సరిహద్దులు దాటుతున్న తెలంగాణ మద్యం
వారం రోజుల క్రితం కోదాడకు చెందిన ఓ వ్యక్తి ఏపీ రాష్ట్రానికి మద్యాన్ని తరలిస్తూ.. నందిగామ పోలీసులకు పట్టుబడ్డాడు.
స్కూటీ డూమ్స్ కింద మద్యం సీసాలు తరలిస్తున్న దృశ్యం
వారం రోజుల క్రితం కోదాడకు చెందిన ఓ వ్యక్తి ఏపీ రాష్ట్రానికి మద్యాన్ని తరలిస్తూ.. నందిగామ పోలీసులకు పట్టుబడ్డాడు. తన స్కూటీని పలు భాగాలుగా విడగొట్టి డూమ్స్ మధ్యలో దాదాపు 100 మద్యం సీసాలను కనిపించకుండా దాచిపెట్టాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకోవడంతో అసలు విషయం బయటపడింది.
కోదాడ గ్రామీణం, న్యూస్టుడే: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి నేపథ్యంలో తెలంగాణ మద్యానికి డిమాండ్ పెరిగింది. చెక్పోస్టుల వద్ద పోలీసుల కళ్లు కప్పి మద్యాన్ని రాష్ట్ర సరిహద్దు దాటిస్తున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఒక వ్యక్తి 750 ఎంఎల్ గల ఆరు మద్యం బాటిళ్లను మాత్రమే తరలించాలి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యం పూర్తిగా నిషేధం. కాని సరిహద్దు నియోజకవర్గాల నుంచి కోట్లు విలువ చేసే మద్యం రాత్రికి రాత్రే ఏపీలోకి చేరుతోంది. దీనికి ప్రధాన కారణం ఏపీలో ఉన్న మద్యం పాలసీ. ధరలు అధికంగా ఉండటంతో అక్కడి ప్రజాప్రతినిధులు తెలంగాణ మద్యం దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. లారీలు, డీసీఎంలు, ప్రైవేటు వాహనాల్లో నిత్యావసర సరకుల కింద జాతీయ రహదారిలో తరలిస్తున్నారు. మరోవైపు ఎవరూ గుర్తించకుండా ఆటో సీట్ల కింద, స్కూటీ డూమ్స్ లోపలి భాగాల్లో మద్యాన్ని అమర్చి మరి తరలిస్తున్నారు.
పోలీసుల కంట పడకుండా..
నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజుర్నగర్, మిర్యాలగూడ, సాగర్ నియోజకవర్గాల మీదుగా ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలకు అక్రమంగా మద్యం కార్యకలాపాలు జరుగుతున్నాయి. కోదాడలోని నాలుగు మద్యం దుకాణాలు, నియోజకవర్గంలోని రెండు మండల కేంద్రాల్లోని నాలుగు మద్యం దుకాణాలు, చెక్పోస్ట్ సమీపంలో ఉన్న మరో దుకాణం నుంచి రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా అక్రమ రవాణాకు తెరలేపుతున్నట్లు సమాచారం. కొనుగోలు చేసిన మద్యంతో పోలీసుల కంట పడకుండా దొడ్డిదారిన సరిహద్దు గ్రామాల నుంచి ఏపీలోకి ప్రవేశిస్తున్నారు.
నిబంధనలు పాటించని దుకాణాలపై చర్యలు
-శంకర్, ఎక్సైజ్ సీఐ
మద్యం దుకాణాలు రాత్రి 10 గంటల వరకు మాత్రమే తెరచి ఉండాలి. రాత్రి వేళల్లో అక్రమాలకు పాల్పడే దుకాణాలపై చర్యలు కఠినంగా ఉంటాయి. ఎన్నికల నియమావళి పాటించని దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తాం. మద్యం తరలిస్తున్నట్లు సమాచారం అందిస్తే కేసులు నమోదు చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నకిలీ విత్తనాలు అరికట్టడంలో డీలర్లు సహకరించాలి
[ 20-05-2024]
నకిలీ విత్తనాలు అరికట్టడంలో డీలర్లు సహకరించాలని, నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని జిల్లా కలెక్టరు హనుమంతు కే.జెండగే తెలిపారు. -
ఎన్నికల నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలి
[ 20-05-2024]
ఎం.ఎల్.సి ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే సెక్టార్ ఆఫీసర్లకు, టీములకు సూచించారు. -
యాదాద్రీశుడి జయంత్యుత్సవాలకు శ్రీకారం
[ 20-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో నారసింహుడు జయంత్యుత్సవాలు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా సోమవారం ఉదయం మొదలయ్యాయి. -
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసన మండలి(ఎమ్మెల్సీ) నియోజకవర్గానికి ఈ నెల 27న ఉపఎన్నిక జరగనుంది. -
గృహజ్యోతిపై భానుడి ప్రతాపం
[ 20-05-2024]
భానుడు గత పది సంవత్సరాల ఉష్ణోగ్రత రికార్డును అధిగమించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. -
డిగ్రీ విద్యార్థులకు దోస్త్
[ 20-05-2024]
ఇంటర్లో ఆయా కోర్సులు పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది చేరేది డిగ్రీ. తెలంగాణ ప్రభుత్వం కొన్నేళ్లుగా డిగ్రీలో ప్రవేశాలకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) వెబ్సైట్’ను ప్రారంభించింది. -
మరోసారి గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్
[ 20-05-2024]
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కీలకమైందని, పట్టభద్రులు విజ్ఞతతో ఓటేసి నిజాయతీ గల భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని శాసన మండలికి పంపాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. -
దర్జీగా.. ఇక దర్జాగా..!
[ 20-05-2024]
మహిళలు ఆర్థిక సాధికారత పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడులు మహిళలకు అప్పగించింది. -
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
రాష్ట్రానికి ఈ సారి ముందస్తుగా రుతు పవనాలు చేరుకుంటాయని, వర్షాలు కూడా గత ఏడాది కంటే ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. -
పట్టభద్రుల ఉప ఎన్నికకు రంగం సిద్ధం
[ 20-05-2024]
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. -
పదికి సంసిద్ధత
[ 20-05-2024]
తొమ్మిదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను రాబోయే 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పదో తరగతికి సంసిద్ధులను చేస్తోంది జిల్లా విద్యాశాఖ. -
అరచేతిలో పుస్తక ప్రపంచం
[ 20-05-2024]
పిల్లల్లో పఠనాసక్తిని పెంచేందుకు లిటరసీ క్లౌడ్ కార్యక్రమాన్ని విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. -
మోదీ పాలనలో కుంభకోణాలు లేవు: ఈటల
[ 20-05-2024]
భాజపా పదేళ్ల పాలనలో దేశంలో ఎలాంటి కుంభకోణాలు లేకుండా మోదీ పరిపాలించారని మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి: మంత్రి ఉత్తమ్
[ 20-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
ఎర్లీబర్డ్తో ఖజానాకు కాసులు
[ 20-05-2024]
పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్లు పెంచేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
[ 20-05-2024]
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడెం స్టేజీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
మాపై బురద జల్లే ప్రయత్నమిది: రేవ్పార్టీ రూమర్స్పై జానీ మాస్టర్
-
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలివే..
-
నా కాల్ డేటా చూసుకోండి.. విచారణకు సిద్ధం: లావు శ్రీకృష్ణదేవరాయులు
-
చివరి రోజుల్లో నా తల్లికి ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స: మోదీ
-
నెతన్యాహుపై అరెస్టు వారెంట్.. కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్
-
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్.. మలికా గార్గ్ హెచ్చరిక