విమర్శలు చేసే.. విజయం కాంక్షించే
భువనగిరి లోక్సభ భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్కు మద్దతుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం రాయగిరిలో నిర్వహించిన బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.
కేంద్రమంత్రికి చిత్రపటాన్ని బహూకరిస్తున్న భువనగిరి భాజపా నాయకులు
ఈనాడు, నల్గొండ - న్యూస్టుడే, భువనగిరి : భువనగిరి లోక్సభ భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్కు మద్దతుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం రాయగిరిలో నిర్వహించిన బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. నియోజకవర్గంలోని భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్ నుంచి తరలివచ్చిన కార్యకర్తలు, పార్టీ నాయకుల్లో గెలుపుపై ఆశలు నింపేలా ఆయన ప్రసంగం సాగింది. సుమారు 30 నిమిషాలు ప్రసంగించిన అమిత్ షా ప్రధానంగా రాహుల్గాంధీ, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూనే గత పదేళ్లలో మోదీ హయాంలో దేశంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో భారాస గత పదేళ్లలో తీవ్ర అవినీతి చేసిందని ఆరోపణలు చేస్తూ..ప్రస్తుత రేవంత్ సర్కారు సైతం కాంగ్రెస్కు ఏటీఎంలా మారిందని దుయ్యబట్టారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అమలును ప్రశ్నించారు. భాజపా పాలనలోనే దేశం సురక్షితంగా ఉందన్నారు. కేంద్రంలో మరోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని..అందుకు తెలంగాణ కీలకంగా పనిచేస్తుందని ఉద్ఘాటించారు. భువనగిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో కేంద్ర ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ బూర నర్సయ్యను గెలిపించాలన్నారు.
అవీ...ఇవీ
- యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి ప్రణామం చేస్తూ అమిత్ షా తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
- కాకతీయుల రాణి రుద్రమదేవి, స్వర్ణగిరి వెంకటేశ్వర ఆలయం, కొమరవెళ్లి మల్లన్న, కొలనుపాక జైనమందిరాన్ని అమిత్ షా ప్రస్తావించారు.
- రాహుల్గాంధీని, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ప్రధాని మోదీ చేసిన పనులను చెబుతున్నప్పుడల్లా సభికుల్లో ఉత్సాహం నెలకొంది.
- షెడ్యూల్ కంటే సుమారు గంట ఆలస్యంగా సభ ప్రారంభమైంది. అమిత్షా దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ వైఫల్యంపైనే ఎక్కువగా మాట్లాడారు.
- భాజపా ఎంపీ అభ్యర్థి బూర తన ప్రసంగంలో సినిమా డైలాగ్లతో అలరించారు.
- కార్యక్రమంలో పార్టీ ప్రభారీ పాపారావు, నాయకులు కడియం రామచంద్రయ్య, నకిరేకంటి మొగులయ్య, ఆరుట్ల దశమంతరెడ్డి, నాగం వర్షిత్రెడ్డి, చందా మహేందర్ గుప్త, పడమటి జగన్మోహన్రెడ్డి, మాయ దశరథ, శివకుమార్, రత్నాపురం బలరాం, బందారపు లింగస్వామి, చిక్కా కృష్ణ, దయానంద్ గౌడ్, చందుపట్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
దిల్లీలో మోదీ... భువనగిరిలో బూర
- బూర నర్సయ్యగౌడ్
దిల్లీలో మోదీ, భువనగిరిలో బూర నర్సయ్య గెలుపు ఖాయమైంది. దీనిని ఎవరూ అడ్డుకోలేరు. కాంగ్రెస్ గెలిచేదీ లేదు, రాహుల్ ప్రధాని అయ్యేది లేదు. ఎంపీగా ఎన్నికవగానే దిల్లీలో తెలంగాణ భవన్ మాదిరిగా హైదరాబాద్లో భువనగిరి భవన్ను నిర్మిస్తాం. ఎదుటి పార్టీలు డబ్బు సంచులతో వస్తున్నారు. నా బలం మోదీ, బలగం కార్యకర్తలు. నా సిద్ధాంతం హిందూత్వం. కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసేవారే కరవయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాదాద్రిలో స్వామి అలంకార వేడుకలు
[ 20-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీనరసింహస్వామి వారి వార్షిక జయంత్యుత్సవాల సందర్భంగా సోమవారం రాత్రి అలంకార వాహన సేవోత్సవాన్ని నిర్వహించారు. -
నకిలీ విత్తనాలు అరికట్టడంలో డీలర్లు సహకరించాలి
[ 20-05-2024]
నకిలీ విత్తనాలు అరికట్టడంలో డీలర్లు సహకరించాలని, నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని జిల్లా కలెక్టరు హనుమంతు కే.జెండగే తెలిపారు. -
ఎన్నికల నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలి
[ 20-05-2024]
ఎం.ఎల్.సి ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే సెక్టార్ ఆఫీసర్లకు, టీములకు సూచించారు. -
యాదాద్రీశుడి జయంత్యుత్సవాలకు శ్రీకారం
[ 20-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో నారసింహుడు జయంత్యుత్సవాలు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా సోమవారం ఉదయం మొదలయ్యాయి. -
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసన మండలి(ఎమ్మెల్సీ) నియోజకవర్గానికి ఈ నెల 27న ఉపఎన్నిక జరగనుంది. -
గృహజ్యోతిపై భానుడి ప్రతాపం
[ 20-05-2024]
భానుడు గత పది సంవత్సరాల ఉష్ణోగ్రత రికార్డును అధిగమించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. -
డిగ్రీ విద్యార్థులకు దోస్త్
[ 20-05-2024]
ఇంటర్లో ఆయా కోర్సులు పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది చేరేది డిగ్రీ. తెలంగాణ ప్రభుత్వం కొన్నేళ్లుగా డిగ్రీలో ప్రవేశాలకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) వెబ్సైట్’ను ప్రారంభించింది. -
మరోసారి గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్
[ 20-05-2024]
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కీలకమైందని, పట్టభద్రులు విజ్ఞతతో ఓటేసి నిజాయతీ గల భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని శాసన మండలికి పంపాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. -
దర్జీగా.. ఇక దర్జాగా..!
[ 20-05-2024]
మహిళలు ఆర్థిక సాధికారత పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడులు మహిళలకు అప్పగించింది. -
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
రాష్ట్రానికి ఈ సారి ముందస్తుగా రుతు పవనాలు చేరుకుంటాయని, వర్షాలు కూడా గత ఏడాది కంటే ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. -
పట్టభద్రుల ఉప ఎన్నికకు రంగం సిద్ధం
[ 20-05-2024]
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. -
పదికి సంసిద్ధత
[ 20-05-2024]
తొమ్మిదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను రాబోయే 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పదో తరగతికి సంసిద్ధులను చేస్తోంది జిల్లా విద్యాశాఖ. -
అరచేతిలో పుస్తక ప్రపంచం
[ 20-05-2024]
పిల్లల్లో పఠనాసక్తిని పెంచేందుకు లిటరసీ క్లౌడ్ కార్యక్రమాన్ని విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. -
మోదీ పాలనలో కుంభకోణాలు లేవు: ఈటల
[ 20-05-2024]
భాజపా పదేళ్ల పాలనలో దేశంలో ఎలాంటి కుంభకోణాలు లేకుండా మోదీ పరిపాలించారని మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి: మంత్రి ఉత్తమ్
[ 20-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
ఎర్లీబర్డ్తో ఖజానాకు కాసులు
[ 20-05-2024]
పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్లు పెంచేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
[ 20-05-2024]
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడెం స్టేజీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!