జగనన్నా.. ఈ ప్రాంగణాలేందన్నా!
ప్రయాణికుల క్షేమమే మా లక్ష్యం.. వారికే ప్రథమ ప్రాధాన్యం.. ఇవీ ఆర్టీసీ బస్సులు.. ప్రాంగణాల్లో కనిపించే నినాదాలు.
ప్రయాణికుల క్షేమమే మా లక్ష్యం.. వారికే ప్రథమ ప్రాధాన్యం.. ఇవీ ఆర్టీసీ బస్సులు.. ప్రాంగణాల్లో కనిపించే నినాదాలు. కానీ ఆచరణలో అమలుకావడం లేదు. బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు సౌకర్యాలు లేక నిత్యం యమయాతన పడుతున్నారు. దాహమేస్తే తాగేందుకు నీరు ఉండడం లేదు. కాసేపు కూర్చుందామంటే బెంచీలు కానరావు. ఇవి ఉంటే ఫ్యాన్లు ఉండవు. ఉన్నా తిరగవు. దీంతో వేసవిలో ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ప్రభుత్వంలో విలీనమైనా ప్రయాణికుల సౌకర్యాలపై దృష్టి పెట్టలేదు.
న్యూస్టుడే బృందం
ముక్కులు మూసుకోవాల్సిందే!
నెల్లూరు: నగరంలోని ప్రధాన ఆర్టీసీ డిపోలో ప్రయాణికులకు సరిపడా కుర్చీలు లేకపోవడంతో నేలపై కూర్చుంటున్నారు. తాగునీటి సదుపాయమూ అంతంతమాత్రమే.మరుగుదొడ్ల నుంచి వచ్చే దుర్వాసనతో ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడి నుంచి నిత్యం 250కి పైగా బస్సులు వెళుతుంటాయి. రోజుకు 50 వేల మందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారు.
విరిగిన కుర్చీలు
కందుకూరు పట్టణం : పట్టణంలోని డిపో పరిధిలో సుమారు 95 బస్సులు ఉండగా, నిత్యం 8 వేల మంది వస్తుంటారని అంచనా. వీరికి తాగేందుకు నీరు అందుబాటులో లేదు. కుళాయిల వద్ద అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. దుకాణాలకు వెళితే నిలువు దోపిడీ చేస్తున్నారు. అర లీటరు మంచినీళ్ల డబ్బా రూ.15 వసూలు చేస్తున్నారు. కూర్చునే బల్లలు కొన్ని విరిగిపోయాయి.
నీడ కరవు
దుత్తలూరు: వింజమూరు ఆర్టీసీˆ బస్టాండులో సేదదీరేందుకు వీల్లేదు. ఎండలో నిరీక్షించలేక సొమ్మసిల్లిపోతున్నారు. వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. మరుగుదొడ్లు, నీటి సౌకర్యం ఉన్నా ప్రయాణికులు కూర్చునేందుకు బల్లలు లేకపోవడంతో నిలబడి నిరీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఎండలు మండిపోతుండడంతో సమీపంలోని చెట్ల కింద సేద తీరుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ బస్టాండులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
ప్రయాణికులకు తప్పని కష్టాలు
తిరగని ఫ్యాన్లు
కావలి : పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఫ్యాన్లు ఉన్నా, కొన్ని మాత్రమే పనిచేస్తున్నాయి. నీటికీ ఇబ్బందులు తప్పడం లేదు. నిర్ణీత మొత్తం చెల్లించి వినియోగించే మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. బస్టాండ్ పరిసరాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. బస్టాండ్లో పైకప్పు పెచ్చులూడుతోంది. దీంతో ప్రయాణికులు ఇవి ఎక్కడ పైన పడతాయోనని ఆందోళన చెందుతున్నారు.
గుక్కెడు నీరూ కష్టమే!
ఆత్మకూరు : పట్టణంలోని పురపాలక బస్టాండ్లో వసతుల లేమి ప్రయాణికులను వేధిస్తోంది. తాగునీటి వసతి లేదు. ఈ బస్టాండ్ సముదాయంలో మరుగుదొడ్లు లేవు. ప్రయాణికులు అత్యవసర సమయంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి సమీపంలోని సులభ్ కాంప్లెక్్్సలోకి వెళుతున్నారు. చలివేంద్రానికి వెళ్లి దాహం తీర్చుకుంటున్నారు.
తాగునీటికి ఇక్కట్లే: ప్రభాకర్రెడ్డి, ఆత్మకూరు
పురపాలక బస్టాండ్లో తాగునీటి వసతి లేకపోవడంతో అవస్థలు ఎదుర్కొంటున్నాం. గతంలో ఉన్న పాత బస్టాండ్లో మినరల్ వాటర్ప్లాంట్ ఉండేది. దీన్ని తొలగించారు. ప్రస్తుతం వసతి అందుబాటులోకి తేలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికారులంతా వైకాపాకే కొమ్ముకాశారు: మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
[ 17-05-2024]
తాజా ఎన్నికల్లో అధికారులెవరూ తమకు సహకరించలేదని నెల్లూరు జిల్లా ఆత్మకూరు తెదేపా అభ్యర్థి, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. -
ఎడగారు పోయినట్లే!
[ 17-05-2024]
జిల్లాలో ఎడగారుకు సాగునీరు అందుబాటులో లేదు. రెండో పంటకూ దాదాపు ఇదే పరిస్థితి ఉంటుందని జల వనరులశాఖ అధికారులు చెబుతున్నారు. -
ఫలితాలపై పందేల జోరు!
[ 17-05-2024]
ఓ వైపు ఐపీఎల్ బెట్టింగ్ జోరుగా జరుగుతుండగా- మరోవైపు ఎన్నికల ఫలితాలపై పందేల హోరు పెరిగింది. పోలింగ్ ప్రక్రియ పూర్తయి మూడు రోజులు కాలేదు. -
ఆగని దోపిడి
[ 17-05-2024]
సైదాపురం మండలం తలుపూరు, కలిచేడు, ఊటుకూరు, జోగిపల్లి, పెరుమాళ్లపాడు, చాగణం, రాజుపాళెం, తిప్పిరెడ్డిపల్లి, లింగసముద్రం, పాలూరు గ్రామాల్లో పల్స్పర్, క్వార్ట్జ్, మైకా, వర్మిక్యులేట్ తదితర ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. -
డెంగీ నిర్మూలన అందరి బాధ్యత
[ 17-05-2024]
డెంగీ నిర్మూలన అందరి బాధ్యత అని డీఎంహెచ్వో డాక్టర్ పెంచలయ్య తెలిపారు. గురువారం జాతీయ డెంగీ డే సందర్భంగా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి బీఈడీ కళాశాల వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
ఉప్పు రైతుకు నష్టం
[ 17-05-2024]
వ్యాపారుల మాయాజాలంతో ఉప్పు రైతులు కుదేలవుతున్నారు. వారి చర్యల కారణంగా ఎన్నడూ లేని రీతిలో కిలో రూ.1.50కు తగ్గిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. -
ప్రవేశాలకు వేళాయె.. వసతులు కరువాయె!
[ 17-05-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు సమస్యల చదువులు చదువుతున్నారు. జిల్లాలో ఏటా వేలాది మంది విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్లో చేరుతుంటారు. -
చైతన్యమూర్తులు.. ప్రాణదాతలు
[ 17-05-2024]
సాయం చేయడానికి కావాల్సింది డబ్బు కాదు.. మంచి మనసు: మదర్థెరెసా ఈ మాటలను పలువురు స్ఫూర్తిగా తీసుకున్నారు. సమాజ సేవకు కదిలారు. -
పరుగుల్లో తేజస్సు
[ 17-05-2024]
ఉమ్మడి నెల్లూరు జిల్లా కోటకు చెందిన వెంకటేశ్వర్లు, కోటేశ్వరమ్మ దంపతుల కుమారుడు హిమతేజ. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. -
స్ట్రాంగ్రూముల వద్ద నిరంతర నిఘా
[ 17-05-2024]
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూముల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ సూచించారు. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
[ 17-05-2024]
బుచ్చి నగర పంచాయతీలోని ముంబై జాతీయ రహదారిపై రాఘవరెడ్డి కాలనీ వద్ద గురువారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో అయిదుగరికి గాయాలయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే