కావలిలో తెదేపా ఎన్నికల ప్రచారం
దగదర్తి మండలం, ఉలవపాళ్ళ పంచాయతీలోని పలు ప్రాంతాల్లో తెదేపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కావలి: దగదర్తి మండలం, ఉలవపాళ్ళ పంచాయతీలోని పలు ప్రాంతాల్లో తెదేపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం జరిగింది. ప్రజలు వారికి పూల వర్షం కురిపిస్తూ.. మేళతాళాలతో స్వాగతం పలికారు. ఇంటింటికి తిరిగుతూ తెదేపా -భాజపా - జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా స్థానికంగా నివసాముంటున్న 20 కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలో చేరాయి. కార్యక్రమంలో కావలి నియోజకవర్గ తెదేపా నాయకులు, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు, దగదర్తి మండల పార్టీ ముఖ్య నాయకులు మాలేపాటి రవీంద్ర నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!