జిల్లా.. చోరీల ఖిల్లా
జిల్లాలో దొంగతనాలు పెరుగుతున్నాయి. నిత్యం ఏదో ఒకప్రాంతంలో చోరులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇంటికి తాళం వేస్తే ఉన్నదంతా మాయం చేస్తున్నారు.
రెండు నెలల వ్యవధిలో రూ.2 కోట్లు దొంగలపాలు
కావలిలో ఇటీవల జరిగిన చోరీలో చెల్లాచెదురుగా పడేసిన వస్తువులు
న్యూస్టుడే, నెల్లూరు(నేర విభాగం): జిల్లాలో దొంగతనాలు పెరుగుతున్నాయి. నిత్యం ఏదో ఒకప్రాంతంలో చోరులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇంటికి తాళం వేస్తే ఉన్నదంతా మాయం చేస్తున్నారు. రెండు నెలల వ్యవధిలో జిల్లావ్యాప్తంగా రూ.2కోట్లకు పైగా విలువైన సొత్తు దొంగలపాలైంది. చోరీలు అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిఘా, సాంకేతికత దొంగలను కట్టడి చేయలేకపోతున్నాయి. నెల వ్యవధిలోనే వరుస ఘటనలు జరుగుతున్నా నియంత్రణ చర్యలు కనిపించడంలేదు. నగరంలోని 6 పోలీసుస్టేషన్ల పరిధిలో నిత్యం చోరీలకు సంబంధించి ఎఫ్ఐఆర్లు నమోదవుతూనే ఉన్నాయి. మోటారు సైకిళ్లు, కార్లు ఎత్తుకెళ్లిపోతున్నా పోలీసులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. జైలు నుంచి విడుదలైనవారే చోరీలకు పాల్పడుతున్నారని దర్యాప్తులో తేలింది. కేసులు వందల్లో నమోదవుతున్నా ఛేదించినవి మాత్రం తక్కువగా ఉంటున్నాయి.
రాత్రి గస్తీ ఏదీ..?
ప్రతి పోలీసుస్టేషన్ పరిధిలో రాత్రిబీట్ ఉంటుంది. ఒక బీట్కు కానిస్టేబుల్, హోంగార్డు ఉంటారు. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నిర్వహించాలి. పర్యవేక్షణకు అధికారులు ఉంటారు. బీట్ సిబ్బందిని ఉత్సాహపరిచేందుకు, తనిఖీలు చేసేందుకు ‘చాయ్ విత్ బీట్స్’ కార్యక్రమం గతంలో జరిగింది. ప్రస్తుతం ఇది సక్రమంగా సాగడంలేదనే విమర్శలు ఉన్నాయి. నగరంలో ఇటీవల అర్ధరాత్రి ఆర్టీసీ బస్సును కొందరు మందుబాబులు ఆపి గందరగోళం సృష్టించారంటే బీట్ వ్యవస్థ ఎలా ఉందో తెలుస్తోంది. చోరీల నియంత్రణకు నిరంతరం పాత నేరస్థులపై దృష్టి సారించాలి. వారి కదలికలు పరిశీలిస్తుండాలి. సీసీఎస్ విభాగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలి. నేరాలతో కలిగే అనర్థాలు, ఇతరత్రా వాటిపై కారాగారంలో ఖైదీలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
* ఏప్రిల్ 16న కావలి బృందావనం కాలనీలో దొంగతనం జరిగింది. ఇంట్లో అందరూ ఉండగానే నగదు ఎత్తుకెళ్లిపోయారు.పోలీసుల అంచనా ప్రకారం రూ.కోటిన్నరకు పైగా సొత్తు చోరీ జరిగింది. ఆ కేసు దర్యాప్తులో ఉంది.
* నెల్లూరు ఎన్సీసీ కాలనీలోని ఒక ఇంట్లో అర్ధరాత్రి దుండగులు ప్రవేశించారు. కుటుంబీకులను నిర్బంధించారు. ఉన్నదంతా ఊడ్చేశారు. రూ.లక్షల్లోనే సొత్తు దొంగిలించారు. నెలలు గడుస్తున్నా కేసు కొలిక్కి రాలేదు.
* నెల్లూరు గ్రామీణ పోలీసు స్టేషన్పరిధిలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. తాళం వేసిన ఇళ్లతోపాటు బంగారం దుకాణాల్లోనూ చోరీలకు పాల్పడుతున్నారు.
* తాజాగా కావలిలో పక్కపక్కనే ఉండే రెండిళ్లలో దుండగులు చొరబడి రూ.15 లక్షల సొత్తు అపహరించారు.
చర్యలు తీసుకుంటాం..
జిల్లాలో దొంగతనాలపై నిఘా ఏర్పాటుచేశాం. కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నిందితుల కదలికలపై దృష్టి సారిస్తున్నాం. త్వరలో దొంగలను పట్టుకుంటాం.
డాక్టర్ తిరుమలేశ్వరరెడ్డి, ఎస్పీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన
[ 27-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.25కు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. -
ఓటుతో.. వైకాపాను తరిమికొడదాం
[ 27-04-2024]
‘ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా వైకాపా అరాచక పాలనకు చరమగీతం పాడాలి. ప్రజల సంక్షేమం.. అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిగా కాదు.. -
అధికారమే అండ.. ఆక్రమణలే అజెండా!
[ 27-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక సాగునీటి వనరులకు రక్షణ లేకుండా పోయింది. ఖాళీగా కనిపిస్తే చాలు.. అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సాగునీటి కాలువలనే ఆలోచన లేకుండా కబ్జా చేస్తున్నారు. -
నిమ్మధరలు ఆశాజనకం
[ 27-04-2024]
పొదలకూరు నిమ్మ మార్కెట్లో శుక్రవారం 80 కిలోల నిమ్మకాయల బస్తా రూ.9500 పలికింది. రెండు రోజుల నుంచి నిమ్మ ధరల్లో అనూహ్యమైన మార్పు వచ్చింది. -
ఎన్నికల్లో అక్రమాలపై కఠినంగా వ్యవహరించండి
[ 27-04-2024]
ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్ టి దుధే పోలీసు అధికారులకు సూచించారు. -
జగనన్నా.. గొంతెండుతోందయ్యా!
[ 27-04-2024]
ఎండలు మండిపోతున్నాయి. నీటి వనరులు వట్టిపోతున్నాయి. దాహం తీర్చుకోవడానికి చుక్క నీరు దొరకడం లేదు. గొంతులు తడారిపోతున్నాయి. -
పట్టణాభివృద్ధిలో వైశ్యుల పాత్ర కీలకం: తెదేపా
[ 27-04-2024]
పట్టణ అభివృద్ధిలో ఆర్యవైశ్యుల పాత్ర కీలకమైందని తెదేపా అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని 30వ వార్డులో తెదేపా ఎన్నికల కార్యాలయాన్ని ఆర్యవైశ్య నాయకులు గాదంశెట్టి వేణుగోపాల్ నేతృత్వంలో ప్రారంభించారు. -
బాలయ్యా.. మా గుండెల్లో నీవేనయ్యా!
[ 27-04-2024]
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం కావలి, గుడ్లూరులో పర్యటించారు. -
జగన్ సర్కార్ ఉత్తుత్తి సాయం
[ 27-04-2024]
మహిళలను ఆర్థికంగా లక్షాధికారులు చేయాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం రుణాలు అందజేస్తామనీ, వృత్తి శిక్షణ కార్యక్రమాలు చేపడతామనే ఆశయం గాడి తప్పింది. -
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
[ 27-04-2024]
వైద్యసేవలు ప్రతి ఇంటికి అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం.. హెల్త్ క్లినిక్ సెంటర్లను ఏర్పాటు చేసింది. వైద్యసేవలను అందించేందుకు ఎంఎల్హెచ్పీలు సిబ్బందిని నియమించారు. -
వైకాపా పాలనలో కూలేందుకు సిద్ధం
[ 27-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ ప్రాంత ప్రజలకు అవస్థలు తప్పడం లేదు... పలు గ్రామాల్లో వంతెనలు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి...
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్