logo

కాంగ్రెస్‌ పాలనే మేలు

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పేదలకు మేలు జరుగుతుందని ఆ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు తెలిపారు. వింజమూరులో ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 16 Apr 2024 02:51 IST

వింజమూరు, నెల్లూరు జడ్పీ : కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పేదలకు మేలు జరుగుతుందని ఆ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు తెలిపారు. వింజమూరులో ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ గెలిస్తే అమలు చేయబోయే పథకాలను వివరించారు. ఉదయగిరి శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి సోము అనిల్‌కుమార్‌రెడ్డి కూడా మాట్లాడారు. టి. చంద్రశేఖర్‌, ఎల్‌. రాజేష్‌, మద్దూరు రాజగోపాల్‌రెడ్డి, చినమాలకొండయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.  నెల్లూరులో  కొప్పోలు రాజు, సీపీఎం నెల్లూరు నగర అభ్యర్థి మూలం రమేష్‌తో కలసి బాలాజీనగర్‌, ఏసీనగర్‌ ప్రాంతాల్లో ప్రచారం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని