్లో పోలింగ్ కచ్చితంగా పెరుగుతుంది. ఓటేయడానికి వచ్చే ఓటరుకు కేంద్రంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాం. ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్న సౌకర్యాలపై పర్యవేక్షణ చేశాం. లోక్సభ పరిధిలో మొత్తం 53 శాతం మహిళా ఓటర్లే ఉన్నారు. వారంతా తప్పకుండా ఓటేసే విధంగా గ్రామ, మండల మహిళా సమాఖ్యలతో సమావేశం నిర్వహించాం. ఓటు చైతన్య కార్యక్రమాలు చేపట్టాం. వారి కుటుంబ సభ్యులంతా ఓటేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాదాద్రీశుడి జయంత్యుత్సవాలకు శ్రీకారం
[ 20-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో నారసింహుడు జయంత్యుత్సవాలు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా సోమవారం ఉదయం మొదలయ్యాయి. -
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసన మండలి(ఎమ్మెల్సీ) నియోజకవర్గానికి ఈ నెల 27న ఉపఎన్నిక జరగనుంది. -
గృహజ్యోతిపై భానుడి ప్రతాపం
[ 20-05-2024]
భానుడు గత పది సంవత్సరాల ఉష్ణోగ్రత రికార్డును అధిగమించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. -
డిగ్రీ విద్యార్థులకు దోస్త్
[ 20-05-2024]
ఇంటర్లో ఆయా కోర్సులు పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది చేరేది డిగ్రీ. తెలంగాణ ప్రభుత్వం కొన్నేళ్లుగా డిగ్రీలో ప్రవేశాలకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) వెబ్సైట్’ను ప్రారంభించింది. -
మరోసారి గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్
[ 20-05-2024]
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కీలకమైందని, పట్టభద్రులు విజ్ఞతతో ఓటేసి నిజాయతీ గల భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని శాసన మండలికి పంపాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. -
దర్జీగా.. ఇక దర్జాగా..!
[ 20-05-2024]
మహిళలు ఆర్థిక సాధికారత పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడులు మహిళలకు అప్పగించింది. -
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
రాష్ట్రానికి ఈ సారి ముందస్తుగా రుతు పవనాలు చేరుకుంటాయని, వర్షాలు కూడా గత ఏడాది కంటే ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. -
పట్టభద్రుల ఉప ఎన్నికకు రంగం సిద్ధం
[ 20-05-2024]
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. -
పదికి సంసిద్ధత
[ 20-05-2024]
తొమ్మిదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను రాబోయే 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పదో తరగతికి సంసిద్ధులను చేస్తోంది జిల్లా విద్యాశాఖ. -
అరచేతిలో పుస్తక ప్రపంచం
[ 20-05-2024]
పిల్లల్లో పఠనాసక్తిని పెంచేందుకు లిటరసీ క్లౌడ్ కార్యక్రమాన్ని విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. -
మోదీ పాలనలో కుంభకోణాలు లేవు: ఈటల
[ 20-05-2024]
భాజపా పదేళ్ల పాలనలో దేశంలో ఎలాంటి కుంభకోణాలు లేకుండా మోదీ పరిపాలించారని మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి: మంత్రి ఉత్తమ్
[ 20-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
ఎర్లీబర్డ్తో ఖజానాకు కాసులు
[ 20-05-2024]
పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్లు పెంచేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
[ 20-05-2024]
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడెం స్టేజీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
-
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!
-
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు.. రైసీ చివరి ఫొటో ఇదే..!
-
మరి కాసేపట్లో తెలంగాణ ఈసెట్ ఫలితాలు.. మీ eenadu.netలో
-
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!