logo

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సతీమణి ప్రచారం

రాయగిరి గ్రామంలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ఆయన సతీమణి చామల డింపుల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.

Updated : 09 May 2024 19:48 IST

భువనగిరి: రాయగిరి గ్రామంలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ఆయన సతీమణి చామల డింపుల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు తీరుస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారంటీలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రజలకు చేరువవుతాయని తెలిపారు. తన భర్త  చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు యాదగిరి, జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు సామల రవీందర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అవంతి, రాజేంద్రప్రసాద్, భువనగిరి పట్టణ మున్సిపాలిటీ ఛైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, ఎండీ పశువుద్దీన్, చింతల శివ, చింతల బద్రి, సార జీవన్, మహిళలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు